మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచం మన ఆలోచనల్లోంచే పుట్టింది. ఈ ప్రపంచన్ని మార్చాలంటే మన ఆలోచనలను మార్చుకోవాలి.
Coal and Diamond are both carbon, its just how the atoms are arranged makes difference. Our thoughts are also same, they make us, its in our hands ! Thought is LIFE !
ప్రతీ నెలా జీతం పడగానే ఎదోక పుస్తకం కొనడం నాకు అలవాటు. 2008-2009 సమయంలో నేను ఫేస్బుక్కు లో ఫాంవిల్లీ , మాఫియా వార్స్ అని రెండు గేంస్ ఆడేవాడిని. వాటికి నేను ఎంత అలవాటు పడ్డానంటే, నాకు 4 ఎకౌంటులు ఉండేవి అవి ఆడటానికి. మెళకువగా ఉన్న సమయంలో కనిసం 30-40% ఆడుతూనే ఉండేవాడిని.
.
ఆ ఆటలు ఒక ప్రపంచం. ఫారంవిల్లీ లో మనం వ్యవసాయం చెయ్యాలి. తవ్వి, గింజలు వేసి, నీరుపోసి, మొక్కలు పెరిగేదాకా ఆగాలి. పంట పండాక అమ్మి వచ్చిన డబ్బులతో పొలం కొని మళ్ళీ వ్యవసాయం. అదొక లోకం. డబ్బులు పెట్టి కొని, మొక్కలు త్వరగా పెరిగేలా చెయ్యొచ్చు, పొలాలు కొనొచ్చు, వ్యవసాయ పరికరాలు కొనొచ్చు, ఇది ఒక వ్యసనంలా మారిపోయి డబ్బులు ఖర్చు చేసినవారు కూడా ఉన్నారు.
.
మాఫియా వార్స్ ఇంకొక రకం. గన్స్, బాంబ్స్, కార్స్, చంపడాలు, చావడాలు. ఒక భయంకర ప్రపంచం.
.
కేవలం లాప్టాప్ తెర మీద ఆడే ఒక ఆటే కాని మహా వ్యసనం.
.
నాకు ఒక 6 నెలల తరువాత కనీసం పేజీ తిప్పని పుస్తకాలు చూస్తే కానీ అర్థం కాలేదు నేను ఫేస్బుక్కుకి ఎంత బానిస నయ్యిపోయానో. మరు క్షణం నేను గేంస్ ఖాతాలు పూర్తిగా మూసివేసాను. అప్పుడు పరిస్థితులు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాయి. ఇప్పటికి నేను, ఆరు నెలలకోసారి కొన్ని రోజుల సామాజిక మాధ్యమాల సన్యాసం చేస్తుంటాను :-) .
.
మెటావర్స్ ఒక యూనివర్స్. అది లాప్టోప్ స్క్రీన్ కాదు. 3డి లోకం. బాహ్య ప్రపంచంలో మనం చెయ్యలేనిదంతా అక్కడ చెయ్యొచ్చు. స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకు ఫ్రీ జంప్ చెయ్యొచ్చు, సముద్రపు అట్టడుగుల్లో ఈదులాడోచ్చు, జ్వాలాముఖి పేలినప్పుడు దాని లావాలో దుమికి మళ్ళీ బయటకు రావొచ్చు, ఈఫిల్ టవర్ ఎక్కి ఫొటో దిగొచ్చు.. ఇవన్నీ అతి తక్కువ ఖర్చుతో, గది బయట అడుగు పెట్ట కుండానే చెయ్యొచ్చు.
ఒకే చోట ఉండి ముద్దుపెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి అనుభవం అమెరికాలో ఉన్న ప్రియురాలు , ఇండియాలో ఉన్న ప్రియుడు మెటావర్స్లో పొందుతారు. ఆ టెక్నాలజి అలాంటిది.
అవకాశాలు అనంతం. ఎందుకంటే మన ప్రభుత్వాలు, మన కట్టుబాట్లు, మన సరిహద్దులు, సైన్సు సూత్రాలు ఇవన్ని వర్తించని ఒక ఎల్లలు లేని లోకం అది.
కొత్త లోకం కదా అక్కడ అందరూ సమానమే అనుకుంటారేమో, అక్కడ కూడా కొన్నుక్కున్న వారికి కొనుక్కున్నంత.
.
కంపెనీ వికలాంగులను అడ్డం పెట్టుకుని, నిజ జీవితంలో వారు చెయ్యలేనివి అక్కడ చెయ్యొచ్చు అన్ని చెప్తున్నారు.
ఇది కూడా ఫెయిర్ అండ్ లవ్లీ, నల్లగా ఉన్నవారు తెల్లగా అవ్వండనో , నిగ నిగలాడండనో జనాల్ని కించ పరచినట్టు వికలాంగులను ఫేస్బుక్ అవమానపరచి నట్టే, వారిని వాడుకున్నట్టే. మాయా లోకంలో వారిని తిప్పే కన్నా, వారి సాధికారతకు తోడ్పాటు పడే పనులు వేరే చాలా చెయ్యవచ్చు.
.
ఇదంతా నేను మెటావర్స్ గురించి భయపెట్టడానికి చెప్పట్లేదు. పిల్లలు పెద్దలు ఆ మాయా లోకంలో పడి నిజ జివితంలో సమయం వృధా చేసుకోకుండా, జాగ్రత్త పడాలి అంటున్నాను.
అతి సర్వత్ర వర్ఝయేత్ అని పెద్దలు చెప్పారు.
అతి కానంతవరకు, హద్దులు దాటనంత వరకు అన్ని మంచివే.
కొంచెం తాగితే ద్రాక్షరిష్ట మంచిదంటారు, ఎక్కువ తాగితే తాగుబోతు ఎదవని తన్నండంటారు.
.
ఇక మంచి ఏమిటంటే, చాలా కొత్త ఉద్యోగావకాశాలు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, స్టాటిస్టిక్స్ వాళ్ళకి మంచి ఉద్యోగాలు.
సినిమా వాళ్ళకు, కళాకారులకు కొత్తలోకాలు సృజించే అవకాశాలు.
