Tuesday, December 31, 2013

Test Execuition Using SMS/Mail


Once the task of ‘Automating’ is successfully completed and you are able to maintain the ‘Test Suite’ easily what would you like to do?
I have been always looking for chances like this to take that extra leap. Here is what I did.

I have successfully implemented the concept of executing tests by sending SMS from mobile or mail from Outlook for one of my clients!

The code works in 3 parts
Receiving SMS from mobile/mail from outlook and analyzing the message which is in predefined format
Executing a QTP test set
Replying the message results in predefined formats

Following are the uses/features of Automation through SMS/Mail which I implemented
1.       Start test
2.       Pause Test & Resume Test
3.       Stop Test
4.       Get results on mobile and mail  (different levels of detail, report format, for mobile & mail)
5.       Set configuration of Test / Test Set / Test Suite
6.    Over-riding instructions can be given for tasks that are not yet picked up
7.       Check Status of Test Execution
8.       If multiple users/mobiles are used for the same test,
1.       Their instructions will be carried out in a queue
2.       They will be applied on defined batch/test execution configuration
3.       Can check the queue of all the instructions by different users through sms/Mail
4.       Hierarchy among users tasks by using priority
9.       Confirmation of receipt of the instruction by an acknowledgement SMS (Sometimes, mobile messaging gets delayed or failed)

10.   Connects to test management tool QC and updates results if specified

Following are the steps:
Pre Requisite: A dedicated system to run the ‘ROBO’ script that analyses SMS/MAIL and does the test execution/ response part.
1.       Open an account with some sms provider (ex: ACL,BSNL)
2.       A URL will be provided by the provider on firing which messages sent from mobile can be viewed.
3.       Write a ROBOT application which continuously fires the URL and gets the messages at regular time intervals. Robot acts as a controller over test tool.
4.    Create an outlook object and read all unread mails with predefined subject
5.    Analyze the mail content
6.       Analyze the messages and continue with test execution

Below is the design for the same.




I was not able to pick up the complete code from client (its client copy right material and no part of it should be reproduced), below is just a sample of how same can be done using VBSCRIPT.

Code:

//read sms from provider
With CreateObject("InternetExplorer.Application") 
.Navigate "http://www.smscountry.com/ApiGetInbox.asp?user=<username>&passwd=<pwd>&FromDate=03/02/2012&todate=03/02/2013"
Do until .ReadyState = 4 
loop 
.visible = false 
With .document 
res_txt=.execcommand("SelectAll"  )
res_txt=.execcommand("Copy")
res_txt=.parentwindow.clipboardData.GetData("text")
end with
end with

(contd..)

Wednesday, November 13, 2013

మా ప్రధమ వార్షిక వివాహ మహోత్సవం !

కార్తీక శుద్ధ ఏకాదశి. ఉత్థాన ఏకాదశి.
చాతుర్మాస్యపు యోగ నిద్ర నుండి శ్రీ హరి మేల్కొనే రోజు.

సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశమ్భవమ్‌
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్‌..

నాకు ఈ రోజు ఇంకా ప్రత్యేకమైన రోజు
శేషశాయి నిద్ర మేల్కొని
నాల్గునెలలు కన్నులారా తన బిడ్దలను చూసుకోలేదని
వాత్సల్యంతో వీక్షించుచుండగా
శ్రీ హరిని చూసి ఆదిశేషుడు ఆనందంతో ఊగుతుంటే
అతని తోక తగిలి పాల సముద్రపు తుంపర్లు
మాపై తలంబ్రాలుగా పడుతుంటే



'నాతి చరామి ' అని నేను
శ్రీ హరి సాక్షిగా, ఆది శేషు సాక్షిగా
ముక్కోటి దేవతలు, వేదాలు, ఆగ్ని సాక్షిగా
బాస చేసిన రోజు ఇది

అమ్మ అక్క చెల్లి,
అత్త మామలు
బావ, బావమరుదులు
ఆత్మీయ బంధు మిత్రుల అందరి
ఆశిర్వచనముల నడుమ
రమ్యమైన వివాహ సంబరాన
'నేను రమ్య ' ఒక్కటైన రోజు ఇది !
తిధుల ప్రకారం ఇవాళ మా ప్రధమ వార్షిక వివాహ మహోత్సవం !

Saturday, November 2, 2013

నిన్ను నువ్వే తెలుసుకో

మరు జన్మమో, జన్మ రాహిత్యమో..
ఆధునిక పోకడ లో అంతటితో అంతమో..

ఎవరికి యెరుక?

ఆది నుండి అంతందాకా 'నేను ' అన్న పదానికి
నిర్వచనం 'శరీరం', 'మనసు ' !

నిన్ను నువ్వే తెలుసుకో
నీతో నిన్నే కొలుచుకో
ఎక్కువ తక్కువలు బేరీజు వేసుకో

క్రికెట్టు మైదానంలో ఫ్లడ్డు లైటు లా
ఓ ప్రక్క నిలబడి, పై నుంచి నిన్ను నువ్వే చూసుకో
నీ హృదయపు వెలుగులో
నీ ప్రతి చేష్టని చిట్టా రాసుకో


రోడ్డు దాటించి సాయం చేసినప్పుడో
రోడ్డుకడ్డం పడినందుకు బూతులు తిట్టినప్పుడో
నీ హృదయంలో నిన్నే తూర్పారబెట్టుకో

నిన్ను గురించి నువ్వు
నవ్వుకుంటూనో .. నొచ్చుకుంటూనో
మెచ్చుకుంటూనో .. మధనపడుతూనో
నీతో కాస్త నువ్వు గడుపు

ఎంత కాలం వారి కళ్ళలోంచో
వారి ఆశ నుంచో
నిన్ను నువ్వు నిర్ణయించుకుంటావ్?

నిన్ను నువ్వు చూసుకునే కళ్ళు నీవి కానంత కాలం
నీకు తెలిసిన నువ్వు నువ్వు కాదు
అది నీకు నువ్వు చేసుకుంటున్న మోసం
నీతో నువ్వు ఉండటం ఏకాంతం
ఒంటరితనమంటే వేరే ఉంటుంది
అదీ ఇది ఒకటే అనుకుని ఏకాంతం తప్పనుకోకు

కరెంటు పోయిన చిమ్మ చీకటి లోనో
కావాలని కల్పించుకున్న ఏకాంతంలోనో
నిద్దుర పట్టక నింగికి చూస్తూనో
గదికి ఒక మూల గొంతుకు కూర్చొనో

ఊహ తెలిసినప్పటి నుంచి
వేసిన తప్పటడుగులూ
చేసిన మంచి పనులూ
సమాలోచన చెయ్
అవసరమైతే చెప్పుతో కొట్టేయ్
నీ చెంపేమీ పగిలి పోదుగా?

నీ మెదడులో ప్రతీ పదం
నీ చేతలో ప్రతీ భావం
స్వచ్చమైన తెల్లటి వెలుగులో పరికించి చూసుకో

నిన్ను నువ్వే తెలుసుకో !



'జరుగుతున్న దానిపట్ల ఎరుక కలిగి ఉంటూ దానితోపాటు జీవించటమే ఆధ్యాత్మికత.
తాడును పాము అనుకోకపోవడమే యథార్థత.

'ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి యథార్థతను గ్రహించుకోకుండా భ్రమలతో, భయాలతో, దుఃఖాలతో బతుకుతున్నాడు, వీటినుంచి బయటపడటానికి భద్రతను వెతుక్కుంటున్నాడు. ఆ భద్రత, ఆస్తులు కూడబెట్టుకోవడంలోనూ, హోదా పెంచుకోవడంలోనూ లేదు. తనను తాను తెలుసుకుని, తనలో సంపూర్ణమైన మార్పు పొందినవాడే భద్రత సాధించగలడు' .

మనిషి మానసిక స్థితినిబట్టి అతడి చర్యలుంటాయి. తన చేతనలోను, అంతః చేతనలోనూ, లోపలిపొరల్లో ఉండే తన స్థితిని తెలుసుకోగలిగితే తానెందుకు భయపడుతున్నాడో, ఎందుకు దుఃఖపడుతున్నాడో అర్థంచేసుకుంటాడు. అలా వాటినుంచి విముక్తి పొందగలడు. అదే 'స్వీయజ్ఞానం'.

మనిషి భద్రతకోసం పడే ఆరాటంలో నుంచే కూడబెట్టుకోవడం, ఆర్జించుకోవడం అనే తత్వం వస్తుంది. గాఢోద్రేకాలూ, అసూయ, దుర్బుద్ధి... ఇవన్నీ కూడా ఆర్జించుకునే మనస్తత్వంలో నుంచే పుడతాయి. వాటినుంచి విడుదల కావాలంటే, తనలో జనించే ఆలోచనలను, వాటివల్ల శరీరంలో వచ్చే ప్రతిస్పందనలను అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆ అవగాహనే మనిషికి సత్యమంటే ఏమిటో తెలుసుకునే గ్రహింపునిస్తుంది.

జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్లుగా గ్రహించాలి. అంటే దానికి ఏ విధమైన ఊహలు, అపోహలు జోడించకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలిగితే- సత్యాన్ని తెలుసుకున్నట్టే.
ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనసు ఎటువంటి భయాలూ లేకుండా ఉండాలి. అలా మనసు అటూ ఇటూ తిరుగాడకుండా నిశ్చలత్వాన్ని పొందినప్పుడే సత్యాన్ని గ్రహించగలుగుతాం. అలా నిశ్చలమైన మనసును సాధించాలంటే మనసులో పుట్టే ప్రతి ఆలోచన పట్లా ఎరుక కలిగి ఉండాలి. వాటిని అవగాహన చేసుకోవాలి. ఆ నిశ్చలమైన మనసే అన్ని సంఘర్షణలనుంచి, దుఃఖాలనుంచి తప్పించగలుగుతుంది'.

స్మృతులు పనిచేస్తున్నంతవరకు మనిషి యథార్థతను కనిపెట్టలేడు. అందుకే వాటినుంచి విముక్తి పొందాలి అని మనసు తనకు తానే చెప్పుకొంటుంది. మనసు తాలూకు చేతన, అంతఃచేతనా అన్నింటినీ అవగాహన చేసుకుని ఎటువంటి కదలికా లేకుండా నిలిచిపోతుంది. ఈ స్థితిలో ఒక బ్రహ్మాండమైన సజీవశక్తి, శాంతి అప్రమత్తతా ఉంటుంది. ఆ శాంతమైన మనసులో చురుకుతనం, విస్తృతమైన ఎరుక ఉంటాయి. అక్కడ కేవలం అనుభూతి చెందుతూ ఉన్న స్థితి ఉంటుంది. ఆ స్థితిలోనే యథార్థాన్ని చూడగలరు. సత్యాన్ని తెలుసుకోగలరు. ఇదంతా తెలుసుకోవాలంటే మనిషికి తనను గురించి తాను తెలుసుకోవటం ఎంతో అవసరం.

