Monday, May 30, 2022

హిందువు - హిందుత్వ వాది పదాల వివరణ

 ఎవరి పని వారు చూసుకుని..ఓ పక్కోళ్ళది రాసేసుకుని పూసేకోకుండా ఉండటం మంచిది అని చెప్పడం నా ఉద్దేశం.

మేమే కరెక్టనో, మేమే గొప్పనో సోది వద్దు.
అలాంటి మానసిక స్థితితోనే క్రింది వ్యాఖ్యలు చదవండి..
.
ఇక్కడ ఒక మ్లెచ్చులవారు వేదాల్లో మహమ్మదుని వెతుక్కొమని హిందువులను ఉత్సాహ పరుస్తున్నారు(మ్లెచ్చులంటే తామే నని, భవిష్య పురాణంలో చెప్పింది తమ ప్రవక్త గురించే నని విడియో వివరణలో ఉద్ఘాటించారు, సదరు మ్లెచ్చులవారు).
.
ఎవరి పని వారు చూసుకుంటే ఎవరూ ఇంకొకరితో వాదులాడక్కర్లేదు, ఇలా ఉత్సాహపరిస్తే మాత్రం కాస్త సమయం వెచ్చించాల్సి వస్తుంది.
.
1. వేదాలు క్రీస్తు పూర్వం 500 సమయంలో సంస్కృతంలో లిఖించారు, అంతకు ముందు ఎవరు రాసారో తెలియదు, ఈ విషయం తెలుసుకున్న వెద పండితులు ఇస్లాం స్వీకరించారు అని అంటున్నారు. ఇతర గ్రంధాల్లా, ఎవరు రాసారో తెలిస్తే, మానవ లిఖితం అని, తెలివిగా కొంత మంది కలిసి రాసేసారు అని అనొచ్చు. రచయిత తెలియదు కాబట్టి మతం మారి పోయారు అంటే, మారిన వాళ్ళ ఉద్దేశం వేరే ఉండొచ్చు అని నా ఉద్దేశం.
2. "నా తస్య ప్రతిమ అస్తి" - వేదాలు విగ్రహారాధ వద్దని చెప్పాయి అంటున్నారు.
దాని అర్థం నాకు విగ్రహం లేదు , నన్ను వర్ణించే , చిత్రించే సరిగ్గా చూపించేందుకు మీ ఊహ సరిపోదు అని తప్ప, నాకు విగ్రహం పెట్టొద్దు, పెడితే కొడతా అని కాదు కదా?
మరి యజుర్వేదం, సతపత బ్రహ్మణం 14 వ కాండం:
"ద్వెవావ బ్రాహ్మణో రూపే, మూర్తం చైవ అమూర్తం చ " - అంతే దేవుడూ ఆకారుడూ నిరాకారుడూ అని కూడా. అంత శక్తిమంతుడీకి ఒక రూపం దాల్చడం రాదంటారా?
3. "ఎకం సత్య విప్రా బహుదా వదంతి" - అంటే దేవుడు ఒకడే కాని, మీరూ మేము ఒక దేవుడినే పూజిస్తున్నాం పేర్లు వేరే అనే కాని, దేవుడికి వేరే పేర్లు పెట్టొద్దు, కత్తి ఎవడి చేతిలో ఉంటే వాడి దేముడే కరెక్టు అని కాదు. పుర్రెకో బుద్ధి జిహ్వ కో రుచి, యద్ భావం తద్ దృశ్యతి, ఎవరిని పూజించినా, నాస్తికుడివైనా మంచిగా బతకమని ఉద్దేశం.
4. సామవేదం 2:6:8 - "అహ్మదు తన దేవుని వద్దనుండి శాశ్వత ధర్మం నేర్చుకున్నాను" అని తర్జుమా చేసారు. సరే మరి అది నిజమే అనుకుందాం కాసేపు.
సామవేదం 2:6:1 - సుదక్షుడు చేసిన సోమరసం, బార్లీ నీళ్ళు తాగాడూ అని ఉంది ! మరి ఇది ఒప్పుకుంటారా? అందరూ తాగడం మొదలు పెడతారా? లేదంటే ఇది ఇంద్రుని గురించి ప్రస్తావన అని ఒప్పుకుంటారా?
5. భవిష్య పురాణం 3:3:3:5-8 శ్లోకంలో "మ్లెచ్చుల రాజ్యం నుండి మొహమదు అని ఒక గురువు వస్తాడు అతని అనుచరులు పెరుగుతారు అని ఉంది అంటున్నారు.
ఇది నిజమే అయ్యుండొచ్చు.
భవిష్య పురాణం 3:3:3:5-1 శ్లొకం నుండి చదివితే,
కలి పురుషుడు తన భార్యతో కలిసి తపస్సు చేసాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు (మరి దేముడు విష్ణువని ఒప్పుకుంటున్నారా?), మరి అదే పురాణం, మొహమ్మదు సివలింగానికి పూజ చేస్తాడూ అని చెప్తోంది .. ఒప్పుకుంటారా.. శివుడే పరమాత్మని? కలి ప్రభవం వల్ల ఒక దారుణ మైన, రాక్షస రాజ్యం ఏర్పాటు చేస్తా అంటాడు.. మరి మీరు అది మొహమ్మదు అని అంటున్నారా?
.
హిందువు - హిందుత్వ వాది పదాల వివరణ..మీకు తెలిసినా తెలియనట్లు నటించే, అసలు సిసలైన నిర్వచనం
హిందు : సనాతన ధర్మానుచరుడు
హిందుత్వ వాది: యూదుల వలే, యజిదీల వలే, బలోచ్, అఫ్ఘాన్ వాలే తమ సనతన ధర్మం పతన మయ్యిపోకుండా కాపాడుకోవాలేనుకునే వాడు !

https://www.facebook.com/ireaofficial/videos/1214787142367734

No comments:

Post a Comment