మెటా వర్స్ కోసం ఆడిన్స్ తయారు చేసే కంపెనీలు.,
అక్కడా ఆడ్ ఏజన్సీలు.
మన కంపానీలు మెటా వర్స్ లో ఆఫీసులు తెరచినా ఆశ్చర్య పడక్కర్లేదు.
అక్కడ పర్యవేక్షించడం సులభం మరి.
పెళ్ళిళ్ళు , పేరంటాలు, దైవ దర్శనాలు అన్నీ మెటాలోనే.
దీనిని మనం ఆపలేం.
దీనికి ముందు ఇంటర్నేట్ లాంటి చాలా వాటిని ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యాం.
మన గత అనుభవాలనుంచి నేర్చిన పాఠాలతో మనం ముందుకు వెళ్ళాలంతే.
బ్రాహ్మణ విద్వేషం పెంచి హిందువులను కులాల వారిగా విడగొట్టి, ఒకరిపై ఒకరికి విద్వేషం పెంచి, ఓట్లు చీల్చి, మందబుద్ధిగాడిని అందలం ఎక్కించాలని కొంతమంది, మతం మార్చాలని కొంత మంది, ఈ సందట్లో హడావిడి చేసి గొప్పోళ్ళయి పోవాలని, పబ్బం గడుపుకోవాలని ఇంకొంతమంది విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు.
కులాల మధ్య సామరస్యం సంస్కారం లేకపోతే ఇన్ని వందల సంవత్సరాలు భారతదేశంలో ఇలాంటి కట్టుబాటు ఎలా నిలబడుతుంది ?
వృత్తుల నుండి ఇప్పుడు మనం కులం అని పిలుస్తున్న ఒక కట్టుబాటు ఒక్క రోజులో వచ్చింది కాదు. ఒక రోజు హటాత్తుగా వచ్చేసి ఈ రోజు నుంచి నేను బ్రాహ్మడను, నువ్వు కమ్మ, నువ్వు రాజు, వాడు కాపు నువ్వు అంటరానివడివి అంటే ఊరుకుంటాడా ఎవడైనా?
అడవుల్లో గిరిజనుల్లా గుంపులుగా సంచారులుగా వేటాడుకుంటూ, బతికే వాళ్ళకి కులం ఎందుకు కావాలి? కండ బలం ఉంటే ఏ జంతువు నో వేటాడొ, ఏ చెట్టెక్కి కాయలు కోసుకుతినో బతికెయ్యొచ్చుగా?
యుద్ధాలు చేసి రాజెందుకు చావాలి? ఓడిపోతే వాడి కుటుంబం మొత్తం ఎందుకు జనం కోసం చచ్చిపోవాలి?
అర్థరాత్రి అపరాత్రి తేడా లేకుండా కాపెందుకు కాపు కాయాలి? కమ్మ ఎందుకు ఒళ్ళు హూనం చేసుకు వ్యవసాయం చెయ్యాలి? అసలు కమ్మరి,కుమ్మరి,శెట్టి,పద్మశాలి,గౌడ ఇలా వృత్తులు ఎందుకు చెయ్యాలి?
చివరగా.. అడవిలో మనుగడకు అవసరమైన కండబలం, ఎండలో తిరిగి, కాయ కష్టం చేస్తే వచ్చే రోగనిరోదక శక్తీ వదులుకుని, మందు విందు పొందు తప్పు కాని రోజుల్లో మడి కట్టుకుని ఇంట్లో ముక్కుమూసుకుని కూర్చుని జపం చేసుకోవల్సిన పరిస్తితి బ్రాహ్మణుడికి ఎందుకు ? కొంత మంది పనికి మాలినోళ్ళ చేత సోమరిపోతులు అనిపించుకోడానికా?
1. మనిషి ప్రకృతి పరంగా ఒక జంతువు, తన ప్రాణానికి మించి ఏది ముఖ్యం కాదు అన్నది మనకు సహజ ప్రవృత్తిగా పుట్టుకతో వస్తుంది
3. జంతువులకు మరణ భయం ఉంటుంది కానీ చావు అంటే అర్థం చేసుకునే ఆలోచనా శక్తి ఉండదు కాబట్టి అవి అంతరించిపోకుండా ప్రకృతి సంభోగం పిల్లల సం రక్షణ లాంటివి కూడా సహజ సిద్ధంగా వస్తాయి
ఈ మూడింటి గురించి కలిగే అభద్రతా భావాలను అధిగమించిడం కోసం, తరువాత స్తితిలో దైనందన జీవితం సుఖమయం చేసుకోవడం కోసం మనిషి సాంఘీకపరమైన కట్టుబాట్లు, ఆచారాలూ వృత్తులూ కనిపెట్టుకుంటూ వచ్చారు. ఇప్పటి మోడల్ విలేజ్ లా, స్వావలంబన కలిగిన వ్యవస్థ కోసం ప్రయత్నించారు. దానిలో భాగంగానే వృత్తుల కులాలు పుట్టాయి.
వ్యవసాయం ఒక పెద్ద శాస్త్రం, అది ఒకరి నుంచి ఒకరు, పని చేస్తూ నేర్చుకోవలసిందే ! ఎంతో ప్రేమాభిమానాలు ఉంటే తప్ప నేర్పించేవాళ్ళు నేర్చుకునే వాళ్ళకు కిటుకులతో సహా నేర్పించలేరు, అది మనవ సహజం. జ్ఞానం క్షీణించిపోకుండా ఉండాలని వృత్తుల కుటుంబాలు మొదలయ్యాయి. తండ్రి నుంచి కొడుక్కి, మామ నుంచి అల్లుడికి నైపుణ్యం అబ్బింది. ఇంట్ళో ఉండేవాడు మందు తాగితే 24 గంటలూ అదే పనిలో ఉంటాడు. పొలంలో పనిచేసేవాడి తిండి వేరే. ఆడవాళ్ళ పాత్ర 60% కన్నా ఎక్కువ, అది వేరే వ్యాసమే అవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కుటుంబం లో అందరూ మానసికం గా అందంగా, శారిరకంగా బలంగా ఉండాలంటే ఎం చెయ్యాలో ఎం తినాలో ఎలాంటి అలవాట్లు ఉండాలో అవి నిర్ణయించేది ఆడవాళ్ళే, అప్పటి ఆరెంపీ డాక్టర్లు.
