Sunday, March 27, 2022

కుక్కకు కిరిటం కట్టబెడితే కరవడానికి కాళ్ళు కావాలందంట

 కుక్కకు కిరిటం కట్టబెడితే కరవడానికి కాళ్ళు కావాలందంట.

కేరళ కు చెందిన కలాం పాషా ఒక జిల్లా జడ్జి.
ప్రముఖ మోహినీ ఆట్టం నృత్య కళాకారిణి నీనా ప్రసాద్ యొక్క నృత్య ప్రదర్శనను వాడు, "న్యూసన్స్ (గోల)" అని ఆపించేసాడు.
మరి రోజుకు అయిదు సార్లు మైకులో వచ్చే ఆజాన్ అదే కారణం చెప్పి ఆపించగలమా? తలలు తెగిపోవు?



.
ఇదే మార్చి నెలలో 700 వందల ఏళ్ళ క్రితం మనకొక గుణ పాఠం నేర్పింది కాలం.
గతం మర్చిపోయిన వారికి భవిష్యత్తు లేదు !
కాలం అవకాశమైతే ఇస్తుంది, మరచి పోయిన పాఠాలు నెమరు వేసుకోడానికి.
నిద్ర మత్తులో జోగుతూ ఉండే వారు తప్పకుండా అస్థిత్వం కోల్పోతారు.
మన బడిలో చరిత్ర పుస్తకాలు చెప్పని పాఠం.
జంబూద్వీప వాసులు తమ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోడానికి చేసిన
త్యాగాల సంగ్రహంలో,
ముస్లిం దండయాత్రల సంపుటిలో,
ఒక పేజీ - మార్చ్ 1323, శ్రీ రంగం, తమిళ నాడులో,
సరిగ్గా 699 సంవత్సరాల క్రితం.
ఘియాసుద్దీన్ తుఘ్లక్ కొడుకు ఉలుఘ్ ఖాన్ (ఏలియాస్ మొహమ్మద్ బిన్ తుఘ్లక్) శ్రీరంగం పై దండయాత్ర చేసాడు. దండయాత్రలు చాలా మంది రాజులు చేసారు కాని అరాచకం అన్నది శాంతి కాముక వర్గ రాజులకే చెల్లింది.
శ్రీ రంగం మీద దండయాత్ర జరగబోతోందన్న విషయం తెలుసుకున్న ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజనాథన్ వడులదేశిక, రంగనాథుని విగ్రహం మరియు నగలు ఊరు దాటించేసారు. వెల్లయి అనే దేవదాసి స్త్రీ వారి దృష్టి మళ్ళించి చివరికి ప్రాణ త్యాగం కూడా చేసింది.దండ యాత్రకు వచ్చిన తుఘ్లక్, 12000 మంది శ్రీ వైష్ణవుల తలలు తీయించాడు.
పన్నిరాయిరం తిరుముడి తిరుట్టిన కలబం అంటే - 12000 వేల తలలు నరికిన దండయాత్ర. అవి యుద్ధానికి వెళ్ళిన సైనికులవి కాడు, గుడిలో పుజకు వెళ్ళిన భక్తులవి. గుడి ని పగల కొట్టాడు. అదే చెత్తో పొయ్ సొల్వేస్వర గుడిని కూడా పగలకొట్టాడు.
మళ్ళీ విజయనగర సామ్రాజ్యం వచ్చాకా శ్రీ రంగం గుడికి పూర్వ వైభవం వచ్చింది.
.
ఇదంతా ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అంటే, కాలం మారినా .. ఉద్దేశాలు అవే ! పద్ధతులు మారాయంతే.
వాళ్ళు కేవలం రాజ్యకాంక్ష లేదా ధనం కోసం దండయాత్ర చెయ్యలేదు.
వాళ్ళకు వారు తప్ప అందరూ తప్పే.
వారికి విగ్రహారాధన, భక్తి పారవశ్యంలో లీనమై దేవుడి పై పాటలు పాడటం, నాట్యం చెయ్యడం లాంటివి తప్పు.
మనకు అవి మన సంస్కృతిలో భాగం. మన కళలు, మన వేదాలు పురాణాలు మన అస్థిత్వం.
ఉత్తర్ ప్రదేష్ లో , బాబర్ అనే వ్యక్తిని జై శ్రీ రాం అన్నందుకు, బీజేపి గెలుపును పొగిడినందుకు గాను చంపేసారు. అది వారి శాంతి.
నేన్య్ సామాన్య ముస్లిముల గురించి మాట్లాడట్లేదు. శంతి పేరు చెప్పి కత్తి దూసి మరీ 1400 వందల సంవత్సరలలో సగం భూమిని మతం మర్చిన వారి గురించి.
ఇప్పుడు యుద్ధాలు వీధుల్లో కాదు, వైజ్ణానికం గా ఆధునికంగా మనుషుల ఆలోచనా విధానాన్ని మారుస్తూ స్వీయపరాధభావంతో కుంగి పోయేలా చెస్తూ వారిని అనుసరించేలా చేస్తున్నాయి ఎడారి మతాలు.
నిజానికి, కుల సమస్య అయిన మత సమస్య అయినా మూల కారణం మనిషి స్వార్థం. ఆ స్వార్థంతో నక్క జిత్తుల ఎత్తుల వలలో పడకుండా, చారిత్రక సత్యాలు తెలుసుకోవడం, సత్యానికి దన్ను గా నిలబడటం మనం కర్తవ్యం.