Monday, October 14, 2013

రాజ్యం దోపిడీదారుల భోజ్యం - జాహ్నవి

ప్రతి దోపిడీ వెనుక రాజ్యం, లేదా రాజ్యాన్ని ఆసరా చేసుకుని బ్రతికే శక్తులే ఉంటాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం దోపిడీ కాదు. ఈ విషయాల్లో తప్పుడు మార్క్సిస్టు అవగాహనల నుంచి బయటపడితే తప్ప దోపిడీ మూలాలను గుర్తించడం, వర్గ చైతన్యం పెంచుకుని, దోపిడీకి వ్యతిరేకంగా జతకట్టి పోరాడడం సాధ్యం కాదు. ప్రజలు కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీల్లాంటి కృత్రిమ విభజనలకు లోనై తమలో తాము కలహించుకుంటూ అసలు దొంగైన రాజ్యాన్నే ఆశ్రయించి న్యాయం కోరడం, తీర్పు చెప్పమనడం హాస్యాస్పద విషాదం.
డబ్బు సంపాదించడానికి రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి, కష్టపడాలి, సంపాదించాలి, కొంత వాడుకుని మిగతాది పొదుపు చెయ్యాలి, దాన్ని మదుపు చెయ్యాలి (పెట్టుబడి పెట్టాలి), వచ్చిన లాభంలో కొంత వాడుకుని మిగతాది పొదుపు, మదుపు.. ఇలా. అటువంటివారు సంపద సృష్టికర్తలు. ఇతరులె వరినీ నష్టపెట్టకుండా యాంత్రీకరణ, పని విభజన, కొత్త సాంకేతిక ఆవిష్కరణల ద్వారా సంపద సృష్టించి లోక కళ్యాణానికి కారకులవుతారు. రెండో మార్గం-పైవన్నీ చేసి సంపాదించిన వాళ్ళ దగ్గర్నుంచి లాక్కోవడం. మానవజాతికి రెండు మార్గాలు సాధ్యమే. సంపద సృష్టించేవారు చిన్న స్థాయి మొదలుకుని, వ్యాపార, ఉత్పత్తి సంస్థలుగా, బహుళజాతి కంపెనీలుగా విస్తరిస్తారు. అలాగే లాక్కుని తినేవాళ్ళు కూడా దొంగల ముఠాలుగా, రాజకీయ పార్టీలుగా, ప్రభుత్వాలుగా, రాజ్యాలుగా ఏర్పడి ఎవరూ కన్నెత్తి చూడలేనంత పెద్ద పెద్ద సంస్థలుగా రూపొందుతారు.
అవి క్రమేపీ తమ పరిధులను విస్తరించుకుని, ఊడలు తీరిన మహావృక్షాలవుతాయి. ఈ వాస్తవిక కోణం నుంచి చూస్తే చరిత్ర అంతా కష్టపడి సంపాదించే వర్గం ఒకవైపు, వారిని దోచుకుని తినే పాలక వర్గం రెండోవైపు ఉండి, ఈ రెండు వర్గాల మధ్య జరిగిన సంగ్రామాల సమాహారంగా కనిపిస్తుంది. కాబట్టి, చరిత్రను వివరించడానికి వివిధ కాలాల్లో ఉన్న స్వేచ్ఛ, దోపిడీ పాళ్ళు, పరాన్నజీవితాలు, ఆర్థిక అణచివేత, ఆస్తి హక్కులు, వాటిని కాలరాసిన తీరు లేదా రక్షించిన సంస్కృతి-ఇవే ప్రధానాంశాలు కావాలి. అలా కాకుండా చరిత్రను రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, కట్టడాల రూపంలో వివరిస్తే, అది సారంలేని విశ్లేషణ, వృథా ప్రయాస అవుతుంది.
కొద్దిమందితో కూడిన పాలక వర్గం అసంఖ్యాక ప్రజా శ్రేణుల్ని శాసిస్తూ, దోపిడీ చెయ్యాలంటే, ప్రజల్లో వర్గ చైతన్యం చాలా నిమ్న స్థాయిలో ఉంచాలి. అంటే తాము దోపిడీకి గురవుతున్నామన్న విషయం, అది ఏ విధంగా జరుగుతోంది అన్న వివరాలు ప్రజలకు తెలియకూడదు, వాటిపై ప్రజల్లో విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయం రాకూడదు. వస్తే పాలకవర్గం పట్ల వ్యతిరేకతకు, విప్లవానికి దారితీస్తుంది, కొంపమునుగుతుంది. వర్గ చైతన్యం ప్రబలకుండా తీసుకునే జాగ్రత్తల్లో మొదటిది ఒక రాజ్యంగా, వివిధ చట్ట సంస్థలు, చ ట్టాలు ఏర్పరచడం. దాని ద్వారా సమాజంలో శాంతి, సుస్థిరతలు ఏర్పడతాయని బయటకు చెబుతారు. నిజానికి సుస్థిరమయ్యేది పాలకవర్గం, వారి ప్రత్యేక స్థానం, వారి విశేష అధికారాలు. ప్రజాదరణ కలిగిన సమానత్వం, స్వేచ్ఛ, ఆస్తి హక్కు లాంటి భావాలను పొందుపరుస్తూనే, పాలకవర్గాల ప్రత్యేక అధికారాలను, పాలితుల పరిమితులను చట్రాల్లో బిగించేస్తారు. ఉదాహరణకు పేరుకు ఆస్తి హక్కు ఉంటుంది, కానీ ప్రభుత్వం దానిమీద ఇష్టమొచ్చిన పన్నులు వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జాతీయం చెయ్యొచ్చు. అందరూ సమానమే కానీ మంత్రులు, అధికారులు, రాష్ట్రపతి, గవర్నర్లు, జడ్జీలు ఎవరూ ప్రశ్నించలేనంత ప్రత్యేక రక్షణలు కలిగి ఉంటారు.
స్వేచ్ఛ ఉంటుంది, కానీ ప్రభుత్వం ఎప్పుటికప్పుడు నిర్ణయించే పరిమితుల మధ్య మాత్రమే అనుభవించగలం. పాలితుల విషయంలో అమలయ్యే చట్టాలు, విధానాలు తమకు వర్తించకుండా చూసుకుంటారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, పాలకవర్గ ప్రయోజనాలకు మధ్య పేచీ వస్తే పాలకవర్గమే గెలిచేలా చట్టాలు రాసుకుంటారు. ప్రజల కష్టఫలం నుంచి కావలసినంత భాగం పన్నులు, సెస్సుల రూపాల్లో లాక్కోవడానికి ప్రశ్నించజాలని విశేషాధికారాలు కల్పిస్తారు. ఆ విధంగా కష్టపడే వారికి వారి కష్టఫలం మీద, వ్యక్తులకు వారి శరీరాల మీద హక్కు లేకుండా చేస్తారు. అదే అసలైన దోపిడీ. మార్క్సు దీన్ని ఎత్తి చూపకుండా, అదనపు విలువ, అదనపు శ్రమ సిద్ధాంతాల భ్రమలో కొట్టుకుపోయాడు. ఆస్తి హక్కులను చట్టపరంగా గుర్తించడం ద్వారా దోపిడీ వర్గాలు వర్గ న్యాయాన్ని (ఇజ్చూటట ఒఠట్టజీఛ్ఛి) అనుసరిస్తాయన్న మార్క్సు వివరణ శుద్ధ తప్పు. పాలకవర్గం తన వర్గ న్యాయాన్ని నిజానికి ఎలా అమలు చేస్తుందంటే - తాము కష్టపడకుండా తిని కూర్చోవడానికి వసూలు చేసే దాన్ని పన్నులంటుంది. అదే పని ప్రైవేటు వ్యక్తులు చేస్తే దాన్ని దొంగతనంగా జమకడుతుంది. ఈ వైరుధ్యం ద్వారా మాత్రమే పాలకవర్గ న్యాయం అమలవుతుంది.
దోపిడీ విధానాన్ని గుర్తించి, వివరించడంలో విఫలమైనా, రాజ్యం యొక్క మౌలికమైన దోపిడీ స్వభావాన్ని మార్క్సు సరిగానే గుర్తించాడు. సంక్షేమం పేరుతో సంపద పునఃపంపిణీ వ్యూహాల ప్రాముఖ్యతను, వాటి వెనుక ఉండే అసలు ఉద్దేశాలను కూడా సరిగానే గుర్తించాడు. సంక్షేమ పథకాలను కార్మిక వర్గానికి విసిరే రొట్టెముక్కలుగా అభివర్ణిస్తూ, వాటి కోసం ఆశపడి, విప్లవ అవసరాన్ని మరువవద్దని తన కరపత్రాల ద్వారా బోధించాడు. నిజానికి సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశం పాలిత ప్రజల్లో వర్గచైతన్యం పెరక్కుండా చూసుకోవడం, ప్రజల్లో రకరకాల విభజనలు తెచ్చి, అందరూ కలిసిపోకుండా, దోపిడీ వర్గానికి ఎదురు తిరగకుండా నిలువరించడం. ఈ వ్యూహపు ఫలితాలు కళ్ళెదుటే ఉన్నాయి. 'తింటే తిన్నాడు, మనక్కూడా కొంచెం పెట్టాడు కదా!' అనే ఆలోచనలు దీనికి రుజువు. పాలకవర్గ పదవులను ప్రజాస్వామీకరించి, తలా ఒక పదవి పడెయ్యడం కూడా ప్రజల్లో వర్గచైతన్యాన్ని తగ్గించి, విభజనలు సృష్టించే వ్యూహంలో భాగమే. అందుకే కొత్త పదవుల సృష్టి జరుగుతూనే ఉంటుంది. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, శాసనమండలి పునఃప్రతిష్ట, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, చివరికి ఆదర్శ రైతులు - ఇవన్నీ ఆ ప్రయత్నాలకు సాక్ష్యాలే.
మార్క్స్ కూడా సరిగ్గానే గుర్తించినట్లుగా ప్రచారం, ప్రాపగాండా, మభ్యపెట్టే కళల్లో రాజ్యం ఆరితేరింది. దోపిడీని నిజమైన స్వేచ్ఛగా నమ్మిస్తుంది. అవి నిర్బంధ పన్నులు కావు, స్వచ్ఛంద విరాళాలంటుంది. అది పౌర బాధ్యత అంటుంది. ఎవరూ ఎవరినీ పాలించడం లేదు, మనల్ని మనమే పాలించుకుంటున్నామని నమ్మబలుకుతుంది. వీటన్నిటికీ అంతులేని నిధుల్ని, తన శక్తియుక్తుల్ని వెచ్చిస్తుంది. రూ.500 కోట్లతో భారత్ నిర్మాణ్ ప్రచార భేరి ఇందులో భాగమే. ప్రాథమిక స్థాయి నుంచి పాఠ్యాంశాలను రాజ్యమే నిర్దేశించడానికి కారణమిదే. తద్వారా పాలకవర్గ సర్వసత్తాకతకు ఎక్కడా భంగం కలగకుండా, ఎటువంటి విరుద్ధ భావనలూ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పుడన్నా ఏదన్నా సంక్షోభం ఎదురైతే, సంపాదించేవారి స్వార్థాన్ని ఎత్తిచూపి, సరిపడా పన్నులు కట్టడం లేదని ఆడిపోసుకుంటారు. అంతేగానీ, పార్లమెంటు సభ్యులకు మూడొందల కోట్ల మార్కెట్ విలువ గలిగి, ఎకరం భూమిలో కట్టిన బంగ్లాలు, రాష్ట్రపతికి మూడొందల యాభై ఎకరాల ఎస్టేటు ఎందుకు అవసరమో పొరపాటును కూడా చర్చలోకి రానీయరు.
చివరగా, రాజ్యానికి, వ్యాపారస్తులకు - ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మార్క్సు ఎత్తిచూపడం సరైనదే. కానీ దాన్ని వివరించడంలో తప్పుడు అవగాహన చూపాడు. రాజ్యం ఆస్తి హక్కుల్ని కాపాడుతుంది కాబట్టి వ్యాపార వర్గాలు రాజ్యం మీద ఆధారపడుతున్నాయన్నాడు. అది శుద్ధ తప్పు. వాస్తవం దానికి పూర్తి విరుద్ధం. నిజానికి రాజ్యం రకరకాల రాజ్యాంగ అధికరణలు, చట్టాలు, పన్నుల వ్యవస్థల ద్వారా ఆస్తి హక్కులను కాలరాస్తుంది కాబట్టే వ్యాపార వర్గాలు రాజ్యం పంచన చేరతాయి. కొందరేమో తమ ఆస్తులను రాజ్యం లాక్కోకుండా చూసుకునేందుకు, కొందరేమో లైసెన్సులు తెచ్చుకుని లాభపడేందుకు, మరికొందరు రాజ్యం అండతో తమకు పోటీ లేకుండా చూసుకునేందుకు ఆశ్రిత పెట్టుబడిదారులవుతారు. కొన్ని దశాబ్దాల పాటు బజాజ్ స్కూటర్లు, అంబాసిడర్ కార్లు పోటీ అనేదే లేకుండా బ్లాకులో అమ్ముడయ్యేవి. తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ వాతావరణం 'అనుమతించే' సరికి అవేమయ్యాయి? కనుమరుగయ్యాయి.
ఒక రంగంలో గుత్తాధిపత్యాలు పోయి, పోటీ వాతావరణం వచ్చినా, రాజ్యం తన దోపిడీని వేరే రంగాలకు మళ్ళించింది. జలయజ్ఞం, స్పెక్ట్రమ్, బొగ్గు బ్లాకులు, కేజీ బేసిన్ కట్టబెట్టడాల ద్వారా ఊహాతీతమైన స్థాయిలో దోపిడీకి పాల్పడింది. అది బయటపడి వివాదాస్పదమైంది కాబట్టి ఇప్పుడు దోపిడీ ఇంకో రంగానికి మళ్ళుతుంది. మనకు తెలిసే లోగా గుటకాయ స్వాహా అయిపోతుంది. అందుకే వ్యాపార రంగం రాజ్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి ఆశ్రిత పెట్టుబడిదారీతనం ఒక నిరంతర వాస్తవం. రిజర్వు బ్యాంకు ఆధీనంలో బ్యాంకింగ్ రంగం వ్యాపార వర్గాలకు కృత్రిమమైన తక్కువ వడ్డీకి రుణాలందిస్తుంది. ప్రభుత్వానికి అవసరమైనన్ని నోట్లు ముద్రిస్తుంది. నగదు నిష్పత్తుల నిరంతర సవరణల ద్వారా బ్యాంకులు గాల్లోంచి డబ్బు సృష్టించే వెసులుబాటు కల్పిస్తుంది. ప్రజలు ఈ విష వలయం నుంచి తప్పించుకునే వీలు లేకుండా ఆదాయ పన్ను చట్టాలు, బంగారం మీద నియంత్రణ చట్రాలు గట్టిగా బిగిస్తుంది. అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలంటుంది. దాంతో ప్రతి లావాదేవీ పైనా రాజ్యం పెత్తనం ఉండి, ఎక్కడ కావాలంటే అక్కడ పన్ను విధించి దోచుకోవచ్చు.
ఇదీ అసలు దోపిడీ జరుగుతున్న విధానం. దోపిడీ శక్తుల వివరణ. ప్రతి దోపిడీ వెనుక రాజ్యం, లేదా రాజ్యాన్ని ఆసరా చేసుకుని బ్రతికే శక్తులే ఉంటాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం దోపిడీ కాదు. ఈ విషయాల్లో తప్పుడు మార్క్సిస్టు అవగాహనల నుంచి బయటపడితే తప్ప దోపిడీ మూలాలను గుర్తించడం, వర్గ చైతన్యం పెంచుకుని, దోపిడీకి వ్యతిరేకంగా జతకట్టి పోరాడడం సాధ్యం కాదు. ప్రజలు కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీల్లాంటి కృత్రిమ విభజనలకు లోనై తమలో తాము కలహించుకుంటూ అసలు దొంగైన రాజ్యాన్నే ఆశ్రయించి న్యాయం కోరడం, తీర్పు చెప్పమనడం హాస్యాస్పద విషాదం. మనం ఇరుక్కుపోయిన ఈ సాలెగూడు నుంచి తప్పించుకోవడమెలానో వచ్చేసారి చూద్దాం.
- జాహ్నవి