కుల వృత్తులు, కుల పెళ్ళిళ్ళూ అలా పుట్టినవే.
కాల క్రమేణా ఒక గౌడ చెట్టు ఎక్కినట్టు ఒక కమ్మ వ్యవసాయం చేసినట్టు వేరే కులం వాళ్ళు చెయ్యలేకపోయారు. కులాలు మరింత బలంగా మరింత సమర్ధవంతంగా పనిచేశాయి. ఒకటో తరగతి నుంచి పీహెచ్ డీ దాకా చదివినట్టు నైపుణ్యం పెరిగిపోయింది. అలాగే వైద్యం, న్యాయం మొదలైన శాస్త్రాలు పుట్టుకొచ్చాయి.
మనం మాట్లాడుకున్న ముఖ్యమైన మూడు కీలక మైన అవసరాలు తీరిపోతే, నిబద్ధత లేని మనిషికి, ఈర్ష్య, దురాశ వంటివి ప్రకోపిస్తాయి. అటువంటి వారి వల్ల రాజ్యాల మధ్య, తెగల మధ్య, కులాల మధ్య, కుటుంబాల మధ్యా సమస్యలు మొదలయ్యాయి. అవి తీర్చడానికి అందరి కన్నా బలవంతుడు అవసరమయ్యాడు. కండబలం, మంది బలం, ధనబలం ఉన్నవాడు రాజయ్యాడు. బుద్ధిబలం కూడా తోడైతే మహా రాజయ్యాడు.
ఇక కళలు- సంగితం, చిత్రలేఖనం లాంటివి ఊపందుకున్నాయి. వ్యాపారం చేసే కోమట్లూ వచ్చారు.
ఇన్ని కులాలు ఇంత నైపుణ్యం ఇంత జ్ణానం ఒక్క ప్రకృతి వైపరిత్యం తోనో, మహమ్మారి తోనో యుద్ధం తోనో తుడిచి పెట్టుకుపోకూడదని, అంచేలంచలుగా ఎదగాలనే సదుద్దేశంతో ఒక లైబ్రెరియన్లా బ్రహ్మణులను స్రుష్టించారు. అంతవరకు ఉన్న జ్ఞానాన్నంతా వేదాలుగా విభజించి, అవి పతనమవ్వకుండా వేద విధ్యా విధానం స్రుష్టించి, అంత పెద్ద జ్ఞాన భాండారాన్ని దేశం నలుమూలలా వ్యాపింప చేశారు బ్రాహ్మణులు. రాజ్యం రాజు దెగ్గర, వ్యవసాయం కమ్మ దెగ్గర అలా ఎవరి వృత్తులు వారి దెగ్గర ఉన్నట్టే విద్య బ్రాహ్మణుల దెగ్గర ఉండి పోయింది. ఐతే లక్ష్మి, విద్య ఒక చోట ఉండకూడదు, ఒక్కరికే బలం ఎక్కువ అయ్యిపోతుంది అని, బ్రాహ్మణులను ధన సముపార్జన పై మక్కువ చూపకుండా, రాజ్యాలు ఏల కుండా, విద్య పై శ్రద్ధ పోకుండా ఉండటానికి కావాల్సిన కట్టడులన్నీ కూడా చేసారు. బ్రాహ్మణులు స్వేచ్చ కోల్పోయారు.
ఒక్క సంవత్సరం పాటు 6 సబ్జక్టులు, టెక్స్త్ బుక్, నోట్ బుక్, హోం వర్క్, వర్క్ షీట్స్, ట్యూషన్స్ అని సదుపాయాలు కల్పిస్తే 100 కి 50 మందికి కుడా 100 రావు.
లక్షల స్లోకాల వేదాలు ఆపై ఉపనిషత్తులు పురాణాలు, సహశ్రావధానాలు కేవలం విని, గుర్తు పెట్టుకుని, మళ్ళీ చదివి వాటి మిద మళ్ళీ వాఖ్యానాలు రాసి బ్రాహ్మణులు ఎంత కష్టపడుంటారు?
ఇన్ని చేసినా అధికార దుర్వినియోగం అన్ని కులాల్లోనూ జరిగింది, స్వార్ధపరులైన వాళ్ళు ఒక్క కులం లోనే పుట్టాలని ఏమి లేదు. ఎవ్వరికి తోచింది వాళ్ళు చేసుకున్నారు.
అలాంటి వారి వల్లా, పరాయి పాలన వల్లా మన వృత్తులు ఎదగలేదు, మరుగున పడి పోయాయి, మన వేదాలు అక్కడే ఉండి పోయాయి. వాటి విలువ పడిపోయి కొత్త సాంకేతిక విద్య విలువ పెరిగింది, విద్యకు అధిపతులుగా కొన్నాళ్ళు బ్రహ్మణులు సాంకేతిక విద్య నేర్చుకున్నా తరువాత కాలం లో అది పోయింది, రాజుల రజ్యాలు పోయాయి, భూపతుల భూములు ప్రభుత్వాలకు వెళ్ళాయి.
ఈ మొత్తం లో ఏ ఒక్క కులం ని ఎలా తప్పు పడతాం? తిలా పాపం తలా పిడికెడు.
మా తాతలు చెప్పులు మోశారు, మీరు ఇప్పుడు అనుభవించండి అంటే అది ఎలా న్యాయం? మా తాతలు కష్టపడ్డారు, అందరి తాతలు అప్పటి కాలానికి సరిపడ కష్టపడ్డారు.
