మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచం మన ఆలోచనల్లోంచే పుట్టింది. ఈ ప్రపంచన్ని మార్చాలంటే మన ఆలోచనలను మార్చుకోవాలి.
Coal and Diamond are both carbon, its just how the atoms are arranged makes difference. Our thoughts are also same, they make us, its in our hands ! Thought is LIFE !
ఒక గుర్రపు వెంట్రుక తీసుకుని అందులో 10000 వంతు కొలిస్తే ఎంత ఉంటుందో, వేదాల ప్రకారం ఒక జీవి అంత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముల్లు కొన మనలో ఉన్న జీవానికి ప్రతీక.
చెరువు అంటే భూమి+నీరు+మొక్కలు+జల చరాలు ఇలా చాలా చెప్పొచ్చు, మానవ శరీరం కూడా అంతే.
సూది మొన అంత జీవం పై మూడు మడుగులు (చెరువులు), అంటే ఆ జీవాన్ని అంచెలంచెలుగా వ్యక్త పరుస్తూ, ఉల్లిపొరల్లా కప్పి ఉన్న కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు.
స్థూల శరీరం లేకుండా, మోక్షం పొందని జీవానికి, విముక్తి కోసం సాధన చేసే అవకాశం లేదు. స్థూల శరీరం ఉన్న జీవేమో ప్రాపంచిక విషయాల్లో కొట్టుకుపోతూ సాధన చెయ్యక విముక్తి పొందటం లేదు. అందుకే రెండు చెరువులు నిండలేవు ఒక దానిలో నీరు నింపలేదు అని పురందరదాసు అంటున్నారు.
* నింపని దానిలో ముగ్గురు పనివాళ్ళు, కుంటివాళ్ళు ఇద్దరు కాళ్ళు లేనిదొకడు
స్థూల శరీరం మూడు అవస్థలలో పడుతుంది. కౌమార, యవ్వన, వృధాప్య.
కౌమార దశ లో ఎం చెయ్యాలో తెలీదు, ఆటలు పాటలు తో గడిచిపోతుంది.
వృద్ధాప్యం శుష్కించి వ్యాధి మయం అయిన శరీరంతో ఏం చెయ్యలేక గడిచి పోతుంది.
ఇక యవ్వనం ప్రాపంచిక సుఖాలలో మునిగి తేలుతూ సాధన చెయ్యక గడుస్తుంది.
అందుకే పురందర దాసు కౌమార, వృద్ధ అవస్థలను కుంటి వారి గాను, ప్రయత్నమే లేని యవ్వన దశ ను కాలు లేని వాని గాను వర్ణించారు.
* కాళ్ళు లేని వాడివద్ద మూడు నల్ల గేదెలు, గొడ్డు గేదెలు రెండు దూడలేనిదొకటి
* దూడలేని గేదెవద్ద మూడు బంగరు మూటలు, రెండు ఎప్పుడూ మిగలలేదు ఒకటి ఎప్పుడూ వాడలేదు
* వాడని మూటకు ముగ్గురు సాక్షులు, ఇద్దరు గుడ్డివాళ్ళు ఒకరికి కళ్ళే లేవు
* కళ్ళు లేనివాడికి మూడు రాజ్యాలు, బంజరు భూములవి రెండు జనాలు లేనిది ఒకటి
స్థూల శరీరాన్ని పట్టుకుని ఉండే ప్రాణశక్తి వలన మనం వాయువు పీల్చుకోవడం, ఆరగించడం, తిన్నది అరిగించుకోవడం, కదలికలు, వాహకం, నరాల శక్తి, ఎముకల కదలిక, మాంస, మజ్జ, ఇతరత్రా అన్నీ కూడా జరుగుతాయి.
అంత్యేష్టి సంస్కారం అయ్యాక స్థూలశరీరం పంచభూతాలలో కలిసిపోతుంది, జీవుడు మాత్రం ఈ లింగశరీరాన్ని ఆశ్రయించి ఉంటాడు. ఉపనిషత్తుల వర్ణన ప్రకారం అంగుష్ఠమాత్రంగా హృదయంలో ఉన్న దీనిని లింగశరీరం అంటాము.
కారణ శరీరం: ఇది అనిర్వచనీయమైన శరీరం. మిగిలిన రెండు శరీరాలకు కారణభూతమైనది.
ఈ కారణశరీరం వల్లనే జీవునికి మరల వచ్చే జన్మలు ఆ జన్మల కారణాలు వాటిలో వచ్చే సుఖదుఃఖాలు నిర్ణయించేది. ఈ శరీరంలో మనస్సు బుద్ధి లేనందువలన కేవలం ఆనందం నివసిస్తుంది. సమాధి స్థితి, ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం ఈ కారణ శరీరం. మన సంస్కారాలు, పూర్వ జన్మ వాసనలు అన్నీ నిబిడీకృతమై ఉంటాయి ఇక్కడ.
జాగ్రదావస్థ యందు ఇంద్రియములతో చేసే కర్మల ఫలితాలను, వాసనారూపంలో కారణ శరీరంలో పొందు పరచబడి ఉంటాయి. ఇవి మరు జన్మకు కారణమవుతాయి. అలా మరుజన్మకు కారణమయ్యే వాసనలు దీన్లో ఉండటం వల్ల దీన్ని, కారణ శరీరమంటారు. కాని ఇది ఆత్మ కాదు.
సుషుప్త్యావస్థలో (గాఢ నిద్రలో) ఇంద్రియాలు మనస్సులో లీనమై ఉంటాయి. అంచేత అవి పనిచెయ్యక, బాహ్య అనుభవాలు మనకు రావు. ప్రాణ శక్తులు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ ప్రాణమే గాఢనిద్రలో శరీరం యొక్క సమస్త వ్యాపారాలనూ నడిపిస్తుంది.
మనస్సు
ఇంద్రియవృత్తులు, మనస్సూ తనలో (ఆత్మలో) లీనమై ఉంటాయి. అలాంటి సుషుప్తిలో ఈ కారణ శరీరం మాత్రమే భాసిస్తుంది/ ఉంటుంది. సుషుప్తిలో ఏమీ తెలియదు. సుషుప్తి నుంచి లేచాక నేను బాగా నిద్రపోయాను అని తెలుసుకొనేది మనస్సు.
ఆత్మ
ఈ మూడు శరీరాలకూ ఆత్మే సాక్షి. దేనితోనూ తాదాత్మ్యం చెందదు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు భిన్నంగా; స్వప్రకాశ రూపమై కర్తగా గాని , భోక్తగా గాని కాకుండా అన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చే ఆత్మయే మహాకారణ శరీరం. ఇది గాఢనిద్రలో అనుభవంలోకి వచ్చే స్థితి.