Saturday, March 26, 2022

చిన్నప్పుడు తినక, పెద్దయ్యాక పెట్టక ఏడిపిస్తారు కొడుకులు

ఆశువుగా మాట్లడమన్నారు 

చిన్నప్పుడు తినక, పెద్దయ్యాక పెట్టక ఏడిపిస్తారు కొడుకులు 

అన్న నానుడి గురించి. 

నా స్పందన..





అవును. చిన్నప్పుడు,

పెట్టిన వెంటనే తినేసి

చెప్పినవన్నీ వినేసి

బుద్ధి మంతులుగా ఉంటే

ఏ సరదాలు, జ్ణాపకాలు లేకుండా

తల్లి తండ్రులు ముసలి వారిపోతారనేమో అని

నాలుగు దెబ్బలు తినడానికే సిద్ధపడి మరీ

అబ్బాయిలు అల్లరి చెయ్యాలని 

రాత రాసాడెమో దేవుడు !


పెద్దవారయ్యాకా, మళ్ళీ చిన్నవారయ్యే పెద్దలు

పండగకో పబ్బానికో కూతురొచ్చి

పిండి వంటలు ప్రేమగా వడ్డిస్తుంటే

ఇలా తిని ఎన్నాళ్ళయ్యిందో అని నసుగుతుంటే

అయ్యో నాన్న షుగరు పెరిగిపోతుంది

అమ్మో అమ్మ బీపీ ఎక్కువైపోతుందీ

అని మనసులో మధన పడుతూ

ఆడ పడుచుల ఆనందాన్ని కాదనలేక

రేపటి నుండి తల్లి తండ్రుల అవస్థను ఊహించలేక

ఇక చాలు అని వారికి నచ్చిన తిండి పెట్టని కొడుకులే

చిన్నప్పుడు తినక, పెద్దయ్యాక పెట్టక ఏడిపించే, 

ఈ కాలపు సగటు కొడుకులు !


కాదనను, ఎక్కడో ఉంటారు ఒకరిద్దరు కర్కోటకపు కొడుకులు, 

అక్కడక్కడా కనిపించే సీరియళ్ళ కోడళ్ళలానే !     -సత్యకీర్తి



Monday, March 21, 2022

కలియుగ వైకుంఠంలో ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు !

తిరుపతి బాలాజి దర్శనం

కలియుగ వైకుంఠంలో ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు !


* గోవిందుడు భక్త సులభుడా, వీ.అయి.పీ ప్రియుడా?
* శ్రీ వారి హుండీలో డబ్బులు ఎవరి బొక్కసంలో చేరుతున్నాయి?
* అంతంత జీతాలిచ్చి ఏర్పాటు చేసుకున్న ఐ.ఏ.ఎస్ , ఐ.పీ.ఎస్ వారు ఏమి చేస్తున్నారు?
* భక్తుల విరాళాల లెక్క పూచిక పుల్లతో సహా వెబ్ సైట్లో పెట్టే దమ్ముందా?
* వడ్డీ కాసులవాడి కాసులు ఖర్చు చేస్తూ ఇష్టాను సారం కొత్త నియమాలు చెయ్యడం రేట్లు పెంచడం కాకుండా, నెలలో ఎంత మంది తిరుపతి అధికారులు (సుబ్బారెడ్డి తో సహా) సర్వ దర్శనం క్యూలో వెళ్ళి గోవిందుడి దర్శనం చెసుకుంటున్నారు?
అప్పుడే కదా అసలు కష్టాలు తెలిసేది.
* Setup KIOSKs for LADDUS and MOBILES
* Setup mega lifts and Automatic rolling ramps to reduce the walk in darsanam lines
* ప్రభుత్వానికి చేత కాకపోతే గుడి నిర్వహణ మఠాలకు అప్పచెప్పొచ్చుకదా?
.
ఇవన్ని ఎందుకంటున్నాను అంటే,
దేవుడి దర్శనం కోసం ఎంతో కొంత కష్టపడాల్సిందే, తప్పులేదు, కానీ మరీ భక్తులు నొచ్చుకొనేంత, మళ్ళీ రావాలంటే భయపడేలా ఉందంటే మాత్రం నిర్వహణా లోపమే.గోవిందుడి దగ్గెర జీతం తిసుకుని మరీ ఆయనకు ద్రోహం చెసినట్టే !
.
పద్మావతి అమ్మవారి దర్శనం క్యూ లైన్, వీ అయి పీ బ్రేక్(VIP Break darshan) పేరు చెప్పి ఒక గంట పైగా ఆపేసారు.
వీఅయిపీ లు వచ్చినా, సర్వ దర్శనం మరియూ 300 లైన్లు ఆగకుండా ఏమీ చెయ్యలేరా? ఒకరిద్దరి కోసం అన్ని వేల మంది ఎందుకు ఆగాలి? ఎందుకు కష్టపడాలి?
.
ఇక శ్రీ వారి దర్శనం దారుణం !
1. అలిపిరి మొదటి మెట్టు దెగ్గరికి వెళ్ళడానికి ముందు ఉన్న టన్నెల్ దెగ్గర ఎటువంటి ఏర్పాట్లూ లేవు. ఫాన్లు, క్యూ పద్దతి కోసం రాడ్లు ఏమీ లేవు. తోసుకు పోయిన వారికి తోసుకున్నంత.
2. నడక దారిలో నా అరి కాలు కాస్త గాయపడింది. 9 కిలో మీటర్లలో ఒక్క డిస్పెన్సరీలో కూడా బేండ్ ఎయిడు లేదు. పాలాస్త్రి పట్టీ నేరుగా దెబ్బపై వేసుకుని నడవ వలసి వచ్చింది.
3. నడక దారిన వెళ్ళాకా, సెల్ఫోన్లూ , లగేజు 6-7 కౌంటర్లు పెట్టి త్వరగానే తీసుకున్నారు కానీ అక్కడా తోపులాటే, పోలిసు అధికారులు ఫేను కింద కూర్చున్నారంతే.
4. ఇక ఇక్కడ మొదలైంది నరకం, అన్ని గంటలు శ్రమ కోర్చి 9 కిలోమీటరు నడిచి వచ్చిన భక్తులకు ప్రత్యేక లైను లేదు. 5 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది.
5. చంటి పిల్లలు, నెలల చంటి గుడ్డులు, ముసలి వారు.. ఎవ్వరికీ ప్రత్యేక దర్శనం లేదు. మా ముందే ఒక సంవత్సరం పిల్లాడు క్యూ లైన్లో ఉన్నంత సేపూ ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత అమానుషమో తెలుస్తోందా?
