Monday, August 5, 2013

ఒక రాజు, ఏడుగురు కొడుకులు


అనగనగా ఒక ఊరిలో రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు.
ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఏడుగురు ఏడు చేపలు తెచ్చి వాటిని ఎండబెట్టారు.

సాయంత్రానికి ఆరు చేపలు ఎండాయి కాని, ఏడో చాప ఎండలేదు.
ఆ చేపను పట్టిన రాజకుమారుడు, చేపని “చేప చేప ఎందుకు ఎండలేదు” అని అడిగాడు.




ఆ చేప “గడ్డిమేటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది.

ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు.
గడ్డిమేటు “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని అంది.

రాజకుమరుడు ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు?” అని అడిగాడు.
“నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.

రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “ఎందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు?”
పాలెరాడు “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని అన్నాడు.

అమ్మని అడిగితే అమ్మ “ఆక్కడ పాప ఎడుస్తొంది” అంది.

రాజకుమారుడు పాపని “పాప, పాప, ఎందుకు ఏడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.


రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడి లాగ చీమని కూడ అడిగాడు “చీమ చీమ పాపని ఎందుకు కుట్టావూ?”

ఆప్పుడు చీమ “నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?” అని అంది !



చిన్నప్పుడు మా అమ్మ మాకు ఈ కథ చెప్పేది.
ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయి.
చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో ఎండు చేప లేదు

No comments:

Post a Comment