Friday, May 13, 2022

హిందువులకు అత్యంత పవిత్రమైన గుళ్ళ పై ఆ ఏహ్య భావ చిహ్నాలను ఇంకా ఉంచాలా?

 ఇప్పుడు కాశీలో దేవాలయంపై కట్టిన జ్ఞాన్ వాపి మసీదు సమస్య మొదలు.

.
ముష్కరులు మన దేశంపై పడి, మన గుళ్ళను దోచుకుని,
వారి బలానికి,
ఇతర మతాలపై వారికి గల చులకన భావానికి చిహ్నంగా,
తర తరాలు గుర్తుండి పోయేలా మన గుళ్ళ పై వారి మసిదులను కట్టారు.
మరి హిందువులకు అత్యంత పవిత్రమైన గుళ్ళ పై ఆ ఏహ్య భావ చిహ్నాలను ఇంకా ఉంచాలా?
సున్నం వెయ్యని హిందూదేవాలయ స్తంబాలు ఆ అణచివేతను గుర్తు చేసి వెక్కిరిస్తుంటే సహించాలా?




సరే ఇవాళ జ్ణానవాపి మసిదు కూల్చి విస్వనాధుని గుడి స్వాధినం చేసుకుంటాం.. మరి రేపు ఇంకొక గుడి మీద కట్టిన మసీదు సమస్య వస్తే?
జనాలు ఇలా గొడవలు పడుతూ ఉంటే మత సామరస్యం, అభివృద్ధి ఎలా సాధ్యం?
.
మన దేశంలో గుళ్ళపై కట్టిన అన్ని మసీదులు కూల్చాలంటే,
తరాలు గడిచి పోతాయి,
ఎంత శాతం పురాతన మసీదులు మిగులుతాయన్నది ప్రశ్నార్ధకమే.
పై పెచ్చు జనాలు కొట్టుకు చస్తారు.
నాయకులు వోటు బేంకుల కోసం వాడుకుంటారు.
ఇది హిందువులు అలోచించాల్సిన విషయం.
.
అటు ముస్లిములు ఒక అడుగు ముందుకు వేసి,
మసీదులు వారికి పవిత్రం కాదు కాబట్టి అవి కేవలం మీటింగ్ హాల్స్ లాంటివే కాబట్టి,
చర్చలకు సిద్ధం,
సామరస్యంగా పరిష్కరించుకుందాం,
ఇందులో ఇతర ఉమ్మా (వెరే దేశ ముస్లిములు) కల్పించుకోకుండా చూసుకుంటామని హామి ఇవ్వగలగాలి.
.
ఇరు వర్గాలు కూర్చుని భారత దేశం మొత్తంలో ఒక 50 గుళ్ళు హిందువులకు ప్రాముఖ్యం అనుకున్నవి నిర్ణయించుకుని,
అక్కడ మసీదులు నిర్మూలించి గుళ్ళని పునః స్థాపిస్తే,
హిందువులు ఇతర గుళ్ళ విషయంలో రాజీ పడితే,
ఈ సమస్య వచ్చే తరానికి అంటుకోకుండా ఉంటుంది.
.
సెక్యులర్ జనాలు, కాస్త ఇరుపక్షాల మనోభావాలను గుర్తెరిగి, శాశ్వత పరిష్కార దిశగా తమ మద్దతు తెలపాలి.
.
లేదంటే ఇంకొక అధ్భుతమైన ఉపాయం ఉంది 🙂 (ఐతే ఇది జరగని పని, వారికి వారి ప్రార్థనా స్థలాలను ఎంత గొప్పగా కాపాడుకుంటారో బాగా తెలుసు ) .
అబ్రహామిక్ మతాల ప్రముఖ ప్రార్థనా స్థలాలు.. అంటే మక్కా మదినా, జెరుసలెము వంటి ఒక 50 మందిరాల లోగిలిలో అంతే వైభవం గా హిందూ గుళ్ళను నిర్మించి
మాకు మీ మతం అంటే ఎటువంటి ఏహ్య భావం లేదు అని తమ అభిమతాన్ని వ్యక్తీకరిస్తే,
హిందువులకు హజ్జ్ యాత్రలాంటి యాత్రకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తే...సమస్య తీరుతుందేమో !!!
ఏమంటారు???


