Sunday, January 10, 2021

మనువాద సమాజం ?

 మనవాద సమాజం అన్నారు 

ఎ మనువాద సమాజం ?

ఏ మనువాదాన్ని మీరు ఫాలో అవుతున్నారు ? 


మొత్తం 14 మన్వంతరాలు ఉన్నాయ్ 

అంటే 14 మంది మనువులు 


స్వాయంభువ మన్వంతరము

స్వారోచిష మన్వంతరము

ఉత్తమ మన్వంతరము

తామస మన్వంతరము

రైవత మన్వంతరము

చాక్షుష మన్వంతరము

వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము

సూర్య సావర్ణిక మనవు మన్వంతరము

దక్షసావర్ణి మన్వంతరము

బ్రహ్మసావర్ణి మన్వంతరము

ధర్మసావర్ణి మన్వంతరము

భద్రసావర్ణి మన్వంతరము

దేవసావర్ణి మన్వంతరము

ఇంద్రసావర్ణి మన్వంతరము


ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడింది.

ఇప్పుడు మనం 28 వ మహాయుగంలో ఉన్నాం


అంటే వైవస్వత  మన్వంతరము కలియుగంలో ఉన్నాం...


కృతయుగంలో "మనువు" రచించిన ధర్మశాస్త్రం ప్రమాణం

త్రేతాయుగంలో "గౌతముడు" రచించిన ధర్మశాస్త్రం

ప్రమాణం

ద్వాపరయుగంలో "శంఖలిఖితుల' రచించిన ధర్మశాస్త్రం

ప్రమాణం

>కలియుగంలో "పరాశరుడు" రచించిన ధర్మశాస్త్రం

ప్రమాణం


ఇప్పుడు ప్రమాణం కానిదీ, వ్యవహారంలోలేనిద ఐన

మను ధర్మ శాస్త్రాన్ని నిరసించడం, మనువాదం,

మనువాదులు అని ఒక వర్ణాన్ని అవహేళన చేయడం,

సనాతన ధర్మం పై ఒక ప్రణాళిక ప్రకారం మ్లేచ్చులు మొదలు

పెట్టిన దాడిని, మరింత ద్వేషం తో, ఆక్రోశం తో ఎడారి మతాలు ఇలా స్వదేశీయులని రెచ్చగొట్టడం

కొనసాగించడం తప్ప ఇతర కారణాలు కనబడవు.


ఇక ఈ ధర్మశాస్త్రాలలో ఏమి ఉంటాయి? రాజ్యాంగంలో

ఏమేమి అంశాలుంటాయో అవీ, వాటితోపాటు

ధర్మపాలనం ఉంటాయి. అలాగే రాజ్యాంగం

అనుమతించిన శిక్షాస్మృతిలో ఉంటాయో

ధర్మగ్రంథాలలోనూ అధర్మం చేసిన వారికి "ప్రాయశ్చిత్తము

లూ, శిక్షలూ, నెరపిన అధర్మం యొక్క తీక్షతని బట్టి రెండూ

ఉంటాయి"


మనుధర్మ శాస్త్రంలో మనిషి పుట్టుకప్పటినుండీ

జరపవలసిన నామకరణం నుండి ఉన్న షోడశ కర్మలు

చెప్పబడ్డాయి. గురువుని ఎలా గౌరవించాలి చెప్పబడింది.

అతిథిని ఎలా పూజించాలో చెప్పబడింది. ప్రభువు ప్రజలని

ఎలా కాపాడాలి, ప్రభువు సేవకులను ఎలా పరీక్షించాలి.

ప్రభువు వాడే వస్తువులను ఎలా జాగ్రత్త పరచాలి,

శత్రువుల బెడదలేకుండా ప్రభువుకొరకు చేసిన ఆహారాన్ని

ఎలా పరీక్షించాలి. వ్యాపారంలో కొలతలు, తూనికలు ఎలా

ఉండాలి వాటిని తరచూ ఎలా పరీక్షించాలి. తండ్రి తాను

సంపాదించిన ద్రవ్యాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు, ఎలా

ఇవ్వవచ్చు. ఆస్తులు పంచుకుంటే అప్పులు పంచుకోవడం

ఇవన్నీ మనుధర్మశాస్త్రంలో చెప్పారు. మన

రాజ్యాంగంలోనూ, రాజ్యాంగానికి అనుగుణంగా

చేయబడిన చట్టాల ద్వారా ఇవేగా మనకి ఇప్పుడు

అందుబాటులో ఉన్న వి


మనువు అందించిన ధర్మ సూత్రాలలోని కొన్ని

ముఖ్య మైనవి


పర స్త్రీ తనకు గౌరవనీయురాలనీ, ఆమెను సోదరిగా

భావించి "సోదరి" అని పిలవాలి. పరస్త్రీ వ్యామోహం

ఆయుక్షీణం ని కలిగిస్తుందనీ మనువు చెప్పాడు. (ఇవి

ఆచరించకనే, దీన్ని చదవద్దని చెప్తే పర స్త్రీతో ఎలా

మెలగాలో తెలియజేయలపోతేనే కదా నిర్భయ ఘటనలు

పునరావృతం అవుతున్నాయి)


కన్యా దానం లో ధనం తీసుకోవడం తప్పని, అలా చేస్తే

సంతానాన్ని అమ్ముకున్నవాడౌతగాడనీ మనువు చెప్పాడు.