విభజన ప్రక్రియ, విపరీత రాజకీయాలు - ఆర్కే

తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అందులో న్యాయం ఉందని భావించారు. అందుకే తెలంగాణకు అనుకూలంగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం రగలడంతో ఆయా పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. అయితే బాధ్యతగల రాజకీయ పార్టీలు వైఖరులు మార్చుకోకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలి. విభజనను కొంతకాలం అడ్డుకోగలరు గానీ ఎంతో కాలం కాదని అందరికీ తెలుసు. అయినా ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు. ఎంతకాలం ఇలా? కేంద్ర ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరించకుండా సీమాంధ్రకు చెందిన నాయకులతో సమస్యలపై చర్చల ప్రక్రియ ప్రారంభిస్తే పరిస్థితులు శాంతిస్తాయి.

రాష్ట్ర విభజన 2014 ఎన్నికలలోపు జరుగుతుందా? లేదా? ఇదే ఇప్పుడు తెలుగు ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు మాత్రం "మీ ఇష్టం. మీరు ఎలాగైనా ఊహించుకోండి'' అన్నట్టుగా భిన్న ప్రకటనలు చేస్తూ, ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ హడావుడిగా విభజన ప్రకటన చేయడమే తప్పు అనుకుంటే సీమాంధ్ర ప్రజల ఆందోళనను ఖాతరు చేయకుండా, వారిని సంతృప్తిపరచకుండా ఎన్నికలలోపే విభజన ప్రక్రియ పూర్తిచేయాలనుకోవడం రెండో తప్పు. వాస్తవానికి తెలంగాణవాదులు సైతం ఎన్నికలలోపే రాష్ట్రం ఏర్పడుతుందని భావించలేదు. తెలంగాణ ఇవ్వబోతున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటిస్తే చాలు అని ఆశించారు. అయితే రాష్ట్రంలోని ఉభయ ప్రాంతాలలో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో తెలంగాణలోనైనా రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ విభజన ప్రకటన చేసింది.
దీంతో సీమాంధ్ర ప్రజలలో మా పరిస్థితి ఏమిటన్న ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితులలో ప్రజలను సంతృప్తిపరచవలసిన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు పూటకో మాట చెబుతూ మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్ర నాయకులకు కూడా రుచించడం లేదు. ఇటీవల జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని బి.జె.పి. అగ్ర నేత ఎల్.కె.ఆడ్వాణీ పలకరించి "ఇదేమిటి- విభజన విషయంలో మీ పార్టీ ఇంత గందరగోళంగా వ్యవహరించింది'' అని అడిగారు. ఆడ్వాణీ మాత్రమే కాదు చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. విభజనకు సంబంధించిన అంశం శాసనసభ ముందుకు రెండుసార్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ ప్రకటించగా, అదేమీ లేదు ముసాయిదా బిల్లు మాత్రమే పంపుతామని హోం మంత్రి షిండే ప్రకటించారు. ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రకటనలు సీమాంధ్ర ప్రజలను బాధిస్తున్నాయి. తెలంగాణ కోసం ఇంతకాలంగా పరితపించిన తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచినట్టుగానే సమైక్యంగా ఉండాలని ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజలను కూడా సంతృప్తిపరచడానికి చర్చలు జరపవలసిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది.
అయితే అదేమీ చేయకుండా "మీ గురించి మేం ఆలోచిస్తాం'' అని అనడంలో ఔచిత్యం ఏమిటి? అదే సమయంలో విభజన ప్రక్రియకు గడువు లేదనీ, 2014 ఎన్నికలలోపు లేదా తర్వాత కూడా జరగవచ్చునని ఒకరు ప్రకటిస్తే, డిసెంబర్ లోపు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే 'గడువు' అనే పదాన్ని తొలగించామని మరొకరు అంటారు. అంటే మరో నెలన్నరలోపు విభజనతో ముడిపడి ఉన్న అన్ని అంశాలనూ పరిష్కరిస్తారని భావించాలి. శీతాకాల సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టాలంటే నవంబర్ చివరి నాటికి బిల్లుకు తుది రూపం ఇవ్వాలి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అంటున్నారని కాదు కానీ, విభజనకు సంబంధించి సంక్లిష్టమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఢిల్లీలో కూర్చుని వాటిని పరిష్కరించాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. హైదరాబాద్ విషయంలో సీమాంధ్ర ప్రజల మానసిక అనుబంధాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.
హైదరాబాద్ భౌగోళికంగా తెలంగాణలోనే ఉండవచ్చు గానీ, 'ఈ నగరం మా రాజధాని' అని సీమాంధ్రులు ఇంతకాలంగా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు మీది కాదనడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో తెలంగాణవాదులు కొందరు సూటి పోటి మాటలు అంటున్నారు. హైదరాబాద్‌లోనే కాదు- తెలంగాణ జిల్లాలలో ఉంటున్న సీమాంధ్రులను అక్కడి తెలంగాణ ప్రజలు తెలిసో తెలియకో "మీరు ఎప్పుడు వెళ్లిపోతున్నారు'' అని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారిలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి. విభజన విషయంలో వెనక్కి వెళ్లేది లేదని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు, ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాలలో ఉన్న సీమాంధ్రుల ఆస్తులకు, జీవితాలకు భరోసా కల్పించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటే సమస్యను సాఫీగా పరిష్కరించవచ్చు. "మాకు హైదరాబాద్‌లో రెండు పోర్షన్ల ఇల్లు ఉంది.
అందులో ఒక పోర్షన్‌లో తెలంగాణ వ్యక్తి అద్దెకు ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన ప్రకటన చేసిన తర్వాత అద్దె ఇవ్వడానికి ఆయన నిరాకరిస్తున్నారు. మీరు ఎలాగూ మీ రాష్ట్రానికి వెళ్లిపోతారు కనుక ఈ ఇల్లు నాదే అవుతుందని సదరు తెలంగాణ వ్యక్తి వాదిస్తున్నారు'' అని సీమాంధ్రకు చెందిన ఒక వ్యక్తి వాపోయారు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సీమాంధ్రులలో నెలకొన్న ఈ అభద్రతా భావాన్ని తొలగించడానికి ఏమి చర్యలు తీసుకోబోతున్నారో లీకుల రూపంలోనైనా కేంద్ర పెద్దలు వెల్లడిస్తే సీమాంధ్రలో పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంది.
- ఆశ.. భయం.. ఉద్యమం!
వాస్తవానికి విభజన వల్ల తెలంగాణ ప్రజలకు ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. అదే సమయంలో సీమాంధ్రులు భయపడుతున్నట్టు వారికి జరిగే నష్టం కూడా అంతగా ఏమీ ఉండదు. మనుషులకు ఉండే బలహీనతలలో ప్రధానమైనవి ఆశ- భయం. ఈ రెండింటినీ ఆసరాగా చేసుకునే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రజలలో అంతులేని ఆశలు కల్పించారు. మొదట్లో అన్యాయానికి, దోపిడీకి గురవుతున్నారని తెలంగాణ ప్రజలను భయపెట్టిన కె.సి.ఆర్., తర్వాత క్రమంలో ఆశలు కల్పించి పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకున్నారు. 2004 ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే ప్రజలను భయపెట్టారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు మళ్లీ పెంచేస్తారని భయపెట్టి అధికారంలోకి వచ్చారు. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే తెలంగాణను అమ్మాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటుకు ఆయన చేసిన పోరాటం కారణం కావచ్చు గానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన పాత్ర ఏమిటనేది ప్రశ్నార్థకం.
అది తెలిసి కూడా ఆయన నోరు పట్టకుండా హామీలు గుప్పిస్తూ ఉంటారు. ప్రజలు అమాయకంగా వాటిని నమ్ముతున్నారు కూడా. "మా తెలంగాణ మాకు ఇవ్వండి'' అని చంద్రబాబునాయుడిని ముఖం మీదే అడగడం ద్వారా అప్పట్లో సంచలనం సృష్టించిన ఫణికర మల్లయ్యను, తెలంగాణ వస్తే నీకు కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించగా, 14వ తరగతి అంటే డిగ్రీ చదువుతున్న తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని బదులిచ్చారు. డిగ్రీ చదివినంత మాత్రాన సర్కారీ కొలువు ఎలా వస్తుందనుకుంటున్నావు అని అడిగితే "గంతేనా! వాళ్లు గట్లనే చెబుతున్నారు. అందుకే నమ్ముతున్నాను'' అని ఆయన అన్నారు. మల్లయ్య ఉదంతాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే ఆయనను ఉద్యమ నాయకులు వాడుకున్నారే గానీ, ఆయనకు ఉపయోగపడలేదు. మల్లయ్యకు రెండు ఎకరాల భూమి కొని ఇస్తానని రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీని కె.సి.ఆర్. ఇంతవరకు నిలబెట్టుకోలేదు. తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మల్లయ్యను వాడుకున్నారు. ఆయన చేతులతో పత్రికను ప్రారంభింపజేశారేగానీ జేబులో పది రూపాయలు కూడా పెట్టలేదు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, విడిపోయినా పేదవాళ్ల జీవితాలు ఇలాగే ఉంటాయి.
దోపిడీ ఏదో రూపంలో, అది ఏ సమాజంలోనైనా ఉంటూనే ఉంటుంది. తెలంగాణ వాళ్లతో పోల్చితే ఆంధ్రావాళ్లకు ఎంటర్‌ప్రైజింగ్ నేచర్ ఎక్కువ. దీంతో అందుబాటులో ఉన్న అవకాశాలను వాళ్లు ముందుగా అందిపుచ్చుకున్నారు. రేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందున్న వర్గాలవారు ఈ పనిచేస్తారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు హైదరాబాద్ విద్యార్థులతో ఉద్యోగాల కోసం పోటీ పడలేరు. పేదవాడి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. వెనుకబాటుతనంలో ఉన్నవాళ్లు వెనుకబడే ఉంటారు. వాస్తవం ఎలా ఉండబోతున్నా తెలంగాణ ప్రజలలో ఎన్నో ఆశలు కల్పించారు కనుక వారు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారు. అదే సమయంలో తమ సంపదను ఆంధ్రావాళ్లు దోచుకున్నారన్న అనుమానాన్ని కూడా వారిలో కల్పించారు. దీంతో రాష్ట్రం విడిపోతే సీమాంధ్రుల ఆస్తులు తమకు దక్కుతాయని తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్ముతున్నారు. అలా నమ్మేలా చేసింది కూడా కొంతమంది ఉద్యమ నాయకులే! తెలంగాణ ఏర్పడితే ఒకరికి ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది.
కొన్ని వందల మందికి ప్రభుత్వ పదవులు లభించవచ్చు! తెలంగాణ ఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రకటననే తీసుకుందాం. తెలంగాణ ఏర్పడ్డాక లక్ష ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. వాస్తవంలో అది జరిగే పనేనా! అన్ని ఖాళీలు లేనప్పుడు ఎలా భర్తీ చేస్తారు? తెలంగాణ వస్తే కాంట్రాక్టు కార్మికులనందరినీ పర్మినెంట్ చేస్తానని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని కె.సి.ఆర్. ప్రకటిస్తున్నారు. ఇలాంటివి ఎలా సాధ్యమని ఏ ఒక్కరూ ప్రశ్నించరు! ఎందుకంటే వారిలో ఏర్పడుతున్న ఆశే కారణం. తెలంగాణ ఏర్పడితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో పాటు ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్‌లో అవకాశాలు పెరుగుతాయి. చదివిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం లభించదు. సమర్థవంతమైన, నిబద్ధతగల నాయకత్వం చేతిలో తెలంగాణ ఉంటేనే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇక సీమాంధ్ర ప్రాంతం వారిలో నెలకొన్న భయాందోళనల విషయానికి వద్దాం. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని అక్కడి వాళ్లను భయపెడుతున్నారు.