హిందువులు ఇలా అనవసరంగా ఒకరినొకరు చులకన చేసుకుంటే మనం కూర్చున్న కొమ్మ మనమే నరుక్కున్నట్టు ! జరిగిపోయినదాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అందరికీ జరగాల్సిన న్యాయం గురించి ఆలోచించాలి. చెప్పుడు మాటలు విని తప్పుడు వాళ్లను సమర్ధిస్తే అందరికీ నష్టమే ! ఏదైనా కులాన్ని కించపరిచే లా మాట్లాడేటప్పుడు ఒక్క సారి అలోచించండి. అందరిని కలిపి అనొద్దు. అసలు కుల ప్రస్తావనే వద్దు. కాలం మారిపోయింది ఇవాళ కాకపోతే రేపైనా ఈ కులాలు పూర్తిగా పోతాయి. లోకువయ్యిపోతే మత్రం మన అస్తుత్వమే పోతుంది, మన భారత సంప్రదాయాలు, కళలు, ఆచారాలు గొప్పవి., కాని శాస్త్రీయ సంగీతంలో ఫ్యూజన్ వచ్చినట్టు కొన్ని మార్పులు జరగాలి అవి సమ్యమనం తో మార్చుకుంటే సరిపోతుంది. పాత వారిని వదిలెయ్యండి, మన జనరేషన్లో దురాచారాలు పాటించేవారు ఎవరూ ఉండరు.
In the interest of mankind it’s time we need to accept the HARD TRUTH, no GOD has come to SAVE world from this pandemic. Not even ONE.
I believe that GOD exists for a different purpose and not do some cheap magic tricks.
No! Your GOD or MINE won’t save us.
No! it’s not PUNISHMENT by any GOD but man made mistakes.
Personally everyone is entitled for their own beliefs.
If you still believe in magic, please don’t play with CORONA virus, try some potassium CYANIDE.
You take poison, you die out of belief, your problem.
You spread corona bcoz of your belief, people die, you are a CRIMINAL.
Now, come into SENSES.
Kings, Queens, Presidents... No one is safe, no one is SPARED.
Stop planning for mass celebration of FESTIVALS, your daily PRAYERS in groups, ROAMING on roads.
Corona wont stop till you stop... going out.
Live today to celebrate tomorrow.
Stop blaming Govt. for every PROBLEM, stop that Netflix/amazon prime and try to find a SOLUTION.
Poor are suffering? Take permission, prepare and go out to distribute food.
#covid19 #stayhome #staysafe #supportgovernament #bealert
Two policemen including DSP injured; reason for violence not immediately known Two groups of people clashed in Bhainsa town of Nirmal district around late in the night on Sunday, January 12. District Superintendent of Police C. Shashidhar Raju and Bhainsa CI Venugopal Rao received minor injuries in the violence and were being treated at a local hospital. According to reports, both sections hurled stones at each other at the Korbagalli locality. But the videos shows otherwise. Instances of arson were also reported, where three motorcycles were allegedly burnt by unidentified miscreants.
The reason for the incident was not immediately known. Police forces were being rushed to the town. We are looking for what actually happened in bhainsa ... anyone from there? First hand info please !!
On 25 November- International Day for the Elimination of Violence against Women, we believe its our duty to stand with women acknowledging their rights and spreading awareness about the cause.
Some alarming figures: 1 in 3 women and girls experience physical or sexual violence in their lifetime, most frequently by an intimate partner Only 52% of women married or in a union freely make their own decisions about sexual relations, contraceptive use and health care Worldwide, almost 750 million women and girls alive today were married before their 18th birthday; while 200 million women and girls have undergone female genital mutilation (FGM) 1 in 2 women killed worldwide were killed by their partners or family in 2017; while only 1 out of 20 men were killed under similar circumstances 71% of all human trafficking victims worldwide are women and girls, and 3 out of 4 of these women and girls are sexually exploited Violence against women is as serious a cause of death and incapacity among women of reproductive age as cancer, and a greater cause of ill health than traffic accidents and malaria combined.
కొండలు పిండి చేసి భూమిని కోట్లకమ్మేసి
నదులను పీల్చేసి నీళ్ళను బాటిళ్ళ నింపేసి
స్వార్ధం నిండిన గాలితో ఊపిరి తీసేసి
సిగ్నళ్ళతో ఆకాశం కాజేసి
పొగలతో సూర్య చంద్రులను దాచేసి
ఖరీదైన ఫోన్లు, విలాసవంతమైన ఇళ్ళు
ఎక్కువై పారేసేంత తిండితో
మనం ఈ చిన్నారులకు అన్యాయం చేసే సంఘాన్ని నిర్మించుకున్నామా?
- చాలా రోజుల క్రితం కోళ్ళను ఈడ్చుకుంటూ వెళ్తున్న బండిని చూసి బాధ పడ్డా, మళ్ళీ ఈ రోజు...
కళ్ళు మూసుకుని అంతా బాగుందని మనం మంచోళ్ళమనుకుని ముందుకెళ్ళిపోవడమేనా
మనం చేస్తున్నది ?
AMWAY - By chance i did come across this company and just did some - search 15 minutes. Below is what i found.
In India CAL MAG- Claims that it strengthens bones In US - it says nourishes bones but "the statement not approved by FDA" IN UK - Does NOT claim ANYTHING, just says calcium helps bones... kind of things and lets reader assume things !
Is it really worth it? Is it really what it claims to be absolute perfect research products ! Is it still alive just because of chain marketing, loopholes in law and not quality???
బౌద్ధుల మీద దాడులకు బౌద్ధ గ్రంథాలు glorify చేసిన దాంట్లో శాస్త్రీయత ఎంత ఉంది అనే దాని మీద నాకున్న పరిమితి నేను అర్థం చేసుకున్న పరిధిలో నా విశ్లేషణ ఇస్తున్నాను.
ఇది నిజం లేదా ఇదే విధంగా జరిగి ఉంటుంది అని కాదు.
ఇది కేవలం నా విశ్లేషణ గా చదవండి.
మొదటగా 84000 స్థూపాలు కట్టడం అనేది శ్రీలంక బుద్దిస్ట్ లిటరేచర్ glorify చేసింది.
అప్పట్లో అది అశోకుడు కాలంలో మనకున్న వసతులతో సాధ్యం అయ్యే పని కాదు.
అశోకుడి స్థూపాలు ఒక 1000 ఉండి ఉంటాయి అనుకుందాం.
రెండవది స్థూపాలలో monk ఉండరు. విహారాలు ఆరామాలు లో ఉంటారు.
కాబట్టి ఈ సంఖ్య ఏ రకంగా చూసిన మేధస్సు కి అందని విషయం.
దీనిని ఎందుకు glorify చేసుంటారో చూద్దాం.