ఇంటికి వచ్చిన "అతిథుల కులగోత్రాలను అడగడం -

వాంతి చేసుకున్న అన్నాన్ని పెట్టడంతో సమానం" అని

మనువు చెప్పాడు. (ఇది చాలదా మనువు

మానవత్వవాది అని చెప్పడానికి)


-ఎవరు గురువు, ఎవరు ఉపాధ్యాయుడు, ఎవరు

ఆచార్యుడు. చదువు చెప్పటానికి ఎవరు యోగ్యులు.

మితమైన ఆహారం ఎందుకు తీసుకోవాలి. భోగలాలస

ఎందుకుండకూడదు.


శ్రద్ధ తో పెట్టకపోతే ఎంత శ్రోత్రియుడిచ్చన అన్నమైనా

తినరాదు. చేసిన మంచిపనిని ఇతరులకు చెప్పి

డాంబికానికి పోకూడదు. (ఎక్కడ ఎవరికి

పెద్దపీటవేయాలో, అధర్మం చేస్తే ఎంత శిక్షవేయాలో

విస్పష్టంగా చెప్పబడింది)


> తేనెటీగలు ఏవిధంగా కొద్ది కొద్ది ఆహారం సేకరిస్తాయో

రాజు కూడా ప్రజలను కష్టపెట్టకుండా కొద్ది కొద్ది మాత్రంగానే

పన్నులు తీసుకోవాలి.


దోపిడీ దొంగతనాలకు, ఇళ్ళు తగలబెట్టడం వంటి

నేరాలకు శిక్ష కఠినంగా ఉండాలి.


 పెద్దలైనవారు వచ్చినప్పుడు ఎలా నమస్కరించాలి.

మంత్రులుగా ఎలాంటి వారిని నియమించుకోవాలి. లాంటి

ఎన్నో విషయాలు మనువు చెప్పాడు.


-సదాచారము వల్లనే దీర్ఘాయువు, సంపత్తి, విజ్ఞులైన

సంతానము కలుగుతారని చెప్పాడు. (సంసారులెవరూ

ఎవరూ పరిథులు దాటి, విశృంఖలంగా ప్రవర్తించాలి

కోరుకోరుగా, కుటుంబాన్ని ఆదరంగా పద్ధతిగా ఉంచుకుని

పిల్లలను పద్ధతిగానే పెంచాలని కోరుకుంటారు)


ఐతే అలాంటి గొప్ప విషయాలు చెప్పిన మనుస్మృతిని

అనేక రకాల విమర్శలకూ, కువిమర్శలకూ కూడా గురి చేసి

దానిని కాల్చేయడం వంటి అర్థం పర్థం లేని పని. దాని వెనక

కారణంగా మనుస్మృతిలోని అతి కొన్ని వివాదాస్పద

సూత్రాల వల్ల అని తెలుస్తుంది. వాటిలో కూడా

హెచ్చుశాతం అవగాహనాలోపం వల్లనూ, సంస్కృత భాషా

పరిచయం, పరిణతి తగ్గించడంలో మెకాలేవంటివారు

కృతకృత్యులవడం వల్లనూ, దేశం వదిలిన బౌద్ధులు తిరిగి

ఎరుపురంగు రూపంలో ప్రవేశించి దానికి జీవం పోయడం

వల్లనూ జరిగింది. పునరుక్తి కాదుకానీ, ఎప్పటిదో కాలానికి

సంబంధించిన ధర్మ గ్రంథాన్ని ఈ కాలానికి అన్వయం

చేసుకుని అది మాకు నచ్చలేదు కాబట్టి కాల్చేస్తాం అనడం,రాసినోన్ని నరికేస్తా అనడం 


అలాగే సనాతన ధర్మం లో వర్ణాశ్రమ ధర్మాలు

పాటించేవారిని హేళన చేయడం హేయమైన పని


_ సనాతన ధర్మం.....


Source :- Meghana Mukunda

Saturday, January 2, 2021

హిందూ మతంపై దాడులు

నాలుగు డబ్బులు పోగేసి, ఏదో ఇటుక రాయి తెచ్చి

గోడలు కట్టి సున్నాలేస్తే అయిపోయేవి కాదు మా గుళ్ళు !

యోగుల తపశ్శక్తితో, మహాత్ముల సంకల్పంతో మంత్ర యంత్రాలతో స్థాపించినవి !



రాజకియ లబ్ది కోసమో, మత మౌఢ్యం తోనో , గుళ్ళు పగలకొట్టి, మళ్ళీ అభివృద్ధి చేసేద్దాం అంటే 

అహింస అహింస అని ఊరుకోడానికి , హిందువులు వెన్నులేని వారుకాదు !

వందల సంవత్సరాలు ఇంతకు మించిన కుయుక్తులు పన్నినా, దారుణాలకు ఒడికట్టినా..

మా పూర్వికులు ప్రాణత్యాగం చేసారెతప్ప మారిపోలేదు !

ఎక్కువ చదువుకున్న మా తరం , వారి త్యాగాలు గుర్తు చేసుకుంటే చాలు !


దేవాలయాల సొమ్ముతిని తెగబలిసిన దుర్మార్గులు,

దేవుడి విగ్రహాలు పగలకొట్టి, 

రధాలు కాల్చి ,

ఆస్తి నష్టం కలుగచేస్తుంటే 

ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి కొమ్ముకాసేది కాంగ్రస్ అయినా, జగన్ కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా.. బీజేపీ అయినా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహుని రధ చక్రాలకింద నలిగిపోవల్సిందే !