Wednesday, October 3, 2018

సెక్షన్ 497 మానవ హక్కుల ఉల్లంఘన - Decriminalize Section 497

సెక్షన్ 497 మానవ హక్కుల ఉల్లంఘన, భార్య భర్త యొక్క ఆస్తి కాదు అని కోర్టు దానిని కొట్టి పారేసింది.

ఈ చర్య హిందూ వివాహ వ్యవస్తకు వ్యతిరేకం అని చాలా మంది గొగ్గోలు చెస్తున్నారు.
ఈ ఆలోచన తప్పు. హిందూ వివాహ వ్యవస్త, నమ్మకం మీద , ప్రమాణం మీద నిలబడుతుంది కాని కోర్టులకి భయపడి కాదు. ఒక వేళ కోర్టుకి భయపడి కలిసిఉన్నారు అంటే ఆ పెళ్ళికి విలువ లేదు, ఎప్పటికైనా గౌరవం లేని ఆ వివాహం విఛ్ఛిన్నమవుతుంది.



ఇక్కడ కోర్టు వ్యాఖ్య లో మాత్రం తప్పుంది !
భార్య భర్త యొక్క ఆస్తి కాదనడమేమిటి? ఆమే తప్పకుండా భర్త ఆస్తే !
ఆమే కాదు, పిల్లలు, తల్లి తండ్రులు, బంధువులు అందరూ అతని ఆస్తే !
తేరా పాస్ క్యా హై అంటే అమితాబ్ " మేరా పాస్ మా హై అన్నట్టు" అతనికి అందరూ ఆస్తి అందరూ అతని ఆస్తి. వివాహం లో ఉన్నంతవరకు ఇద్దరూ ఒకరింకరు అర్థం చేసుకుని గౌరవ మర్యాదలతో నమ్మకంగా సమంగా బతకాలి.

భార్య భర్త కన్నా తక్కువ కాదు,
** 'అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం '
## కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో' అంటాడు మామగారు.

వధువు తండ్రి వరునితో,
**'నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం,ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య
##ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు
 'నాతిచరామి' (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు.
ఇక్కడ వధువు చేత చెప్పించరు, ఎందుకో తెలుసా? నమ్మకం ఆమె మీద.

మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షుల ఉద్దేశం. ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.

స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం.

No comments:

Post a Comment