అశోకుడు మొదటి గొప్ప చక్రవర్తి బుద్ధిజం తీసుకొని వ్యాప్తి చేసిన వాళ్ళలో. కాబట్టి ఆయన పేరు మీద ఈ glorification ప్రారంభం చేశారు.
కాని నిజంగా అంత శాంతి పాటించాడు అంటే కాదు అంటున్నారు చరిత్ర కారులు.
క్రిమినల్ ట్రైబ్స్ నీ నిర్ధాక్షిణ్యంగా ఉరిశిక్షలు వేయించారు ఎటువంటి సానుభూతి లేకుండా ఆయన.
ఇక టెక్నికల్ గా historians ఏమి చెప్పారో చూద్దాం.
Etienne Lamotte అనే చరిత్రకారుడు బౌద్ధం గురించి చాలా విషయాలు చెప్పాడు.
ఆయన linguistics తెలిసిన వ్యక్తి కూడా. పాళీ, సంస్కృతం లాంటి భాషలు కూడా వచ్చు.
ఆయన చెప్పిన విషయాల ప్రకారం sunga dynasty నిజానికి బుద్దులని పట్టించుకోలేదు.
ఇంకో మాట అంటారు సాంచి లో బుద్దిస్ట్ స్థూపం కట్టడానికి సాయం చేశారు అని .
ఒక్క పుష్యమిత్ర మాత్రం ఏదన్నా చేసున్న కొన్ని నాశనం చేసి ఉండొచ్చు అని అనడం జరిగింది.
అంతే కాకుండా అదే సమయంలో శాతవాహనులు బ్రాహ్మణ మరియు బౌద్ధం ని సమానంగా చూసారు మరియు రెండు మతాలు కలిసి జీవనం సాగించాయి.
కారణం అప్పటికే బౌద్ధం rituals మరియు బ్రాహ్మణ వాదానికి దగ్గరగా జరిగింది.
గుప్తుల కాలం వచ్చే సరికి త్రిమూర్తులు వచ్చారు. దశావతారాలు వచ్చాయి మరియు ఆ దశావతారం లో బుద్ధుడు చేరాడు.
అప్పటికే బుద్ధిజం తగ్గుముఖం పట్టింది ఒక్క eastren states లో తప్ప.
హర్షుడు గుప్తుల తర్వాత నిలబెట్టడానికి చూసాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.
ఇక్కడ ఎక్కడ బౌద్ధాన్ని తొక్కాల్సిన పని లేదు. ఇక 7 వ శతాబ్దం కూన పాండ్య వంశానిది దక్షిణాన. శైవం వ్యాప్తి ప్ర్రారంభం అయ్యింది. తర్వాత రాజా రాజా చోళుడు రావడంతో వైష్ణవం ప్రారంభం అయ్యింది. ఇక వాళ్ళ రచ్చలో వాళ్ళు ఉన్నారు.
ఇక 1902-1928 వరకు ఉన్న పురావస్తు నిపుణుడు అయినా john marshall అయితే ఖచ్చితంగా ఒక్క విషయం చెప్పారు. Sunga dynasty నాశనం చేశారు అనడానికి circumstantial evidence లేదు అనేసారు. ఇక పుష్యమిత్రుడు విషయానికి వస్తే రాజ్యకాంక్ష విపరీతంగా ఉండటంతో మౌర్యుల చక్రవర్తుల అవశేషాలు ఉండకూడదు అని అన్ని నాశనం చేసాడు వాటిల్లో ముఖ్యం అయినది అశోకుడి శాసనాలు. అవి తర్వాత బ్రిటిష్ తవ్వకాల్లో బయటపడ్డాయి.
ఇక నలంద విశ్వవిద్యాలయం నాశనం అయ్యింది తురుష్కుల దాడుల్లో. దీనికి ఈ రాజులకి సంబంధం లేదు.
ఇక శంకర విజయాలు కి వస్తే , ఆయన బుద్ధిజం ని నాశనం చేసాడు అనే మాట కన్నా ఆయన హిందూ మతాన్ని stabilize చేసాడు అనొచ్చు. ఒక రకంగా హిందూ మతంలో పుట్టిన mass leader. కొత్త వ్రతాలు, పూజలు ఇలా. కొన్ని స్తోత్రాలు పరిచయం చేసి ప్రజల్లో దేవుడు అయ్యాడు.
బౌద్ధాన్ని నాశనం చెయ్యడం కన్నా భౌతిక వాద ఆలోచనలను నాశనం చేసాడు.
అసలు హింసే లేదు అంటే కూడా ఒప్పుకోను. చేశారు కానీ ఈ బౌద్ధ గ్రంధాలు glorify చేసినంత సీన్ అయితే లేదు ఖచ్చితంగా. రాజ్యకాంక్షలో, బౌద్ధం మీద అసూయతో కొన్ని నాశనం చేసి దశాబ్దాల కాలంలో అడ్డొచ్చిన కొన్ని వేలమందిని చంపి ఉండొచ్చు. ఇది హింసే తప్పే.
కానీ విషయం చెప్పడానికి దాన్ని మనం ఎక్కువ చెయ్యాల్సిన పని లేదు.
కేవలం విషయం చెబితే చాలు అని నా అభిప్రాయం
చివరిగా ambedkar గారు ఊరికినే ఉంటారా అని అనుకుంటున్నారా ఇలాంటి రచ్చ చేస్తే?
చీల్చి చెండాడి ఉండేవారు, ఆయన హేతువు ఉన్నంతవరకు ఉన్న బుద్ధ ఫిలాసఫీ తీసుకున్నారు. హింస గురించి చెప్పారు కానీ ఇంత రచ్చ గురించి ఆయన కూడా చెప్పలేదు.
సెక్షన్ 497 మానవ హక్కుల ఉల్లంఘన, భార్య భర్త యొక్క ఆస్తి కాదు అని కోర్టు దానిని కొట్టి పారేసింది.
ఈ చర్య హిందూ వివాహ వ్యవస్తకు వ్యతిరేకం అని చాలా మంది గొగ్గోలు చెస్తున్నారు.