अयोध्या मथुरा माया काशी काञ्ची अवन्तिका ।
पुरी द्वारावती चैव सप्तैते मोक्षदायकाः ॥
.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః
- గరుడ పురాణం
.
సనాతన ధర్మానుచరులకు మోక్ష దాయకమైన సప్త పురాలు - అయోధ్యా, మథుర, హరిద్వార్, కాంచిపురం, ఉజ్జయిని, ద్వారకా. వీటిని కట్టు దిట్టం చేసి మళ్ళీ ఎటువంటి ఆక్రమణ (భౌతికంగా, ధర్మ పరంగా, వ్యాపార పరంగా.. అన్ని విధాలుగా) జరగకుండా కాపాడుకోవడం మన బాధ్యత.
.
ఒక సారి జరిగితే పొరపాటు,
మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే అమాయకత్వం, అలసత్వం, బలహీనత్వం.



యుద్ధం ముగిసాకా యుద్ధ ఖైదీలకు విముక్తి లభిస్తుంది, మరి మా గుళ్ళకు విముక్తి తెచ్చుకోవడం తప్పా?
లేదా యుద్ధం ఇంకా కొనసాగుతోందనుకుంటున్నారా?



అరచేతిలో అమృతం ఉంటుంది అని చెప్పేవారు చిన్నప్పుడు

 అన్నం అరచేతికి తగిలెలా కలుపుకోవాలని, అరచేతిలో అమృతం ఉంటుంది అని చెప్పేవారు చిన్నప్పుడు.

కేవలం మునివేళ్ళకు తగిలేలా అన్నం కలుపుకు తింటే ఒప్పుకునేవారు కాదు ఇంట్లో.
.
బ్రిటిషు వాళ్ళు పోయినా, ఇంకా వారి పాదదాసులు కొంతమంది మాత్రం పలుగు పార పట్టుకుని తినడమే గొప్ప,
చేత్తో తినడం అనాగరికం అనుకుంటున్నారు.




అసలు ఈ నాగరికత పేరు చెప్పే దేశాలు అన్నీ మత మార్పిడి చేసేసారు ముష్కరులు.
హిందూ దేశంలో హిందుత్వ అనేది చెడ్డ మాటగా, సెక్యులర్ అంటే వెన్నెముక లేకపోవడంగా, తెల్లోళ్ళు ఎం చెస్తే అదే గొప్ప నాగరికత అని జనాలు అనుకునేలా తయారు చేసారు .
కడుక్కోడానికి మంచి నీళ్ళు లేవు కబట్టి ఎడారోళ్ళు, ఎంగిలిపీసోళ్ళ పద్దతులు అలా ఏడిసాయి.
నదీ పరివాహక ప్రాంతాల్లో పరిఢవిల్లిన మన ఆచారాలు శుభ్రంగా కడుక్కొమంటాయి, చేతులు.
చేత్తోనే తినమని చెప్తాయి.
.
సరే ఇప్పుడు మన వేదాలు చెప్పాయనో , ఆచారాలు ఘోషిస్తున్నాయనో చెప్తే మూఢ నమ్మకం కాబట్టి, గూగుల్ తల్లిని అడగండి.
విదేశీ వర్సిటీలు రీసెర్చులు చేసేసాయి, పేటెంటు తీసుకోవడమే తరువాయి.
.
వారు పేటెంటు తీసుకుని, ఎవో చేతికి రాసుకునే లెపనాలు కని పెట్టి , ఆ చెత్తో తినమని చెప్పేదాకా ,
అరిటాకులు వాడండి, అరచేతికి తగిలేలా కలుపుకు తినండి !
ఆరోగ్యానికి మంచిది !

ఇనప సామానుతో తినే తెల్లోళ్ళు ఆరోగ్యంగా లేరా అంటే.. ఉన్నారు, కావాలంటే కరోనాని అడగండి.