6. 19 నంబరు కంపార్టు మెంటు నుండి బయట పడి , మళ్ళీ ఒక గంట క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఎక్కడి నుండో ఆది శేషుడు మమ్మల్ని చూడటానికి వచ్చాడు, మేమేమో "పాము పాము" అని భయపడి పరుగులు తీసి చిన్న పాటి తొక్కిసలాటతో సరిపెట్టుకున్నాం.
మీ అధికారులు ఎవరూ ఎలాగో లేరు కాబట్టి సిసీ టివి పనిచేస్తే వీడియో చూడండి , సరదాగా ఉంటుంది.
7. 15-20 ఫేన్లకు ఒక ఫేను పనిచేసింది క్యూ లైన్లో. రాత్రి స్లాట్ వాళ్ళూ మధ్యానం స్లాట్ వాళ్ళు కూడా పొద్దున్నే వచ్చేసారు, అంటే పట్టించుకునే వారు లేరు. తొక్కిసలాట, పిలల ఏడుపులు పెద్దల గొడవలు.
8. ఇది వరకు పాలు, మజ్జిగలు పొంగలి వంటివి Queueలో పెట్టినట్టు గుర్తు. ఇప్పుడు మంచి నీళ్ళ తో పాటు ఉక్కపోతలు, నిట్టుర్పులు , చెమట్లూ శాపనార్థాలు బోనస్.
9. దర్శనం క్యూలో బయలు దేరినప్పటి నుండి గర్భ గుడి దెగ్గరి దాకా ఎక్కడా క్యూ ని నియంత్రించే వారు లేరు. ఇష్టా రాజ్యం. ఆలయ ప్రాంగణంలో మాత్రం ఒక 30 మంది అధికారులు, పొండి , వెళ్ళండి, నడవండి అంటూ తోపుడు కార్యక్రమం.
కాస్త గోవింద నామ జపం చెయించారు, అదొక్కటి నయం.
10. పీ వీ ఆర్కే ప్రసాదు గారి చలవ వల్ల కట్టిన గోవిందుని ముందు రేంపు (wooden ramp) వల్ల, దర్శనం మాత్రం అద్భుతంగా జరిగి అంతవరకు వచ్చిన కోపం చల్లరింది.
ఇప్పటీ అధికారులు ఏమి చేస్తున్నారో అని మాత్రం కోపం వచ్చింది.
11. లడ్డూలు అయ్యిపోయాయ్ పక్క లైన్లోకి పొమ్మనడం వల్ల ప్రసాదం కవుంటర్లలో 3 లైన్లలో గంటన్నర నుంచుంటే కాని టోకన్ లడ్డూలు దొరకలేదు. లడ్డూ కియోస్కు (laddu kiosk) పెట్టొచ్చుగా?
12. ఫోన్లు తీసుకునేందుకు 6-7 కవుంటర్లు, తిరిగివ్వడానికి 1 కవుంటర్.
దాని వల్ల విపరీతమైన తొక్కిసలాట్, తిట్లు , గొడవలు. అడిగితే పాట పాడుకున్న వాళ్ళ ఇష్టానుసారం జరుగుతంది అని సమాధానం.
13. ఫోన్లు తిరిగివ్వడానికి కియోస్కు (kiosk) పెట్టొచ్చుగా?
14. దర్శనం క్యూలో నడక, లడ్డుల కోసం నడక, ఫోన్లకోసం నడక తగ్గించ గలిగితే మంచిది.
MEGA lifts, rolling ramp walks పెట్టండి ఎంత ఖర్చు అయినా. గోవిందుడి భక్తుల డబ్బులు వారికే ఖర్చు చెయ్యండి. ప్రభుత్వ జల్సాలకు, అన్యాక్రాంతం చెయ్యడానికి వాడకండి.
నా ముందు ఒక హిందీ అతను, చదువు కోని వాడిని సెల్ఫోను చిట్టీ పై సంతకం పెట్టమని తెలుగులో చెప్తే అతనికి అర్థం కాలేదు. అక్కడి వాళ్ళు అతనిని "మాలోకం సంతకం పెట్టరా" అనడంతో నాకు కోపం వచ్చి, మీరు భక్తులతో ఇలానా మాట్లాడేది అని అన్నా. నీ పని నువ్వు చూసుకో అని వాడి అనడంతో వాళ్ళతో గొడవ పడాల్సి వచ్చింది. ఇదా టిటీడి ఉద్యొగుల ప్రవర్తన?
.
కొండపై చిత్తశుద్ధి, భాద్యత, గోవిందునిపై భక్తీ గల సమర్థులైన అధికారులను నియమించడం కష్టమా?