అందులో వాస్తవం ఎంత అని ఎవరూ ఆలోచించడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో వర్షాలు పడి నీరు సమృద్ధిగా ఉంటే తెలంగాణ వాళ్లు ఆ నీటిని ఆపలేరు కదా? వర్షాలు కురవకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు? భౌగోళికంగా చూస్తే తెలంగాణలో సాగునీటి వసతి కల్పించాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యం. కృష్ణా నీటి ఆధారంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. అలా కాకుండా దిగువకు నీళ్లు వెళ్లకుండా ప్రాజెక్టులు కట్టాలంటే మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా భాగం ముంపునకు గురవుతుంది. గోదావరి నది విషయంలో కూడా పరిస్థితి ఇంతే! అందుకే ప్రాణహిత- చేవెళ్ల, దేవాదుల వంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. ఉద్యోగాల విషయానికి వద్దాం. ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఒకప్పుడు ఎక్కువగా ఆధారపడేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రైవేటు ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఉపాధి అవకాశాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయనేది వాస్తవం. హైదరాబాద్‌లో ఉన్న ప్రైవేటు సంస్థలు తమకు అవసరమైన అర్హత ఉన్నవారినే ఉద్యోగాలలోకి తీసుకుంటాయి గానీ, ప్రాంతాలను బట్టి కాదు. ఏ ప్రాంతానికి చెందినవాళ్లు అయినా, తెలుగువాళ్లు మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఇప్పుడు వెళ్లడం లేదా? వాస్తవానికి రాష్ట్రం విడిపోతే కొత్త రాజధాని ఏర్పడే ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తమ ఆస్తులకు రక్షణ ఉంటుందా? అని సీమాంధ్రులు వ్యక్తంచేస్తున్న సందేహాల విషయానికి వద్దాం. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సీమాంధ్రకు చెందిన వారిపై దాడులు కూడా జరిగాయి. ఆ ఉద్యమం చల్లబడిన తర్వాత అందరూ అన్నీ మర్చిపోయి కలిసిమెలసి ఉంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అంతే! ఒక్కసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాధాన్యాలు మారిపోతాయి. తెలంగాణ ప్రజలలో కల్పించిన ఆశలను తీర్చలేక ప్రభుత్వాలు సతమతమవుతాయి. విద్వేషాలు రెచ్చగొడుతున్న నాయకులు అప్పుడు తెరమరుగయ్యే అవకాశం ఉంది. అయితే విభజన వల్ల సమస్యలే ఉండవా అంటే కొన్ని ఉంటాయి. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. పరస్పరం సహకరించుకోకుండా ఉభయ ప్రాంతాలూ మనుగడ సాగించలేవు. ఈ వాస్తవాన్ని చెప్పడానికి ఇటువాళ్లు గానీ, అటువాళ్లు గానీ ఇప్పుడు సిద్ధంగా లేరు. ఎందుకంటే వారికి ఇప్పుడు కావలసింది 2014 ఎన్నికలలో ప్రయోజనం పొందడమే! ఎవరైనా సాహసించి నిజం చెప్పాలని ప్రయత్నిస్తే తెలంగాణ ద్రోహి అనో, సమైక్యాంధ్ర ద్రోహి అనో ముద్ర వేయడం ఫ్యాషన్ అయిపోయింది.
కారణాలు ఏమైనప్పటికీ ఉభయ ప్రాంతాల ప్రజలలో ఇప్పుడు భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇందుకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు కేంద్రం కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అందులో న్యాయం ఉందని భావించారు. అందుకే తెలంగాణకు అనుకూలంగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం రగలడంతో ఆయా పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. అయితే బాధ్యతగల రాజకీయ పార్టీలు వైఖరులు మార్చుకోకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలి. విభజనను కొంతకాలం అడ్డుకోగలరు గానీ ఎంతో కాలం కాదని అందరికీ తెలుసు. అయినా ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు.
ఎంతకాలం ఇలా? కేంద్ర ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరించకుండా సీమాంధ్రకు చెందిన నాయకులతో సమస్యలపై చర్చల ప్రక్రియ ప్రారంభిస్తే పరిస్థితులు శాంతిస్తాయి. హైదరాబాద్‌తో పాటు ఆదాయాన్ని పంచుకోవడానికి తెలంగాణ నాయకులు కూడా వ్యతిరేకించకపోవచ్చు. విభజన సాఫీగా జరగాలంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ముందుగా సీమాంధ్ర ప్రజలలో కల్పించాలి. అయితే దురదృష్టవశాత్తూ కేంద్రంలోని పెద్దల చర్యలు ఈ దిశగా లేవు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్వయంగా సమైక్యవాదం వినిపించడంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. ఆయనను రాజీనామా చేయమని కోరదామా? అంటే సీమాంధ్రలో ఉద్యమం మరింత పెరిగే ప్రమాదం ఉంది. సమైక్యవాదానికి ఇప్పుడు ఆయన చాంపియన్‌గా ఉన్నారు.
- నేతలు.. కలలు!
రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశం లేదని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి సమైక్యవాదాన్ని అందిపుచ్చుకున్నారు. కేంద్రంలో ప్రధాన రాజకీయపక్షాలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రం ఎలా సాధ్యమో ఆయనకే తెలియాలి. సమైక్యవాదాన్ని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకోవడంతో సీమాంధ్రలో తాము వెనకబడతామేమోనని భావించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 'సమ న్యాయం' సిద్ధాంతాన్ని బయటకు తీశారు. వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కలలోకి వస్తుంటే, చంద్రబాబుకు జగన్ కలలోకి వస్తున్నారు. దీంతో వారిద్దరి మధ్య ర్యాట్ రేసు ప్రారంభమైంది. లోటస్ పాండ్‌లో జగన్ దీక్ష చేసినా, ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేసినా ఇందులో భాగమే! సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతున్నది కనుక వై.సి.పి., తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. తెలంగాణలో పార్టీని రక్షించుకుంటూనే సీమాంధ్రలో ప్రయోజనం పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తుండగా, తెలంగాణలో పార్టీ ఎలాగూ ఎత్తిపోయింది కనుక సీమాంధ్రలోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జగన్ భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటే జగన్‌కు రాజకీయంగా నష్టం.
తెలంగాణలో బలం లేకుండా, కేవలం సీమాంధ్రలో వచ్చే సీట్లతోనే సమైక్య రాష్ట్రంలో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. చంద్రబాబు విషయానికి వస్తే రాష్ట్రం విడిపోయినా, తెలంగాణలో ఇప్పటికి ప్రతిపక్షానికే పరిమితమైనా భవిష్యత్తులో పార్టీని నిలబెట్టుకోవచ్చునన్నది ఆయన ఉద్దేశం. అదే సమయంలో సీమాంధ్రలో వై.సి.పి.పై పైచేయి సాధిస్తే అక్కడ తాను ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చునని ఆయన భావిస్తున్నారు. 2014 ఎన్నికలే జగన్మోహన్ రెడ్డికి మొదటి అవకాశం, చివరి అవకాశం కూడా! ఆ ఎన్నికలలో ఆయన అధికారంలోకి రాకపోతే వై.సి.పి.కి మనుగడే ఉండదు. అనంతపురం ఎం.పి. అనంత వెంకట్రామిరెడ్డి వంటి వాళ్లు ఇప్పుడు వై.సి.పి.లో చేరడానికి సిద్ధపడుతున్నారంటే మరో ప్రత్యామ్నాయం లేకే! సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పుట్టి ముంచింది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేరు. దీంతో అనంత వంటి వాళ్లు మనస్సు చంపుకొని జగన్‌ను ఆశ్రయిస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో జగన్ అధికారంలోకి రాలేకపోతే ఇలాంటి వాళ్లు వెంటనే తిరుగుముఖం పడతారు. చంద్రబాబుకు కూడా ఇదే చివరి అవకాశం. ఇప్పుడు ఆయన అధికారంలోకి రాకపోతే ఆయన భవిష్యత్తే కాకుండా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఈ కారణంగానే ఆయన వయస్సును సైతం లెక్క చేయకుండా దీక్షల విషయంలో జగన్‌తో పోటీ పడుతున్నారు. బెయిల్‌పై జైలునుంచి విడుదల అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు ఆయనకు కలిసిరావడం లేదు. సమైక్యవాదం అంటూ ప్రారంభించిన దీక్షకు జనాదరణ లేకపోవడంతో ఫ్లాప్ అని ముద్ర పడింది. అదే సమయంలో బెయిల్ కోసం తాను కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డానని ప్రజలు అనుమానించడంతో అలాంటిది ఏమీ లేదని చెప్పడానికి నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తి విమర్శల పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకున్నప్పటికీ, ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితులు ఏర్పడితే నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వడానికి వెనుకాడకపోవచ్చు.
ఎందుకంటే తనపై ఉన్న కేసుల నుంచి బయటపడాలంటే ఆయనకు కేంద్ర ప్రభుత్వం అండదండలు అవసరం. సమ న్యాయం పేరిట ఢిల్లీలో దీక్ష చేసిన చంద్రబాబు నాయుడు, జగన్ గురించి ఆలోచించడం మానేసి న్యాయం జరిగిందన్న నమ్మకం సీమాంధ్రులలో కలిగించడానికై నిర్దుష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లడం వాంఛనీయం. చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల గానీ, మరే ఇతర కారణం వల్ల గానీ బి.జె.పి. అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా శుక్రవారంనాడు సమ న్యాయం జరగాలని కోరారు. 2014 ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పోటీ పడుతున్న యు.పి.ఎ., ఎన్.డి.ఎ.లకు లభించే సీట్ల మధ్య వ్యత్యాసం 20 నుంచి 30 మధ్యే ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటుకు బేషరతుగా సహకరించడం ద్వారా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, జగన్ పార్టీకి కలిపి 30 సీట్ల వరకు లబ్ధి చేకూర్చడానికి భారతీయ జనతా పార్టీ సహజంగానే సిద్ధపడదు. ఈ కారణంగానే 'సమ న్యాయం' అనే మాటను రాజ్‌నాథ్ సింగ్ వాడి ఉంటారు. వచ్చే ఎన్నికలలో బి.జె.పి.తో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నప్పటికీ, సీమాంధ్ర ప్రజలు సంతృప్తి చెందేలా బి.జె.పి. కృషి చేయని పక్షంలో, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాము మునిగిపోతామన్న భావనతో తెలుగుదేశం నాయకులు ఉన్నారు.
సీమాంధ్ర ఉద్యమానికి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది కనుక భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడింది. కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తేవడం ద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజలకు న్యాయం జరిపించామన్న నమ్మకం కలిగిస్తే, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో జతకట్టి ఎన్నికలకు వెళితే లాభపడవచ్చునని ఆ పార్టీ జాతీయ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికావాలంటే ఇక రెండు మాసాల వ్యవధి మాత్రమే ఉంది కనుక, ఇంత తక్కువ వ్యవధిలో విభజన చేయడం సాధ్యం కాదని బి.జె.పి. అగ్ర నేత ఆడ్వాణీ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన తనను కలిసిన తెలుగుదేశం నాయకుల వద్ద రెండు రోజుల క్రితం ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్ర విభజన సాధ్యం కాదని ఆయన తనను కలిసిన వారి వద్ద ప్రస్తావిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా బహుశా ఈ విషయం తెలిసే ఉంటుంది. అయినా తెలంగాణలో ప్రయోజనం పొందాలి కనుక విభజన విషయంలో వేగంగా వెళుతున్నట్టు తెలంగాణ ప్రజలు భావించేలా ప్రయత్నిస్తున్నారు. 2014లోపు విభజన జరగకపోతే పరిస్థితులు ఏమిటన్నదే ప్రశ్న! అదే నిజమైతే తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌లో విలీనం కాకపోవచ్చు. బహుశా ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేయవచ్చు. సీమాంధ్రలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ సమైక్యవాదం పేరిటే ఎన్నికల బరిలోకి దిగుతారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఎన్నికల నాటికి జగన్ పార్టీతో సి.పి.ఎం. జతకట్టే అవకాశం ఉంది. ఆ పార్టీ ముఖ్య నాయకుడు సీతారాం ఏచూరి శుక్రవారంనాడు స్వయంగా ఫోన్ చేసి ఆసుపత్రిలో ఉన్న జగన్‌ను పరామర్శించడం ఈ అనుమానాలకు ఊతం ఇస్తోంది. బి.జె.పి.తో జత కట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నా, జగన్‌తో స్నేహం చేయడానికి సి.పి.ఎం. ప్రయత్నించినా రాజకీయ ప్రయోజనం కోసం తీసుకునే నిర్ణయాలే అవుతాయి. రాజకీయాలలో అంటరానితనం ఉండదని అంటారు.
దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ అనుకూల పవనాలు వీస్తున్నందున బి.జె.పి.తో చేయి కలపడం వల్ల 1999 ఎన్నికలలో వలె తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో లాభపడే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటుకు సహకరించినా లేదా సమ న్యాయం జరిపించినా బి.జె.పి.కి రాష్ట్రంలో సొంతంగా ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకునే అవకాశం కనిపించడం లేదు కనుక తెలుగుదేశంతో పొత్తు ఆ పార్టీకి కూడా ఉభయకుశలోపరిగా ఉండవచ్చు. తెలుగుదేశంతో పొత్తును బి.జె.పి. రాష్ట్ర శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఏమి జరుగుతుందో చూడాలి. ఈ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా, 2014లోపు విభజన జరుగుతుందా? లేదా? అన్నదాన్ని బట్టి రాష్ట్రంలో ఆయా రాజకీయ పార్టీల తలరాతలు ఉంటాయి. మరో మూడు మాసాలు గడిస్తే గానీ ఈ రాష్ట్రం పరిస్థితి ఏమిటన్నది తేలదు. అంతవరకు విభజనవాదులు, సమైక్యవాదులు ఎవరి ఊహల్లో వారు విహరించవచ్చు. ఒక్కటి మాత్రం వాస్తవం. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధపడటం మేలు!