ఈ ఆలోచన తప్పు. హిందూ వివాహ వ్యవస్త, నమ్మకం మీద , ప్రమాణం మీద నిలబడుతుంది కాని కోర్టులకి భయపడి కాదు. ఒక వేళ కోర్టుకి భయపడి కలిసిఉన్నారు అంటే ఆ పెళ్ళికి విలువ లేదు, ఎప్పటికైనా గౌరవం లేని ఆ వివాహం విఛ్ఛిన్నమవుతుంది.
ఇక్కడ కోర్టు వ్యాఖ్య లో మాత్రం తప్పుంది !
భార్య భర్త యొక్క ఆస్తి కాదనడమేమిటి? ఆమే తప్పకుండా భర్త ఆస్తే !
ఆమే కాదు, పిల్లలు, తల్లి తండ్రులు, బంధువులు అందరూ అతని ఆస్తే !
తేరా పాస్ క్యా హై అంటే అమితాబ్ " మేరా పాస్ మా హై అన్నట్టు" అతనికి అందరూ ఆస్తి అందరూ అతని ఆస్తి. వివాహం లో ఉన్నంతవరకు ఇద్దరూ ఒకరింకరు అర్థం చేసుకుని గౌరవ మర్యాదలతో నమ్మకంగా సమంగా బతకాలి.
భార్య భర్త కన్నా తక్కువ కాదు,
** 'అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం '
## కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో' అంటాడు మామగారు.
వధువు తండ్రి వరునితో,
**'నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం,ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య
##ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు
'నాతిచరామి' (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు.
ఇక్కడ వధువు చేత చెప్పించరు, ఎందుకో తెలుసా? నమ్మకం ఆమె మీద.
మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షుల ఉద్దేశం. ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.
స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం.
75 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ ఇస్తున్నా.... ఇంకా కుల వ్యవస్త పోలేదు ఇంకా కులాంతర వివాహాలు జరగట్లేదు, పెద్ద చిన్న అన్న భావాలు తొలిగిపోవట్లేదు, అంటే... 75 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ ఇస్తున్నా.. అది పని చెయ్యట్లేదు !! ఎందుకు పని చేస్తుంది? ఒక సమస్యకి సమాధానం ఇంకొక సమస్య ఎలా అవుతుంది?
నీ ఇంటి పిల్లని నా ఇంటికి ఇవ్వట్లేదని, నీ ఇంటిని నేను లాగేసుకుటే న్యాయమా? నువ్వు మారాలి, కులాన్ని వదిలి పెట్టాలి అని నేను నా కులాన్ని అడ్డుపెట్టుకుని నీ ఆస్తి లాగేసుకుంటే ఒప్పుకుంటావా? అది వారి హక్కు లా భావిస్తారు. తండ్రికి 50,000 జీతం పెట్టుకుని, కొడుకు రిజర్వేషన్ వాడుకున్నాడు అంటేనే తప్పు. దానికి మళ్ళి నీ చెల్లిని ఇస్తావా ని అతి తెలివి సమాధానం. రిజర్వేషన్ నువ్వు పైకి రావాడానికి, ఎదుటి వాడు మారాలంటే, వాడిని మార్చాలి, నేర్పించాలి అంతే కాని ఆస్తి దొబ్బెయ్యకూడదు. రిసర్వేషన్ ఇప్పటి కాలానికి సరిపడ సమాధానం కాదు. ప్రభుత్వం పని చెయ్యలేక... కప్పి పుచ్చుకోడానికి చేస్తున్న పనికి మాలిని పని ఇది. ప్రభుత్వ పాటశాల లన్నీ అద్భుతంగా పని చేస్తే మంచి విద్య వైద్యం ఉచితం చేస్తే ప్రతిభకే పట్టం కడితే అప్పుడూ కదా దేశం బాగుపడేది ? లేదంటె ఈ విడీయోలో చూపించి నట్టు అనర్హులు (ప్రతిభని బట్టి) అందలం ఎక్కుతారు అర్హులు (ప్రతిభని బట్టి) అట్టడుగున ఉండి పోతారు. దేశానికే నష్టం. నిజంగా ఈ సమస్య రూపుమాపాలంటే కుల మత భేదం లేకుండా అందరూ బాగా చదువు కోవాలి మీ తాతలు నేతులు తాగారు, మా తాతలు నూతులు కడిగారు అని పాత కధలు వదిలేసి ఇప్పటి మనం ఇకపై మన ముందు తరాలు ఎలాంటి భేదాలు లేకుండా ఎలా ఉండాలొ , వసుదైక కుటుంబంగా ఎలా మెలగాలో ఆలోచించాలి ! అంతే కాని అభివ్రుద్ధి చెయ్యకుండా, టివీ లు, డబ్బులు పంచి పులిహోర, సార పెట్టే వాడీని మనం కులం మతం పేరుతో ఎన్నుకుంటే ఇలానే ఉంటింది పరిస్తితి ఎప్పటికీ. నిజమే ఇది 'రిజర్వేషన్ మీద ఏడ్చే' వాడికి చెప్పుతో కొట్టే సమాధానం
‘‘మీరు సంస్కృతపండితులు కనుక సంస్కృతం కావాలి అని అంటున్నారు. అంతేకానీ ఈ రోజుల్లో సంస్కృతం ఎందుకు కావాలండీ?‘‘ అని ఒక రాజకీయపార్టీ అభిమాని ఆంధ్రవ్యాసుల వారిని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా దాదాపు 30 ఏళ్ళ క్రితం ఆంధ్రవ్యాసుల వారు ఇచ్చిన సమాధానం నేటికీ సజీవంగా నిలిచి ఉంది.
‘‘మీరు ఏం చేస్తుంటారు?‘‘ అని ఆయన్ను అడిగితే ఆయన న్యాయవాద వృత్తి చేస్తున్నాను అన్నారు.
‘‘మీకు భారత రాజ్యాంగం కంఠస్థం అయిందా? టైటిల్ పేజీ నుంచీ ఎండ్ పేజీ వరకూ మొత్తం పొల్లు పోకుండా అప్పచెప్పండి.‘‘ అని అడిగారు.
ఆయనకు ఆంధ్రవ్యాసుల వారి ప్రశ్న అర్థం కాలేదు.
ఆంధ్రవ్యాసుల వారే తిరిగి ఇలా అన్నారు.
