Thursday, August 22, 2013

యాస ఏదైనా తెలుగు ఒకటే

భాష ఏదైనా భావమొకటే
యాస ఏదైనా తెలుగు ఒకటే







ఆంధ్ర మహాభాగవతమన్న నాటి పోతన
తిమిరంతో సమరమన్న నేటి దాశరథి
కంచెర్ల గోపన్న లేకున్న యాడ మన రామన్న?
సినారే లేకున్న తెలుగు సిత్రమేమున్నది
కళోజీ జీవన గీత, సోమన్న బసవపురాణమన్నా
గోరేటి వెంకన్న, గోన బుద్ధా రెడ్డి,
తెలంగాణ తెలుగు కవుల తిరుగులేదన్నా
లెక్క చెప్పమన్న పెక్కు పేర్లు కలవురన్న

త్యాగరాజన్న తెలుగు రాజు
అన్నమయ్య లేకున్న తెలుగే అనమయా
వెంగమాంబ కన్న వేరె అంబ ఉన్నదా?
క్రిష్ణదేవరాయలి అష్ట దిగ్గజాలు,
నంది తిమ్మన, అల్లసాని పెద్దన్నకట్టమంచివారు, జిడ్డు క్రిష్ణ మూర్తి గారు
తెలుగు తారలు వీరు విశ్వధాభి రామ
మా రాయలసీమ రతనాలసీమ

నన్నయ్య తెలుగుకన్నయ్య
తిక్కన, యెల్లాప్రగడలవల్ల భారతం పూర్తయిందయా
చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి
వీరిరువురే కదా తెలుగు పద్యానికి జిలుగు తెస్తిరి
అవధానాలకు ఊపిరి పోస్తిరి
వీరేశలింగం సార్ధకనామధేయం
దేవులపల్లి కృష్ణ పక్షం, చలం మైదానం, గోపిచంద్ చీకటి గోడలు
ఆత్రేయగారు, విశ్వనాథవారు, వేటూరిగారుకొడవగంటి గారు,  చక్రపాణి గారు
ఎన్ని పేర్లని ఎనగలము గోదారి జిల్లాలు కవుల గోదాములు














యాస వేరని భాషేవేరనీ
తెలిసీ తెలియని వాళ్ళు తెలివితక్కువవాళ్ళూ
గొడవపెట్టువాళ్ళు, గోడపైపిల్లులూ 
ఎవరైనానీది తెలుగు కాదనీ అంటే..
నవ్వి ఊరుకోకు, నమ్మి మోసపోకు
తెలుగు కవుల చరిత తెరచి చూపించు
తెలుగు వాడిగ నువు వాడి చూపించు

స్వార్ధానికి, అపార్ధానికి తెలుగు తేడానేమోగానీ
భావానికి, భావుకత్వానికి, స్రుజనకు స్రుజించే కలానికి కాదు

తెలుగు మన భాష, తెలుగే మన శ్వాస
తెలుగు తెలుగోయని ఎలుగెత్తి పలుకు
తెలుగోడిగా నువు తల ఎత్తుకు బతుకు
                                                                                                   --    -కీర్తి

Friday, August 16, 2013

ఏ రోజైతే..

ఏ రోజైతే
నేరస్తులకు నిష్పక్షపాతంగా శిక్షలు పడతాయో
విధించిన శిక్షలు ఖచ్చితంగా అమలవుతాయో,

నేర చరితులకు రాజకీయాలలోకి ప్రవేశముండదో
కారాగారాలనుంచి మంత్రాంగణం చెయ్యడం కుదరదో,


ఏ రోజైతే
వర్గ, కుల, మత, భాషా, ప్రాంత విభేదాలకు తావుండదో
భారతీయేతర భావాలకు విలువుండదో

మన ప్రతీ ఆలోచనలో "మనం" మిళితమై ఉంటుందో
మనపై మనకు ఆత్మ విశ్వాసం మిక్కిలిగా ఉంటుందో

.
.
.

(సశేషం)
.
.
.
ఏ రోజైతే
విధేయత, గౌరవ మర్యాద, ధర్మాచరణలకు
ధనం కన్నా ఎక్కువ విలువ కలుగుతుందో,

జండావందనం కేవలం ఒక సంకేతం కాకుండా
మన భావం, మన నడవడిక అవుతుందో,

ఆ రోజు మాత్రమే మనకు సంపూర్ణ స్వాతంత్రం సిద్ధిస్తుంది !




Monday, August 5, 2013

ఒక రాజు, ఏడుగురు కొడుకులు


అనగనగా ఒక ఊరిలో రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు.
ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఏడుగురు ఏడు చేపలు తెచ్చి వాటిని ఎండబెట్టారు.

సాయంత్రానికి ఆరు చేపలు ఎండాయి కాని, ఏడో చాప ఎండలేదు.
ఆ చేపను పట్టిన రాజకుమారుడు, చేపని “చేప చేప ఎందుకు ఎండలేదు” అని అడిగాడు.




ఆ చేప “గడ్డిమేటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది.

ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు.
గడ్డిమేటు “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని అంది.

రాజకుమరుడు ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు?” అని అడిగాడు.
“నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.

రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “ఎందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు?”
పాలెరాడు “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని అన్నాడు.

అమ్మని అడిగితే అమ్మ “ఆక్కడ పాప ఎడుస్తొంది” అంది.

రాజకుమారుడు పాపని “పాప, పాప, ఎందుకు ఏడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.


రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడి లాగ చీమని కూడ అడిగాడు “చీమ చీమ పాపని ఎందుకు కుట్టావూ?”

ఆప్పుడు చీమ “నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?” అని అంది !



చిన్నప్పుడు మా అమ్మ మాకు ఈ కథ చెప్పేది.
ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయి.
చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో ఎండు చేప లేదు