http://www.andhrajyothy.com/node/10469

Wednesday, September 18, 2013

సమైక్యమా? తెలంగాణమా??

నేను: (బస్సులు లేకపోవడం వల్ల ఆటోకి 300 ఇవ్వాల్సి వస్తున్న బాధతో) సమైక్య ఉద్యమ సెగ ప్రజా నాయకులకు తగలాలి కానీ ప్రజలకు తగలకూడదు, ఈ బస్సుల బంద్ స్కూళ్ళ బంద్ అన్ని సామాన్య జనాలకు కష్టం కానీ డబ్బున్నోడు కార్లో పోతాడు వాడి కొడుకు అంతర్జాతియ స్కూల్లో చదువుతాడు. ఇక నాయకులైతే ఈ పాటికే ముని మనవలకు సరిపడినంత సంపాదించే ఉంటారు లేక పోతే ఒక స్కాం చేస్తారు. ఈ ఉద్యమ విధానం తప్పు కాదా?
ఆటో: 2,3 నెలలు జీతాలు లేక పోతే అప్పుచేసుకుని తింటారు సార్, విడిపోతే మన ముందు 2,3 తరాలు పడిన కష్టం బూడిద పాలవుతుంది సార్, వచ్చే 2,3 తరాలు కష్టాల పాలవుతాయి సార్. మీరు చెప్పినట్లు డబ్బున్నోళ్ళు, నాయకులు గోడమీద పిల్లుల్లా వాళ్ళ అస్తిత్వం కోసం ఏమైనా చేస్తారు, వాళ్ళకున్న డబ్బుకి హైదరాబాద్లో ఉండిపోగలరు. నష్టపోయేది సామాన్యుడు సార్.



నేను: రాజమండ్రిలో ఆటోకి హైదరాబాద్ విడిపోవడం వల్ల వచ్చే తక్షణ నష్టం ఏంటి?
ఆటో: మా అన్నయ్య హైదరాబాద్లో 30 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఇల్లు గట్ర కొనుక్కున్నాడు, ఇవాళ ఉద్యోగం లేదు, ఇల్లులేదు పొమ్మంటే ఎలా సార్. ఎవడబ్బ సొమ్మని అప్పనంగా దోచిపెడతాం సార్?

నేను: అక్కడేమో అంధ్రా వాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు అని బాధపడుతున్నారు?
ఆటో: మా చిన్నతాతగారు హైదరాబాద్లో ఉండేవారు, ఆయన చెప్పేవరు హైదరాబాద్ కథలు,రాళ్ళూ రప్పలూవి పేర్చిన నిజాం, అక్కడ జనాల్ని దోచుకుంది మనం కాదు సార్, వాళ్ళ దొరలు వాళ్ళ నిజాం. తిండి లేక జనాలు ఏడుస్తుంటే నిజాం రోల్స్ రోయస్ కార్లు కొనుక్కున్నాడంట, చదువుకుంటే వీళ్ళకు అడ్డు పడతారని కనీసం చదువుకోనివ్వలేదు, మనకు ఇలాంటి గొడవలేదు కబట్టి మనవాళ్ళు బాగా చదువుకున్నారు. ఇవాళ తెలంగాణాలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు లేవు అంటున్నారు.

నేను: కాని మరి హైదరాబాద్ తెలంగాణా ప్రాంతంలోదేగా? తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని తెలంగాణా వాళ్ళు అనుకుంటున్నారు.
ఆటో: అప్పుడు తెలంగాణా ఆంధ్రా వేరు వేరుగా చూడలేదు కాబట్టే ఇవాళ హైదరాబాద్ అంత గొప్పగా ఉంది. అన్నం పెట్టిన చేతినే కరుస్తున్నారని ఆంధ్రాలో అనుకుంటున్నారు సార్. రాళ్ళు తప్ప ఏమీ లేవు రమ్మంటే జాలిపడి అక్కడ అన్ని పెట్టారు. ఇప్పుడు డబ్బు, ఉద్యోగాలు కనిపించేసరికి వాళ్ళకి ఆశ పుట్టుకు వస్తోంది.

నేను: పేపర్ల కన్నా మీకే ఎక్కువ తెలిసినట్లుందే?
ఆటో: రిక్షాతో మొదలు పెట్టి ఇవాళ ఆటో నడుపుతున్నా సార్, ఊహ తెలిసినప్పటి నుంచి స్టేషన్ నుంచి జనాల్ని తేసుకెల్తూనే ఉన్నా, ఇలాంటివి జనల దెగ్గర తెలుసుకుంటూనే ఉన్నా. అబద్ధాలు చెప్పడానికి నేనేమి ఎదోక పార్టీతో సంబంధం ఉనండే పేపర్ కాదు సార్.
నేను: హుం...

నేను: హైదరాబాద్ వళ్ళకి ఇచ్చేస్తే మనకి ఒక లక్ష కోట్లు డబ్బులు ఇస్తారుగా అభివ్రుద్ధి చేసుకోడానికి?
ఆటో: ఆధార్ కార్డుని బట్టి అందరి అకౌంట్లో వేస్తారా డబ్బులు?? ఊరుకోండి సార్, నాయకులు తినడనికే సరిపోవు ఎన్ని డబ్బులు ఇచ్చినా. అయినా లక్ష కోట్లు ఎక్కడివి ఇస్తారు సార్? మన డబ్బులేగా? ఉత్తినే వచ్చేవి ఎమైనా కొంపముంచేవే సార్.

నేను: సమైక్య ఉద్యమం పేకేజి కోసమే కదా, ఉద్యమ కారుల వెనుక నాయకులు ఉన్నారుగా?
ఆటో: గొడవ పెట్టుకోడఆనికి వచ్చారఆ??
నేను: లేదండీ, ఏడొ పుట్టిన రొజు పార్టి అంతే వచ్చా, హి హి
ఆటో: నాయకులు ఎవ్వరూ లేరు, మేము రానివ్వట్లా. పాకేజి వల్ల మనకు ఒరిగేదేమీ లేదు. తెలంగాణ కావాలంటే విడిపోనివ్వండి, ఊడిపోయే ముక్కుని పట్టుకు ఎన్నాళ్ళు వేళ్ళాడతాం? హైదరాబాద్ మాత్రం ఉమ్మడి కావాలి.

నేను: అసలు తలుచుకుంటే మొన్న సమైక్య సభనే ఆపేద్దుం అంటున్నారు, ఇంకా రాష్ట్రం రాకుండానే రాళ్ళతో కొట్టారు, రేపు ఇచ్చాకా అసలు రానిస్తారా?
ఆటో: మీరు మాట్లాడేది పాకిస్తాన్లో హైదరాబాద్ గురించి కాదు కదా?

నేను: హి హి.  పాకేజి కి ఆశపడి మన వాళ్ళు కూడా తెలంగాణాకి సరే అంటే?
ఆటో: కుట్రతో ఒక రాష్ట్రం ఏర్పడితే, అన్యాయమైపోయి ఇంకోటి ఏర్పడుతుంది. ఇక్కడి జనాలకు అలాంటి పరిస్తితులు వస్తాయ్ అప్పుడు. ఇన్నాళ్ళు తెలంగాణాలో నిరక్షరాస్యత, ఆకలి, గుత్తేదార్ల దాష్టికాలవల్ల సాయుధపోరాటాలు చూసారు, ఇక ఇక్కడ చూస్తారు ! ఇంతకు ముందు వేరు రష్ట్రాలు అడిగిన వాళ్ళెవ్వరూ రాజధాని కావాలని అడగలేదు, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడగలరని నమ్మకం. ఇక్కడ రాజధాని వల్లే విడివాదం పిడివాదం. నిజంగా తెలంగాణ అభిమానం ఉన్నవాడు తెలుగు, తెలంగాణా వేరనుకునేవాడూ.. హైదరాబాద్ ఇవ్వకున్నా విడి తెలంగాణా కావాలంటాడు.అందుకే ఇది కేవలం స్వార్థంతో కూడిన కుతంత్రం, ప్రజలపై రుద్దబడిన ఆలోచన. వాడెవడో తెలంగాణా వస్తే అక్కడి గుత్తేదార్ల భూములన్నీ పేదవాళ్ళకి పంచుతాడుట, ఆ పని ఇది వరకే చేస్తె ఇప్పుడు ఇలాంటి పరిస్తితి వచ్చేదే కాదు. ఇది కేవలం జనాల్ని మోసం చేసే రాజకియం. అప్పుడు కలిపి తప్పు చేసారు, ఇప్పుడు విడగొట్టి అన్యాయం చేస్తున్నారు .

