Sunday, April 27, 2025

ముస్లిముల మారణహోమం vs హిందూ కుల వ్యవస్థ

ముస్లిముల మారణహోమం vs హిందూ కుల వ్యవస్థ 

"మా తాతలకు తాటాకులు కట్టారు తెలుసా " 14 ఏళ్ల క్రితం , నా శ్రేయోభిలాషి / చిరకాల మిత్రుడొకడు చెప్పాడు.

అది నా మనసు ఎంతగా కలచివేసింది అంటే  ఈ రోజుకీ ఆ సన్నివేశం మర్చిపోను.

తరువాత కాసేపు శివసాగర్ & శ్రీ శ్రీ కవిత్వం చదివాం, దళితుల సమస్యలు తొలిసారి విన్నాను నేను.

.

అదే మితృడు మళ్ళీ పెహల్గామ్ మారణహోమం సందర్భంలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ,

'కులం పేరుతో మన దేశంలో పెట్టే మానసిక వేదన, చావు కన్నా ఘోరం" అని. 

తార్కికంగా ఆలోచిస్తే ఇవాళ్టి రోజు ఎంతవరకూ ఇది వర్తిస్తుంది?

.

ఇవాళ ఉన్న పరిస్థితులలో , రెండు సమస్యలను ఒకే గాటిన కట్టడం, పోల్చడం , అసలు ఈ రెండు సమస్యలను ఒకే వాదనలో వాడటం చాలా అన్యాయం అని నా అభిమతం.

గౌరవం లేకుండా అస్పృస్యులుగా బతికి ఉండటం చాలా ఘోరం, అది కాదనలేని సత్యం. 

కేసులు వేసి, కత్తులు గన్నులు పట్టీ , కవిత్వాలు రాసి , ఉద్యమాలు చేసి, త్యాగాలు చేసి   మొత్తానికి సమస్య వినపడేలా చేసారు ఆ రోజుల్లో .  

అందుకే స్వతంత్ర భారతంలో 1955లో మనమే అస్పృశ్యతను నిషేధించుకున్నాం.

రిజర్వేషన్లు, పధకాలు, ప్రత్యేక చట్టాలు అని 75 ఏళ్ల లో పరిస్థితి చాలా మార్చుకున్నాం. హిందువుల మనస్సులో కూడా అది తప్పు అని ఎప్పుడో నాటుకుపోయింది. ఎక్కడైనా ఒకటీ అర సంఘటనలు , మారుమూల గ్రామాలూ, ఇంకా అదే భావజాలంతో బతికి ఉన్న పాత తరాలు తప్ప, సభ్యసమాజంలో ఈ రోజు ఆ సమస్య "చాలా వరకు" నిర్మూలించబడింది. నా మటుకు నేనే ఎప్పుడూ ఎవరినీ నీ కులం ఏంటి అని అడిగిందిలేదు, నా చుట్టూ ఉన్న బంధువుల్లో ఒకరిద్దరి వద్ద తప్ప కుల జాడ్యం విన్నదీ లేదు. అసలు కులాలు ఏంటి మతాంతర వివాహాలు చేసుకునే వారు ఎక్కువ బ్రాహ్మణుల్లో. ఈ విషయంలో ఇంకా సంస్కరణలు నడుస్తున్నాయి, నడుస్తాయి , నడవాలి.

(ఇదే కులాల వ్యవహారంలో సైద్ధాంతికంగా , సూత్రం ప్రకారం,

ఇవాళ ఉన్న వికృతి రూపంలో కాకుండా "కులం ఎందుకు మంచిది", " బ్రాహ్మణులకు జరిగిన అన్యాయం"  అర్థం చేసుకునే 'ఓపెన్ మైండ్ ' ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే ఇదే వ్యాసం చివరి దాకా చదవండి  .)

ఇక జనాలు పడి ఏడ్చే వేదాలు , పురాణాలూ లో ఉన్న ఆ సదరు అస్పృశ్యత సంబంధించిన శ్లోకాలు (నిజా నిజాలు దేవుడి కెరుక.)

హిందువులు రోజూ ఎవరూ చదివేది లేదు ,

ఏ గురువూ వేదికలపై చెబుతున్నదీ లేదు.

కొంతమంది పనికిమాలిన సంస్కర్తలు  (ఏ ఉద్యోగం చెయ్యలేక, ఖాళీగా ఉంటూ, నిజమైన సాంఘిక సమస్యలు అర్థం కాక, ఏదొక పాచిపోయిన పాత సమస్యల గుడ్డుకి ఈకలు పీకే బాపతు సంస్కర్తలు),

ఈ మత మార్పిడి బాచ్చులు, లెఫ్ట్ , హ్యూమనిస్ట్ & రాజకీయ లబ్ది కోసం ఏమైనా చేసే వెధవలు వంటి వారు 

వేదికలెక్కి ఉదరకొడితే తప్ప అసలు ఇలాంటివి ఉన్నాయి అని ఎవరికీ గుర్తు రాదు.