‘‘ మీరే కాదు డాక్టర్లను కూడా ఇదే ప్రశ్నిస్తున్నాను. రోగాలు, రోగ లక్షణాలు, మందులు ఉన్న మెటీరియా ఆఫ్ మెడికాలను పొల్లుపోకుండా అప్పచెప్పగలరా? అంత వరకూ ఎందుకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని ఎవరైనా మొదటి నుంచీ చివరి వరకూ అప్పచెపగలరా? ఎవరూ చెప్పలేరు. కానీ భారతీయ శాస్త్రాలన్నీ భారతీయ పండితులకు కంఠతా వచ్చు. ఇదే భారతదేశానికి ఇతర దేశాలకు ఉన్నతేడా. భారత దేశంలో డిక్షనరీలు కూడా కంఠతా వచ్చు. అమరకోశం అటువంటిదే. ప్రపంచంలో ఏ భాషకూ లేని ప్రాభవం భారత దేశంలో సంస్కృతానికి ఉంది.
అంత వరకూ ఎందుకు గణిత శాస్ర్తం ఖగోళశాస్ర్తం కలబోసిన ఆర్యభటీయం, సూర్య సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం వంటి గ్రంథాలన్నీ పండితులకు నోటికి వచ్చు. నేడు గణితంలో పిహెచ్ డి చేసిన వారికి కూడా తమ గణిత సూత్రాలు నోటికి రావు. ఇదే నేటి దౌర్భాగ్యం. విద్యకు అతి ముఖ్యమైంది ధారణ. తమ శాస్త్ర గంథాలు అక్షరం పొల్లు పోకుండా ధారణ లేని వారికి శాస్త్రాలు ఎలా ఒంటపడతాయి? ఈ కారణం చేతనే నేడు వైద్యవృత్తి నుంచీ పాఠశాల ఉపాధ్యాయుడి వరకూ అందరికీ పుస్తకం చూడనిదే ఏ వృత్తి బాధ్యతా నిర్వర్తించలేక పోతున్నారు. పూర్వం వైద్యం, గణితం, నిర్మాణరంగం, కెమిస్ట్రీ, వృక్షశాస్త్రం అన్నీ కూడా కంఠతా వచ్చేవి. నేడు అది లోపించింది. ఇదే విద్యా బోధనలో కూడా ప్రధానమైన అడ్డంకి. ధారణ లేని, ధారణ చేయలేని చదువులు తయారయ్యాయి. దీని వల్ల విద్యార్థుల్లో మానసిక ఆందోళనలు వచ్చి ఆత్మహత్యలకు హత్యలకు దారితీస్తున్నాయి. చదువు వల్ల మానసిక సమస్యలు రావడం అనేది సంస్కృత శాస్త్రాల వల్ల లేదు. ఎప్పుడైతే మనదైన విద్యావ్యవస్థను నాశనం చేసుకొన్నామో మన పతనం అప్పుడే మొదలైంది.
విజ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే ఆధునిక ప్రపంచం విలువ ఇస్తోంది. కానీ భారతీయులు పెరిగే విజ్ఞానాన్ని గుర్తుంచుకోవడానికి ఛందస్సులు ఉపయోగించి శ్లోకాల రూపంలో సమస్త గ్రంథాలు రచించేవారు. దీని వల్ల విజ్ఞానం బుర్రలో ఉండేది. నేడు పుస్తకాల్లో ఉంటోంది. ఏ పుస్తకంలో ఏముందో గుర్తుపెట్టుకొన్నవాడు మేధావి నేడు. గతంలో పుస్తకాలే బుర్రలో పెట్టుకొన్నవాడు మేధావి. ఇదే సంస్కృతభాష లోని మహిమ. నేటి ఆధునిక కాలంలో ప్రధాన లోపం ధారణలేని, ధారణ చేయలేని దౌర్భాగ్యస్థితి.‘‘
దశాబ్దాల క్రితం ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన అంశాన్ని నిరూపించే అంశాన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకువస్తున్నాము. దీనికి ఉదాహరణగా భాస్కరాచార్య రచించిన లీలావతి గణితంలోని ఒక సూత్రం దాని ఆధారంగా కొన్ని లెక్కలు పరిశీలిద్దాం.
ఇష్ట కర్మసూత్రం (సప్పోసిషన్) ఇలా చెప్పాడు.
భావం: నీకు ఇష్టం వచ్చిన సంఖ్య అనుకో, దాన్ని ఇచ్చిన సమస్య ప్రకారం సాధించు. దాన్ని గుణించి భాగాహరించి, వివిధ భిన్నాలతో పెంచి లేదా తగ్గించగా వచ్చిన సారాంశాన్ని, దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది. దీన్నే ఇష్టకర్మ సూత్రం అంటారు.
భావం:ఒక సంఖ్యను 5 చేత హెచ్చవేయగా వచ్చిన దానిలో నుంచీ మూడో వంతు తీసి వేయగా వచ్చిన దాన్ని పదిచేత భాగాహరించి, దానికి మూడో వంతు, సగం వంతు, పావువంతులు కలిపితే రెండు తక్కువగా 70 వచ్చింది. ఇప్పుడు చెప్పు ఆ సంఖ్య ఎంత.
ఈ లెక్క మీరు చేయగలిగితే నేడు ఉన్న అనేక ప్రభుత్వ, రైల్వే, బ్యాంకు ఉద్యాగాల పోటీ పరీక్షల్లో విజేతలు కావడం చాలా తేలిక. ఇది వేద గణితం ద్వారా ఎలా సాధించాలో తెలుసుకుందాం.
ఇక్కడ ఇచ్చిన ఇష్టకర్మ సూత్రం ప్రకారం ఇక్కడ ఇచ్చిన లెక్క సాధించాలంటే ఏదో ఒక సంఖ్య అనుకోండి.
నేను 3 అనుకుంటున్నాను.
1)ఇప్పుడు ఈ 3ను 5 చేత హెచ్చవేస్తున్నాను. = 15
2) దీనిలో నుంచీ మూడో వంతు తీసి వేయమన్నాడు కనుక 15లో మూడో వంతు 5 కనుక తీసివేస్తే = 10 వచ్చింది
3)వచ్చిన దాన్ని పదిచేత భాగాహరించమన్నాడు. అంటే 10/10 =1 వచ్చింది.