నేను: ఏదైనా జనాల్ని ఇబ్బంది పెట్టే ఉద్యమంలో అన్యాయం కనిపిస్తోంది నాకు.
ఆటో: అవునా? వాయించలేక డప్పు ఒంకర అన్నాడంట ఎనకటికి ఒకడు. క్లాసులో ఎప్పుడూ బాగా చదివేవాడిని బయటకు పంపించేస్తే మనకే అన్ని రేంకులు వస్తాయి అనుకోవడం న్యాయమా? విడి రాష్ట్రం కోరే బదులు, హక్కుల కోసం, అభివ్రుద్ది కోసం, అక్షరాస్యత కోసం పోరాడడం న్యాయం ? మనల్ని పొమ్మనడం అన్యాయం. మా తమ్ముడు ఇక్కడికి వచ్చినప్పుడూ మేము "ఏం షేషినావ్ ర " అని ఏడిపిస్తాం, వాడు మమ్మల్ని 'ఏటండి " అని ఏడిపిస్తాడు, అంత మాత్రాన కొట్టుకు చావట్లేదుగా మేము? ...
నేను: హుం నిజమే.
" సరైన వాదనలు రెండువైపులా ఉంటాయి, జనాలు గొర్రెల్లా ఎవడొ ఒకడిని నమ్ముకున్నంతకాలం ఇలాగే ఉంటాయి పరిస్తితులు. ఇవాళ ఓటు కొనుక్కున్న వాడు రేపు నిన్ను రేపు అమ్మేస్తాడు. హుం అయినా ప్రతీ రోజు రేపు ఎలా గడుస్తుందో అని భయపడే సామాన్యుడు ఏం చెయ్యగలడు పొట్టకోసం కష్టపడతం తప్ప, ఇలానే ఆటో నడుపుకోడం తప్ప ఎన్ని తెలిసి ఏమి లాభం?" అని చెప్పుదాం అనుకున్నా, మాట పెగలలేదు, అతనిని ఆపడం ఇష్టం లేక...

Thursday, August 22, 2013

యాస ఏదైనా తెలుగు ఒకటే

భాష ఏదైనా భావమొకటే
యాస ఏదైనా తెలుగు ఒకటే







ఆంధ్ర మహాభాగవతమన్న నాటి పోతన
తిమిరంతో సమరమన్న నేటి దాశరథి
కంచెర్ల గోపన్న లేకున్న యాడ మన రామన్న?
సినారే లేకున్న తెలుగు సిత్రమేమున్నది
కళోజీ జీవన గీత, సోమన్న బసవపురాణమన్నా
గోరేటి వెంకన్న, గోన బుద్ధా రెడ్డి,
తెలంగాణ తెలుగు కవుల తిరుగులేదన్నా
లెక్క చెప్పమన్న పెక్కు పేర్లు కలవురన్న

త్యాగరాజన్న తెలుగు రాజు
అన్నమయ్య లేకున్న తెలుగే అనమయా
వెంగమాంబ కన్న వేరె అంబ ఉన్నదా?
క్రిష్ణదేవరాయలి అష్ట దిగ్గజాలు,
నంది తిమ్మన, అల్లసాని పెద్దన్నకట్టమంచివారు, జిడ్డు క్రిష్ణ మూర్తి గారు
తెలుగు తారలు వీరు విశ్వధాభి రామ
మా రాయలసీమ రతనాలసీమ

నన్నయ్య తెలుగుకన్నయ్య
తిక్కన, యెల్లాప్రగడలవల్ల భారతం పూర్తయిందయా
చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి
వీరిరువురే కదా తెలుగు పద్యానికి జిలుగు తెస్తిరి
అవధానాలకు ఊపిరి పోస్తిరి
వీరేశలింగం సార్ధకనామధేయం
దేవులపల్లి కృష్ణ పక్షం, చలం మైదానం, గోపిచంద్ చీకటి గోడలు
ఆత్రేయగారు, విశ్వనాథవారు, వేటూరిగారుకొడవగంటి గారు,  చక్రపాణి గారు
ఎన్ని పేర్లని ఎనగలము గోదారి జిల్లాలు కవుల గోదాములు














యాస వేరని భాషేవేరనీ
తెలిసీ తెలియని వాళ్ళు తెలివితక్కువవాళ్ళూ
గొడవపెట్టువాళ్ళు, గోడపైపిల్లులూ 
ఎవరైనానీది తెలుగు కాదనీ అంటే..
నవ్వి ఊరుకోకు, నమ్మి మోసపోకు
తెలుగు కవుల చరిత తెరచి చూపించు
తెలుగు వాడిగ నువు వాడి చూపించు

స్వార్ధానికి, అపార్ధానికి తెలుగు తేడానేమోగానీ
భావానికి, భావుకత్వానికి, స్రుజనకు స్రుజించే కలానికి కాదు

తెలుగు మన భాష, తెలుగే మన శ్వాస
తెలుగు తెలుగోయని ఎలుగెత్తి పలుకు
తెలుగోడిగా నువు తల ఎత్తుకు బతుకు
                                                                                                   --    -కీర్తి

Friday, August 16, 2013

ఏ రోజైతే..

ఏ రోజైతే
నేరస్తులకు నిష్పక్షపాతంగా శిక్షలు పడతాయో
విధించిన శిక్షలు ఖచ్చితంగా అమలవుతాయో,

నేర చరితులకు రాజకీయాలలోకి ప్రవేశముండదో
కారాగారాలనుంచి మంత్రాంగణం చెయ్యడం కుదరదో,


ఏ రోజైతే
వర్గ, కుల, మత, భాషా, ప్రాంత విభేదాలకు తావుండదో
భారతీయేతర భావాలకు విలువుండదో

మన ప్రతీ ఆలోచనలో "మనం" మిళితమై ఉంటుందో
మనపై మనకు ఆత్మ విశ్వాసం మిక్కిలిగా ఉంటుందో

.
.
.

(సశేషం)
.
.
.
ఏ రోజైతే
విధేయత, గౌరవ మర్యాద, ధర్మాచరణలకు
ధనం కన్నా ఎక్కువ విలువ కలుగుతుందో,

జండావందనం కేవలం ఒక సంకేతం కాకుండా
మన భావం, మన నడవడిక అవుతుందో,

ఆ రోజు మాత్రమే మనకు సంపూర్ణ స్వాతంత్రం సిద్ధిస్తుంది !




Monday, August 5, 2013

ఒక రాజు, ఏడుగురు కొడుకులు


అనగనగా ఒక ఊరిలో రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు.
ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఏడుగురు ఏడు చేపలు తెచ్చి వాటిని ఎండబెట్టారు.

సాయంత్రానికి ఆరు చేపలు ఎండాయి కాని, ఏడో చాప ఎండలేదు.
ఆ చేపను పట్టిన రాజకుమారుడు, చేపని “చేప చేప ఎందుకు ఎండలేదు” అని అడిగాడు.




ఆ చేప “గడ్డిమేటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది.

ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు.
గడ్డిమేటు “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని అంది.

రాజకుమరుడు ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు?” అని అడిగాడు.
“నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.

రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “ఎందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు?”
పాలెరాడు “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని అన్నాడు.

అమ్మని అడిగితే అమ్మ “ఆక్కడ పాప ఎడుస్తొంది” అంది.

రాజకుమారుడు పాపని “పాప, పాప, ఎందుకు ఏడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.


రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడి లాగ చీమని కూడ అడిగాడు “చీమ చీమ పాపని ఎందుకు కుట్టావూ?”

ఆప్పుడు చీమ “నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?” అని అంది !



చిన్నప్పుడు మా అమ్మ మాకు ఈ కథ చెప్పేది.
ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయి.
చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో ఎండు చేప లేదు

Monday, July 8, 2013

ఎన్నెమ్మ పురుగు

ఇది ఒక అమ్మమ్మల కాలం నాటి ఆచారం/ కధ/ నమ్మకం/ సైన్స్ ఎదైనా అనుకోండి...అమ్మమలు, అమ్మలక్కలు మొన్నటి దాకా పాడుకున్న పాటలు... విన్న చదివిన  పాత కధను యధాతధంగా  చెప్పడం జరిగింది, కులాలు మతాలు ప్రస్తావన వచ్చిన చోట నన్ను తిట్టుకోవద్దు, తిట్టుకునే మాటయితే ఇంక చదవద్దు..

             
ఒక పురుగుని ఎన్నెమ్మ పురుగు అనీ పురిటికందుని ఆ పురుగు ముడితే శిశువు కష్టపడుతుంది అని ఆ రోజుల్లో నమ్మేవారు. పురిటి గది కిటికీలు, తలుపులూ, ఆ ఎన్నెమ్మ పురుగు రాకుండా మూసి వుంచేవారు. పురిటి గది గుమ్మానికి ఒక కృష్ణ తులసి కొమ్మ,కలబంద మట్ట, పాత చెప్పు వేలాడగట్టేవారు. తులసి, కలబంద వ్యాధి నిరోధక శక్తి ఔషధ గుణం కలిగినవని మనకు తెలుసు. 

విధి వశాన మోసపోయి మాదిగ వాడిని పెండ్లి చేసుకొని నిజం తెలిసాక ఆ భర్తను పిల్లల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకొన్న రాచ పడుచు ఈ ఎన్నెమ్మ, ఆమెను అవమానించి తరిమివేయడానికి ఈ సన్నాహాలన్నీను, పురిటి గది గుమ్మానికి రెండు వైపులా ఊక పోగులుగా పోసి (ఊక అంటే బియ్యం దంచగా వచ్చే పొట్టు) ఆ కుప్పల మీద నిప్పు వేసి రగిల్చే వారు. అందు మీద జీలకర్ర, వాము పొట్టు, వెల్లుల్లి పొట్టు వేసి పొగ వస్తుంటే గృహంలోని వృద్ధ స్త్రీ ఒకరు ఆ గుమ్మం వద్ద కూర్చొని ఈ విధంగా ఎన్నెమ్మ పాట పాడేవారు.

కాపులు వెయ్యారే! కలితెచ్చీ చల్లారే
కామ కోటమ్మ కావలి వుండావే నల్లని వేముల్లా చిగురు చాబాట్టి (చేబట్టి) 
నాలుగు కోట్ల దేవతల్లారా! మా బాలనికాయండీ!

ఎర్రని వేముల్లా చిగురూ చాబట్టి ఏడుకోట్ల దేవతల్లారా! మా బాలనికాయండి.
(వేప చెట్టు చిగురు, ఆకు, పూవు, కాయ క్రిమి సంహారకాలు కదా! గ్రామ దేవత వేప మండ చేత దాల్చి వుంటుందని నాటి జనుల నమ్మకం).

పచ్చని వేముల్లా చిగురూ చాబట్టీ! పదికోట్ల దేవతలారా మాబాలనికాయండీ.
సెట్టీరావయ్య ! సెట్టికొడకా రావయ్యా ! సెట్టివారి చేతులవీ.
ఏమీ కారాలు! సొంఠీ మిరియమ్మూ సోధ్యపుకారాలూ! ఉల్లీ పిప్పళ్లు ఉత్తపుకారాలు వెండిరోళ్ల పోసిన కారాలు భమిడీరోకళ్ల దంపిన కారాలూ ! వెండీ చేటల్ల్ల తాల్చిన కారాలు
భమిడీ గిన్నెల వండిన కారాలూ! బాలింతరాలికీ ఇచ్చిన కారాలు
అంటూ వైశ్యులు వంశ పారంపర్యంగా ఎప్పుడూ తమ ఇంటికి బాలెంతరాళ్ళకు పెట్టె కాయపు సామాన్లు తెచ్చి ఇస్తారనీ, తాము వెండి రోళ్ళు, బంగారు రోకళ్ళు, వెదురు సామాను బదులు వెండివీ, ఇత్తడి పాత్రల బదులు బంగారు పాత్రలు వాడుకొనేటంతటి భాగ్యశాలులమని పాడుకుని మురిసిపోయే వారు ఆ స్త్రీలు.

ఎల్లవారి పురిటాలు పరుండేటందుకూ! కుక్కీ మంచమ్మూ గూనీ కుంపటీ!
మా పురిటాలు పరుండేటందుకూ పట్టీ మంచమ్మూ పరుపూ తలగడలూ!
ఎల్లవారి పురిటాలు కుడిచేటి కుడుపు
జోరీగల వంటి జొన్న అన్నమ్మూ!
మా పురిటాలు కుడిజేటీ కుడుపూ ! సన్నబియ్యమ్మూ సిరి సెనగపప్పు
చిక్కుడుకాయ, సిరిపొట్లకాయా! కాకరకాయ గారవడియమ్మూ!
అని సాటి సామాన్యుల్లో తమ మాన్యత్వాన్ని పేర్కొన్నాక ఎన్నెమ్మ కథ ప్రారంభం అవుతుంది.