మా శివుడు కాటి కాపరి, మా రాముడు క్షత్రియుడు, మా కృష్ణుడు యాదవుడు, జంతువుల అవతారాలు.

చివరికి చెప్పేది ఏమిటంటే,  దేశ కాల మాన పరిస్థితులను బట్టి సత్యం మారుతుంది, అది హిందువులకు తెలుసు కాబట్టే మార్పును ఒప్పుకునే గుణం ఉంది కాబట్టే, అనువుగాని దురాచారాలను మారుస్తూ సాంఘికంగా మనం మారాం.

.

ఇప్పుడు మనం ఇస్లాము మత ప్రాతిపదికన చేసే మారణకాండ గురించి మాట్లాడుదాం.

వారి చివరి ప్రవక్త ఆయనే (నా ఉద్దేశం లో తొలి & చివర ప్రవక్త ఆయనే ).

అంటే పుస్తకంలో పుట కాదు కదా పదం కూడా మారె ప్రసక్తే లేదు.

మరి ఆ పుస్తకంలో, ఇతర మతాలతో పొత్తు కుదరనీయని కొన్ని భావాలు క్లుప్తంగా ,

1. రోజు 5 సార్లు తప్పకుండా అల్లా తప్ప దేవుడు లేడు అని మైకు లో అరవాలి 

   (ఇదొక రకమైన బల ప్రదర్శన)

2. కాఫిర్లు (ముస్లిములు కాని వారందరు), ఎప్పటికి స్నేహానికి అర్హులు కారు, 

    వారిని నిర్ములించాలి , లేదా నియంత్రించాలి  (నాకు చాలా మంది ముస్లిము మిత్రులున్నారు

3. విగ్రహారాధకులు బతకడానికి అర్హులు కారు

4. గజ్వా - ఏ -హింద్  : ఆ రోజుల్లోనే మన దేశం ఎంత జ్ఞాన & సువర్ణ భూమి అంటే, 

   మన దేశాన్ని ఓడిస్తే స్వర్గమే అని చెప్పారు వాళ్ళ పెద్దాయన       (సదరు కులాల సమస్యతో నలిగిపోతున్న దేశం , స్వర్ణ భూమి , జ్ఞాన భూమి )

ఇలాంటి ఆణి ముత్యాలు చాలానే ఉన్నాయి.

మదరసాలలో ఇవే నేర్పిస్తారు.

మంచి మనుషులు / భయస్తులు వేదిలేస్తారు, దుర్మార్గులు పట్టుకుంటారు.

ఎవరూ ఖండించరు అలా మాట్లాడడాన్ని.

ఖండిస్తే మెడకాయ మీద తలకాయ ఉండదు.

సామాన్య సాటి మంచి ముస్లిము సైలంట్గా ఉంటాడు. మౌనం అర్ధాంగికారం.

నిత్యం గుర్తు చేస్తుంటే , దుర్మార్గులకు పుస్తకం ఊతం ఇస్తుంటే, తీవ్రవాదం ఎప్పటికి ఆగెను ?

సమస్య కాశ్మీరు, సమస్య పాకిస్తాను , ఇస్లాము మతాన్ని అనవద్దు అనడం అమాయకత్వం.

వారికీ ప్రక్షాళన అవసరం , వారూ మారాలి.

మన దేశం పేద దేశం అంటారు, అదే నోటితో, వాళ్ళకి మాత్రమే 8 పెళ్ళాలు 30 మంది సంతానం 

చట్టపరంగా వెసులుబాటుఇస్తారు.

సరైన చదువు చదివే అవకాశం లేని పేదరికంలో ఆ ముప్పై మందిలో కొందరు పుస్తకంలో ఆ పేరాలు బుర్రకెక్కించుకుని , తీవ్రవాదులు కాక రాష్ట్రపతులు అవుతారు ?

ముందు ఆ ప్రత్యేక చట్టాలు తీసెయ్యాలి, కుదిరితే ఆ పుస్తంలో పేరాలు కూడా తీసెయ్యాలి,లేదా అవి వల్లించేటప్పుడు ప్రతిసారి ఇది తప్పు ఆలోచన, ఈ కాలానికి పనికిరాదు అని విద్యార్థులకు వివరించాలి.