             కథ : అనగా, అనగా ఒక రాజు, ఆయనకు ఒక్కతే కూతురు. ఒక్కతే కూతురనే గారాబం జేత ఆ పిల్లకు రోజు ఒళ్లు నలచి తలంటు పోయించే వాడు ఆ అమ్మాయి తండ్రి. పెరట్లో పారేసిన ఆ నలుగు పిండి, పసుపు కుప్పలపై రెండు చెట్లు మొలిచాయి. ఆ అమ్మాయి స్నానం జేసిన నీరు ఓ కాలువగా ప్రవహించసాగింది. పిల్ల ఎదుగుతూ వుంది. తండ్రికి ఇది కొంత వింతగాను ఒక రకంగా గొప్పగానూ తోచ సాగింది. ఎవరైతే ఈ చెట్ల పేరు, కాలువ పేరు చెప్పుకొంటారో వారికి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఆ తండ్రి ప్రతిజ్ఞ చేసాడు. ఎంతెంత పండితులు వచ్చీ, ఎంతెంత విద్వాంసులు వచ్చి వాటి పేర్లు చెప్పలేక పరాభూతులై వెళ్లిపోతున్నారు. పిల్లకు పెళ్లీడు దాటి పోతుంది. పాపం ఈ పిల్ల కట్టు తప్పి పోతూంది, వీటి పేరు నేను చెప్తే నాకీ పిల్లనిచ్చి పెళ్లిచేస్తాడేమో చూద్దాం అనుకున్నాడు. అతిధి వేషంలో వచ్చి ఓహోహో! పసుపు చెట్టూ, నలుగు చెట్లూ వేయించి పసుపు కాలువ తవ్వించారే’’! అన్నాడు. వీటి పెరు చెప్పుకొన్నావు, నీకే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఇంటాయన. ఇల్లూ లేదు, వాకిలి లేదు. తల్లీ లేదు, తండ్రీ లేడు. నాకు పెళ్లేమిటి అన్నాడు పాలేరు. ఈ నాటి నుంచి మా ఇల్లే నీ ఇల్లు, మేమే నీ తల్లిదండ్రులం కాదనడానికి వీలు లేదు. అని తన కూతుర్నిచ్చి పెళ్లి చేసాడు. కూతురూ, అల్లుడూ ఇంట్లోనే వుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. ఈడు వారు జోడు వారు అత్తవారింటికి వెళ్ళడం చూచి, తండ్రి వద్దకు వెళ్లి నాన్న నాకు అత్తవారింటికి వెళ్లాలని మనసుగా వుంది అంది ఆ అమ్మాయి. తండ్రి అల్లుణ్ణి పిలిచి ఏమోయ్‌ మా అమ్మాయికి అత్త వారింటికి వెళ్ళాలని మనసుగా వుందట తీసుకొని వెళ్ళవలసింది అని అల్లుడికి కొంత డబ్బు ఇచ్చాడు. అతడు ఆ డబ్బుతో ఊరికి దూరంగాను,  అంత్య కులజుల పల్లెకు చేరువగానూ ఓ ఇల్లు వేసి భార్య, పిల్లలతో అందులో కాపురం పెట్టాడు.

                  రోజులు గడుస్తున్నాయి. రోజూ కూతుర్లకు తలలు దువ్వి జడలు వేసి, నీళ్లు పోసి, బొట్టు కాటుక పెట్టి లక్క పిడతలూ, దొండకాయలూ ఇచ్చి వాళ్ళను ఆడుకొమ్మని తాను మడి కట్టుకునేది. వాళ్ళు అవి అవతల పారేసి దగ్గరగా వున్న మాలపల్లెకు వెళ్లి ఎముకలూ, బొమికలు తెచ్చి ఆడుకొనేవారు. ఇదిలా వుండగా ఒక రోజు భర్త అరుగు మీద కూర్చొని వుండగా ఓ  అంత్య కులజుడు ఆ దారిన పోతూ ఓరి బావా! ఓరి ఎళ్లా యిలారా అని పిలిచాడు. ఇంట్లో పనిచేసుకుంటున్న రాచ కన్య ఇది విని అదేమిటండీ ఆ  అంత్య కులజుడు మిమ్మల్ని ఇలా పిలుస్తున్నాడు అని అడిగింది భర్తని ఏం లేదు. ఏదో పూర్వజన్మ స్నేహంలే అన్నాడు భర్త. ఇదేమిటో చూద్దాం అని అతడి వెనుకనే బయలుదేరింది. ఆమె భర్త మాల వానితో అతడి గూడేనికి వెళ్లి, వాళ్ల కంచాల్లో తిని, వాళ్ల ముంతల్లో త్రాగి వాళ్ల మంచాలపై దొర్లి, వాళ్ల గ్రామ్య భాషలో మాట్లాడటం చూసింది ఆమె. జరిగిన మోసం అర్థం అయిపోయింది. 

ఆనాడు వంటకు ఉపయోగించే పాత్రలు మైలపడితే కొందరు బయట పారేసేవారు. మరికొందరు నిప్పుల్లో కాల్చి వాటిని తిరిగి వాడుకొనేవారు. ఆ పక్రియలో దర్భపుల్ల కాల్చి వాటిమీద వేసేవారు. 

రాచ కన్య తిన్నగా ఇంటికి వెళ్లింది. ఏమి మాట్లాడకుండా వంట చేసి భర్తకూ, పిల్లలకూ పెట్టి తాను మాత్రం అభోజనంగా పడుకుంది. ఓ రాత్రి వేళ లేచి ముంజూరు ముట్టించి తిరిగి పడుకొంది. తెల్లవారేసరికి నలుగురూ ఆ యింటితో పాటు కాలి ముగ్గి ముతమారి వున్నారు. నలుగురి జీవుళ్లు ‘‘ముత్తి ముత్తో’’ అంటూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు.
బ్రహ్మదేవుడు మీ అమ్మ కడుపు కాలా మీకేం ముక్తి నీ భర్త పోతురాజు గ్రామ దేవత గుడి ముందు రాయిగా వుండి గ్రామదేవతతో పాటు పూజలందుకుంటాడు. 
నీ బిడ్డలిద్దరూ కొత్తెమ్మ, కొర్రెమ్మ పురిటి నీళ్ల నాడు పెట్టే షడ్రసోపేతమైన నైవేద్యం వీళ్లకు ఆహారం.
నువ్వు ఎన్నెమ్మవి పురుగై తిరుగుతూ నిన్ను ఎవరైతే తలవరో వారి పురిటి శిశువుల్ని తింటూవుండు అదే నీకు ఆహారం అన్నాడు ఎన్నెమ్మతో. 

ఆనాటి కొందరి జాత్యహంకారానికీ, ముర్ఖత్వానికీ నిదర్శనం ఈ కథ. పాలేరు చేసింది వంచనే అయినా అతడిలో కల్లా కపటం లేదు. వాడు చేసిన పనిలోని ప్రమాదం అతడికి తెలియదు. పిల్లలు ఏ పాపం ఎరుగని అమాయకులు.

                     రాచ కన్య ఎన్నెమ్మా! మాదిగాడి పెళ్లాం ఎన్నెమ్మా! అని పాడితే ఆమె సిగ్గుపడి బుగ్గ కరచుకొని ఏడు వాడలకు రాకుండా పారిపోతుందట.

ఒక్కోనాటెన్నమ్మా। వంటిన్నివుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
రెండోనాటెన్నమ్మా। రెంటిన్నీవుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
మూడోనాటెన్నమ్మా। ముంగిళ్లవుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
నాలుగోనాటెన్నమ్మా నట్టింటవుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
ఐదోనాటెన్నమ్మా। అందందివుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
ఆరోనాటెన్నమ్మా । ఆరుస్తూ వుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
ఏడోనాటెన్నమ్మా । ఏడుస్తూ వుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
ఎనిమిదోనాటెన్నమ్మా । ఏరుదాటిపాయె। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
తొమ్మిదోనాటెన్నమ్మా । తోరణం దూరిపాయె। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
పదోనాటెన్నమ్మా। పప్పుముద్ద ఎన్నెమ్మా పట్నం దాటిపాయె। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ


అని పాడుతూ మల మూత్ర విసర్జన వేళ ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం వుందని 3,4,5,6 రోజులు మాతా, శిశువుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలని, ఏడవ రోజున ఎన్నెమ్మ తన ప్రయత్నాలు సాగలేదని ఏడుస్తూ వుంటుందనీ, ఏడు రోజులు దాటితే కొంత ఆపద తొలుగుతుందని, పదో రోజున పప్పుముద్ద అంటే అంతా శుభమని ఈ పాటలో అన్యాపదేశంగా చెప్తారు. సామాన్యంగా 11వ రోజున జరిగే పురిటి స్నానం కొన్ని ప్రాంతాలలో 7 రోజులు గడిచాక 8వ రోజున చేయించడం తిరిగి 3 రోజులూ దూరంగా వుంచి శుద్ధి కార్యక్రమం మాత్రం 11వ రోజునే చేయించడం ఆచారంగా వుండేది.

నిఘూడంగా ఉన్న సైన్స్ ఏమైనా అర్థం అయితే ఆనందం లేదంటే ఇదీ ఒక వ్రుధా కధ అనుకుని వదిలెయ్యండి..


Sunday, April 28, 2013

అద్వైతం


మొదట్లో మొత్తం నేనే
నాలో నేనే

లోకాన్ని చూసాకా
కొంత నేను కొంత నువ్వు
ఆపై అప్పుడప్పుడు కొంత మనం

బాహ్య స్థూల పరిశీలనలో
అంతా భిన్నత్వమే

పైనేమో నీలి తెర
కిందంతా ధూళి పొర
మనసే మనిషి చెర

సత్యానికి ఒకటే దారి
అసత్యానికి..?  మనిషికో దారి

కనుచూపు మేర అంతా మనుష్యులే కానీ..
ఊర్ధ్వ ముఖం అధో ముఖం
అదో ముఖం ఏదో ముఖం

ఇది నా అభిమతం అది నీ అభిమతం
నా మతం నీకు అసమ్మతం

మూతి ముడుచుకుని
మళ్ళీ
నాలో నేనే
నాతో నేనే
యధేచ్చగా సంధ్యవారిస్తే
అక్కడా నేనే
రణ గొణ గణ గణ
వాడు వీడు అదీ ఇదీ

అంతా భౌతికమే..
మనం ఎంతో ఎదిగాం గగనానికి ఎగిసాం
కిందకి తొంగి చూస్తే..
సత్యం అగాధంలో కూరుకు పోయింది
మనసు ప్రకృతి నుండి వేరుపడి పోయింది

ఎప్పుడో సంధ్యలో గురి కుదురుతుంది
అప్పుడు చూడాలి

















మనసులో మంత్ర జపం
జరుగుతూనే ఉంటుంది
చేయి జపమాల తిప్పుతూనే ఉంటుంది
అవి కేవలం సాహిత్యం మాత్రమే
అసలు సత్యం ఇకపై ఉంది

కళ్ళు కలుసుకుని
నుదుటికెక్కుతాయి
కూర్చునిఉన్నా
దృష్టి దూరంగా నింగిలోకి పోతుంది

వెన్నులో వెన్న రంగులో
కాంతి రేఖలు
తలదాకా ప్రవహిస్తుంటాయి

తలలో అపారమైన శక్తి చేరగా
అంతర్ ధ్రుష్టి అనంత విశ్వంలోకి
దూసుకుపోతుంది
ఆపై అంతా అధ్వైతం
ప్రసాంతం
ఏకత్వం ఆసాంతం

ఎరుక..
ఉన్నదేదీ లేదని
ఎరుక

అంతా ఆ మహా ఎరుక రాశిలో భాగమే
భాగాలు కొన్ని కొన్నాళ్ళు విడిగా ఉన్నా
మళ్ళీ వెళ్ళి అనంతంలో మమేకమవుతాయి

సముద్రం లో నీటి బిందువుల్లా
ఆవిరై కొన్ని ఆకాసాన్ని చేరినా
చినుకై నేలకు రాలి
నదులలో కలసి
మళ్ళీ సముద్రాన్ని చేరవలసిందే

నది ఏదైనా గమ్యం అదే
చినుకేదైనా చివరకు నదే
కావలసింది ఎరుక కలిగిన మదే !


Monday, April 22, 2013

ప్రత్యుత్తరం.. ఒక ప్రేమ లేఖ


పండు గాడికి ప్రేమతో... ఒక ప్రేమ లేఖ,
నా తెలుగు వ్రాత బాగోలేకపోయినా భావం తెలుగులోనే బాగా చెప్పగలనని నా అనుభవం, అందుకే... నా రాత కాస్త సద్దుకో.


ప్రేమకు ముందు 'నిన్ను ప్రేమిస్తున్నాను ' అని చెప్పటానికి ప్రేమలేఖ రాస్తాం (మనం రాసుకోలేదనుకో ). ఒక సారి ప్రేమలో పడ్డాకా ఓపిక లేకో, తీరిక లేకో, ప్రేమ లేకో (ఉంటుంది కాని ప్రాముఖ్యత తగ్గుతుంది, తినగా తినగా గారులు చేదెక్కిన చందాన) మళ్ళీ ప్రేమ లేఖల జోలికి పోము. అవసరమైతే అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్చీస్ కి వెళ్ళి ఒక గ్రీటింగ్ కార్డ్ కొంటాం కానీ, పక్కనే ఉన్న పెన్ను పేపెర్ తో ఒక ప్రేమ లేఖ రాయం.
పెళ్ళికి ఫోటోలు తీసుకుని ఆల్బం లో పెట్టుకుని జాగ్రత్తగా దాచుకుంటాం. ఎప్పుడైనా అవి తెరిచి చూసుకుంటే జ్ఞాపకాల దొంతరలు మబ్బుల్లా కరిగి మనసునుపై కురిస్తే ప్రేమ కొత్త చిగురులు తొడగాలని.
ప్రేమలేఖలు కూడా అలాంటివే, ఇంకా చెప్పాలంటే అంతకన్నా గొప్పవి. ఫొటొచూస్తే భౌతికంగా ఎలా ఉండేవాళ్ళమో గుర్తుకు వస్తుంది... 'అప్పట్లో నా జుట్టు చూడు ఎంత ఎక్కువో ' లాంటివి. ప్రేమలేఖ మానసిక స్తితిని గుర్తు చేస్తుంది.
నేను మాత్రం నిన్ను రోజూ మొదటి రోజులా కొత్తగానే ప్రేమిస్తా, గుండెకాగితమై ప్రేమలేఖలు రాస్తూనే ఉంటా. ఎప్పూడో ఒకప్పుడు అవన్ని మూటగట్టి ఒక ప్రేమలేఖగా నీకు అందిస్తా, రొజూ చెప్పేదే అయినా అదొక ఆనందం.
నువ్వు రాసిన ఉత్తరం ఇప్పటికి ఒక పదిసార్లు చదివా. నిజమే నీకు నాలా ఉత్తరం రాయడం రాదు!
అలంకార ప్రియుడిని మరీ !
నేను మన ప్రేమ దెగ్గర నుండి చందమామకి, సముద్రానికి, పువ్వులకి, వెన్నెలకి రాసుకుటూపోతాను, మధ్యలో ఎప్పుడైనా గుర్తుకువస్తే మళ్ళీ నేదెగ్గర నుండి మొదలు పెడతా.
నీ ఉత్తరం చదివాకా అనిపించింది, నువ్వు కేవలం 'ప్రియురాలిలా ' రాసావని. ఇప్పుడే చెట్టునుంచి కోసిన పండులా తాజాగా, లేడిపిల్లలా చలాకీగా, స్వచ్చంగా ఉంది (చూసావా?? అలవాటు అయ్యిపోయింది ఇలా చెప్పడం :-) ). మనసులో మాట సరిగ్గా అలానే పెట్టటం కష్టమే. ఉపమానాలు, ఉపమేయాలు వాడి నా ఉత్తరం లిప్స్తిచ్క్, పౌదెర్, ఫౌందతిఒన్ వేసుకున్న అమ్మాయిలా ఉంటే, నీ ఉత్తరం చక్కని పల్లెపడుచులా స్వచ్చంగా ఉంది.
Thank you and I love you.
నువ్విప్పుడు (9.55 PM) నాకు ఫోన్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. నువు లేని ఏ నాలుగు రోజుల్లో నా అలోచనలు సవివరంగా చెబుదాం అని ఉత్తరం రాస్తున్నా, ఫోన్ చెయ్యలేక. నువ్వు ఎదురు పడినప్పుడు చెప్తే ఇవే మాటలు మనం మర్చిపోవచ్చు. ఉత్తరం రాస్తున్నా, జేవితకాలం గుర్తుండాలని. నిన్ను ప్రేమిస్తున్నా. నిను వీడి నే మనలేకున్నా. నిన్నే స్వాసిస్తూ, నీకై జీవిస్తూ, నీ కోసం ఎదురుచూస్తున్నా !
మనం బీచ్ లో కూర్చున్నప్పుడు అనిపించింది, చంద్రుడు మనలను చూసి  వెన్నెల మల్లెలు సముద్రంపై జల్లి, అలల పల్లకీపై నా చెంతకు పంపితే, ఆ మల్లెలు నా చెలి సొగసుని చూసి ఓర్వలేక, ఒడ్డున నురగై కరిగిపోతున్నాయని. ఇంతకన్నా ఏమికావాలి ఏ ప్రియుడికైనా? ప్రేమ అనేది ఒక కళ, అది ఎంత బాగా వస్తే, జీవితం అంత కళగా ఉంటుంది.
మరి అలాంటి ప్రయత్నం లో ఒక సాదా ప్రేమ లేఖ.
ఇక నిద్దుర పోవాలి, శెలవు మరి!
నీకీ ఉత్తరం ఇచే రోజు కోసం ఎదురు చూస్తూ....

Friday, April 19, 2013

WHAT HAPPENS IN HEAVEN


I dreamt that I went to Heaven and an angel was showing me around. We walked side-by-side inside a large workroom filled with angels. My angel guide stopped in front of the first section and said, 'This is the Receiving Section. Here, all petitions to God said in prayer are received.'


I looked around in this area, and it was terribly busy with so many angels sorting out petitions written on voluminous paper sheets and scraps from people all over the world.

Then we moved on down a long corridor until we reached the second section..

The angel then said to me, 'This is the Packaging and Delivery Section. Here, the graces and blessings the people asked for are processed and delivered to the living persons who asked for them.. 'I noticed again how busy it was there.. There were many angels working hard at that station, since so many blessings had been requested and were being packaged for delivery to Earth.

Finally at the farthest end of the long corridor we stopped at the door of a very small station. To my great surprise, only one angel was seated there, idly doing nothing. 'This is the Acknowledgment Section,' my angel friend quietly admitted to me. He seemed embarrassed 'How is it that there is no work going on here?' I asked.

'So sad,' the angel sighed. 'After people receive the blessings that they asked for, very few send back acknowledgments ..'

'How does one acknowledge God's blessings?' I asked.

'Simple,' the angel answered. Just say, 'Thank you, Lord.'

'What blessings should they acknowledge?' I asked.

'If you have food in the refrigerator, clothes on your back, a roof overhead and a place to sleep you are richer than 75% of this world. If you have money in the bank, in your wallet, and spare change in a dish, you are among the top 8% of the world's wealthy .'

'And if you get this on your own computer, you are part of the 1% in the world who has that opportunity...'

'If you woke up this morning with more health than illness ... you are more blessed than the many who will not even survive this day .'

'If you have never experienced the fear in battle, the loneliness of imprisonment, the agony of torture, or the pangs of starvation .... you are ahead of 700 million people in the world.'

'If you can attend a church without the fear of harassment, arrest, torture or death you are envied by, and more blessed than, three billion people in the world. '

'If your parents are still alive and still married ....you are very rare .'

'If you can hold your head up and smile, you are not the norm , you're unique to all those in doubt and despair.'

Ok, what now? How can I start? If you can read this message, you just received a double blessing in that someone was thinking of you as very special and you are more blessed than over two billion people in the world who cannot read at all.

Have a good day, count your blessings, and if you want, pass this along to remind everyone else how blessed we all are.

ATTN:
Acknowledge Dept.
'Thank you Lord, for giving me the ability to share this message and for giving me so many wonderful people to share it with.'

If you have read this far, and are thankful for all that you have been blessed with, how can you not send it on????

I thank God especially for all my family and friends.

కొట్టి వేతల 'ప్రేమ లేఖ'

పొగడ్త లేని ప్రేమ లేఖ (ప్రత్యెకించి అబ్బాయి, అమ్మాయికి రాసే ప్రేమ లేఖ) పువ్వుల్లేని గులాబి మొక్కలాంటిది.
పొగడ్త ప్రేమలేఖకి అందం. నిజాయతీ ప్రేమకి ఆరంభం. మరి పరస్పర విరుధ్దమైన పొగడ్త/నిజాయతీ ఒకేసారి వ్యక్తికరించాలంటే?

ఆ ఆలోచనకు రూపమే ఈ ప్రేమ లేఖ !



ప్రియా, (ఇంకా స్నేహితురాలివేగా So ప్రియమైన స్నేహితురాలికి అంటా)
ప్రియమైన స్నేహితురాలికి XXX కి, (పరవాలేదు OK)
ప్రేమతో  (సినిమా టైటిల్ & పాత రకం... కానీ తప్పదు)
ఎలా ఉన్నావ్? (ఎలా ఉండటమేంటి?? నువ్వు బాగాలేకపోతే నేను బాగుండనుగా !)
అంతా క్షేమం అని తలుస్తాను. (ఇది ప్రేమ లేఖ, క్షేమ సమాచారాల ఉత్తరం కాదు)
Coming directly to the point (ఇంగ్లీష్ వద్దులే, మొత్తం ఇంగ్లీష్లో  రాయాలంటే కష్టం)

ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నేనైపోయా నువ్వు, (సినిమాలెక్కువ చూస్తున్నాలే ఈ మధ్య Lite తీసుకో :-) )
నిను చూసిన తొలిచూపులోనే నీపై .. (తొలి చూపులోనే ప్రేమించడానికి నాకు నీపై ఉన్నది ఆకర్షణ కాదు, గత కొన్నేళ్ళుగా నాకు నీపై కలిగిన గౌరవం ఆపై నమ్మకం ఆపై వలపు అటుపై నువ్వు మీ ఊరు వెళ్ళిపోయిన విరహంలో నీపై ప్రేమ కలిగిందేమో అన్నసందిగ్దత.)

ఆ రోజు ఆశ్రమంలో ముసలివారికి సేవ చేస్తున్న నీ మంచితనం చూసి నీపై మనసుపడ్డా ! ( అంతా అబద్దం నిన్ను నేను ఒక్క గుణమో చూసి ప్రేమించలా, నిన్ను నీలా, నిన్ను మొత్తంగా ఇష్టపడ్డా. షరతులు వర్తించని ప్రేమ, కారణాలు అక్కరలేని ప్రేమ !)

ఆపై మెరిసే నీ కళ్ళు, చంటిపిల్లల్లాంటి నీ నవ్వు నన్ను మురిపించాయి.(ఇది నిజం)
నీ ఒక్క తలపు చాలు నన్ను కలల దొంతరలో నన్ను దాచి కాలాన్ని నిలువరిస్తుంది(ఇది కూడా)
అన్ని పురుగులుండగా రాజమౌళీ ఈగే ఎందుకు తీసాడో తెలుసా??
ప్రేమలో ఉన్నవాడికి రెండు కళ్లు చాలవు ప్రియురాలిని చూసుకోడానికి

ఈగలాగ వెయ్యి కళ్ళన్నా కావాల్సిందే !! (ఇది నిజంగానే నిజం)

భువనైక సుందరీ, నటరాజ పదమంజరీ, ఉషోదయ ఉషా ఝరీ, నా హ్రుదయ లాహిరీ...  (హడవిడి యెక్కువ విషయం తక్కువ)

నువ్వు చీర కడితే మాధురీ దీక్షిత్, ఓణీలో త్రిష, జీన్స్ లో ఐష్..(తప్పు తప్పు, నీలో ప్రతీ అణువునీ నేను ప్రేమించినప్పుడు ఎవరితోనొ నిన్ను ఎందుకు పోల్చాలి?)
అమ్మాయిలకే తలమానికం, అందానికి తూకం, ఆదర్శానికి ప్రతిరూపం (అతి సర్వత్ర వర్జయేత్)
నువు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం ( అలా కాదు కాని,
నువ్వు సుఖంగా ఉంటే నేను ఆనందంగా ఉంటా,
నువు నాతో ఉంటే జీవితమంతా పండగే ప్రతిపూటా !)
నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, ఎండ కన్నెరగకుండా , కాలు నేల తగలకుండా .. ( అతిగా లేదు ?? నిన్ను ప్రేమగా చూసుకుంటా అని చెప్తే చాలదా?)
నిన్ను నేను ప్రేమిస్తున్నా. ఉత్తరంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఏదోలా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నానని నీకు అర్థమయ్యాకా...
నీ కళ్ళు నిజం చెప్పక మానవు

పొగిడి నిన్ను ఒప్పించడం నాకు ఇష్టం లేదుఅది తాత్కాలికం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పా, ఆ పైన నా అదృష్టం !

** నువ్వు నాతో ఉంటె అన్నీ ఉన్నట్టే అని చెప్పను కానీ, నువ్వు  ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను నా  జీవిత కాలం నీకు తోడుంటా !

                                                                                                  ఇట్లు,
                                                                                                  - XXX