ఇది చేస్తేనే సమస్య తీరుతుంది, చేసే దమ్ముందా ? తలకాయ మీద ఆశ లేని వారున్నారా ?

.

మరొక మిత్రుడు చెప్పాడు, 'ఇస్లాముని విమర్శిస్తే నీ ముస్లిము మిత్రులు బాధపడతారు' అని.

నిజమే !!

నేను అక్క, అన్న,చెల్లి అని పిలిచే క్రైస్తవ & ముస్లిములు, ఆప్త మిత్రులు చాలామంది ఉన్నారు.

సౌదీలు కూడా మిత్రులున్నారు.

సమస్య మూలం అర్థం చేసుకోకుండా, మత ప్రాతిపదికన జరుగుతున్న మారణ హోమానికి బాధ్యత తీసుకోకుండా, కేవలం విమర్శకు బాధపడితే నేనేమి చెయ్యలేను. మిత్రులు అయితే అర్థం చేసుకుంటారు అని అనుకోవడం తప్ప.

1980 నుండి 2024 దాకా తీసుకుంటే, తక్కువలో తక్కువ 66,872 తీవ్రవాద దాడులు జరిగాయి, అందులో కనీసం 249,941 మంది చనిపోయారు. గూగుల్ ని అడగండి.

ఇది మానవాళికి తగిలిన శాపం అని మీకు అనిపించకపోతే అది మీ మానసిక స్థితి కె వదిలేస్తా.

సమస్య ఇస్లాములో ఉంది అని నా తర్కం, కాదంటే మీ ఉద్దేశం చెప్పండి. నేను ఉద్దేశం మార్చుకునేందుకు సిద్ధం.

అందుకే హిందూ దురాచారాలు , ముస్లిముల మారణకాండలు ఒకే గాటిన కట్టడం,

అతి తెలివికి, సమస్య నుండి పారిపోయే పలాయన వాదానికి, మూర్ఖత్వానికి ప్రతీక. అది తర్కం ముందు నిలబడదు.

 .

మొదటి సారి అస్పృస్యతకు సంబంధించి నాకు గుర్తున్నది, 

బాగా చిన్నప్పుడు,

మా పాలేరు వీరసత్తయ్య నన్ను సైకిల్ మీద పొలం కి తీసుకువెళ్తూ

నన్ను తగలకుండా కూర్చోండి, తగిల్తే 7 గంగల్లో స్నానం చెయ్యాలి అన్నాడు.

నాకు అర్థం కాక , అర్థం కాలేదు అన్న ముఖం పెట్టా.

అయ్ బాబోయ్ మీరు బేమ్మలు కదండీ, నన్ను ముట్టుకుంటే మైలడి పోతారు,

అప్పుడు మీరు ఏడు గంగల్లో మునగాలి అన్నాడు.

వెనక కూర్చున్న నాకు, 

మైల అంటే ఏమిటి అని అనుమానం 

మనిషి తగిలితేనే మైలా? సత్తయ్య చొక్కా గాలికి ఎగిరి తగిలితే మైలా కాదా ?

అని అనుమానం...

సైకిల్ నుంచి మైల అంటదా అని అనుమానం  ...

పొలం దెగ్గర ఈదురు గాలికి చొక్కా చిన్నగా తగిలింది,

తరువాత 2  రోజుల్లో  తేడా ఏమి తెలియలేదు నాకు, మైల పడటం వల్ల

అందుకనేనేమో అది మళ్ళీ ఎప్పుడూ నాకు అవసరపడలేదు & తారసపడలేదు.

నేనెరిగి మా నాన్నగారు కూడా ఎప్పుడూ అలాంటివి మాట్లాడలేదు.

నన్నెత్తుకు తిప్పిన రమణ , సుబ్బయ్య , సత్తిబాబు ఇతర రైతులు , పాలేర్లు

ప్రత్యేకించి బాతులు తో అందించడానికి నన్ను రోజూ తీసుకువెళ్లే మా నాన్నగారి మిత్రుడు

ఎవరి కులం నాకు తెలీదు కానీ బ్రాహ్మలు అయితే కాదు,

కాబట్టి కుల జాడ్యం ఎప్పుడూ నాకు అనుభవం లోకి రాలేదు !

కాకినాడ వెళ్ళాక పలానా కొంతమంది రాజులు ,పలానా వాళ్ళు చౌదరిలు అని

రాజమండ్రి వెళ్ళాక పలానా వాళ్ళు కాపులు అని,

జనాలు జట్లు కట్టుకుంటుంటే అర్థమయ్యింది.


 


(ఇంకా ఉంది )

No comments:

Post a Comment