4) దీనికి మూడో వంతు, సగం, పావు వంతులు కూడినది కలపాలి. అంటే (1+ 3 (1/3+1/2+1/4) )చేయాలి. = 17/4 వస్తుంది.
5) ఇప్పుడు సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది.
68ని 3చేత హెచ్చవేసి 17/4తో భాగాహరించాలి.
(68క్ష్3)/(17/4) = 68క్ష్3 క్ష్4/17 = 48
ఇక్కడ ఇచ్చిన గణిత సమస్యకు సమాధానం 48.
కావాలంటే 3 స్థానంలో 48ని ప్రవేశపెట్టి పైన చెప్పిన సోపానాలు అన్నీంటి ద్వారా 68 వస్తుంది.
ఇది గణిత వేదం అంటే.
ఇక్కడ అతి ముఖ్యమైంది ఏమిటంటే కేవలం గణిత సూత్రమే కాదు. ఉదాహృత గణితసమస్య కూడా శ్లోకం రూపంలో ఉంది. పూర్వం జ్యోతిష పండితులు భగవద్గీత మాదిరిగా ఈ గణిత సూత్రం, ఈ గణిత సమస్య కూడా కంఠతా పట్టి ధారణ చేసేవారు. కనుక జీవితంలో తాము చదువుకున్న చదువు మరిచిపోవడం అంటూ జరిగేది కాదు.
లీలావది అనే బీజ గణితంలో మనోరంజన భాష్య కారులు ఇచ్చిన మంచి రొమాంటిక్ సమస్య ఇప్పుడు ఇస్తున్నాము. దీన్ని పై విధానంలో కనుగొనేందుకు ప్రయత్నించండి.
మంచి వయసులో ఉన్న జంట శృంగారంలో ఉండగా ఆమె మెడలోలని ముత్యాల దండ తెగిపోయి భూమి మీద మూడో వంతు ముత్యాలు పడ్డాయి. పక్కమీద ఐదో భాగం పడ్డాయి. ఆరో వంతు ఆమె జుట్టులో చిక్కుకున్నాయి. పడిపోతున్న ముత్యాలలో పదో వంతు జతగాడు పట్టుకొన్నాడు. దండలో ఆరు ముత్యాలు ఇంకా మిగిలాయి. ఇప్పుడు చెప్పండి ఆమె మెడలోని ముత్యాల దండలో ఎన్ని ముత్యాలు ఉన్నాయి?
ఇక్కడ కూడా ఆరు ముత్యాలు ఉన్నాయి అని చెప్పి మొత్తం ముత్యాలు ఎన్నో కనుక్కో మన్నాడు కనుక ఇష్టకర్మ సూత్రం ప్రకారం కనుక్కోవచ్చు. కనుక దాన్ని ఉపయోగించి కనుక్కుందాం.
1) ముందుగా ఎంతో కొంత అనుకోవాలి కనుక నేను 60 ముత్యాలున్నాయి అనుకుంటున్నాను.
2) వీటిలో మూడో వంతు భూమి మీద పడ్డాయి అంటే నేను అనుకొన్న 60 ముత్యాలలో మూడో వంతు అంటే 20 ముత్యాలు భూమి మీద పడ్డాయి.
3) పక్కమీద ఐదో వంతు పడ్డాయి. 60 లో 5 వంతు అంటే 12 పక్కమీద పడ్డాయి.
4) ఆరోవంతు జుట్టులో చిక్కుకున్నాయి అంటే 60లో 6 వంతు 10 జుట్టులో చిక్కుకొన్నాయి.
5)జతగాడు పదోవంతు పట్టుకొన్నాడు. అంటే 60లో 10 వంతు 6 ముత్యాలు పట్టుకొన్నాడు.
ఇప్పుడు మొత్తం ఎన్ని ముత్యాలు కనుగొన్నాము 20+12+10+6 = 48
సారాంశంగా మిగిలినవి = మనం అనుకొన్న 60 -48 =12
6) ఇప్పుడు ఇష్టకర్మసూత్రం ప్రయోగిద్దాం. సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది.
దత్త సంఖ్య =6 ముత్యాలు. మనం అనుకొన్నది 60 ముత్యాలు. సారాంశం =12
సూత్రం ప్రకారం దత్తసంఖ్య క్ష్ ఇష్ట సంఖ్య / సారాంశం = 6క్ష్60/12 = 30 ముత్యాలు.
ఆమె మొత్తం దండలో 30 ముత్యాలున్నాయి. కావాలంటే పైన ఇచ్చిన భిన్నాలతో సరిచూసుకోండి. మీకు ఆమె చేతిలో మిగిలిన 6 ముత్యాలు సమాధానంగా వస్తుంది.
ఇది వేదగణితం.
ఇప్పుడు చెప్పండి. గణితంలో పిహెచ్ డీ చేసిన వాళ్లెవరైనా తమ పాఠ్య గ్రంథాలు, సైద్ధాంతిక గ్రంథాల్లో ఈ మాదిరిగా ఉదాహృత ప్రాబ్లమ్స్ తో పాటు గుర్తుంచుకోగలిగారా?
ఇది కాదా సంస్కృత భారతి దివ్యమైన మహిమ?
మాకు తెలిసి దీన్ని బీజ గణిత శాస్త్రం అంటారు. ఇది భారత జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందింది. మీ మేక మెదళ్లకు, సెక్యులర్ గ్రహణం పట్టిన పైశాచిక బుర్రలకు ఇది తెలియకపోతే తెలుసుకోండి.
అన్నిటికీ మించి ఇంత బాగా భిన్నాలు, భాగాహారాల గురించి చెప్పగలిగిన విద్యావ్యవస్థనేటి రాక్షసగురువులఆంగ్లవిద్యావిధానంలో ఉందా? ఇందులో ఆవగింజలో వెయ్యోవంతుకూడా లేని సమస్యలు సాథిస్తే ప్రభుత్వ తాబేదార్ల ఉద్యోగాలు ఇచ్చే దౌర్భాగ్య విద్యా వ్యవస్థ తయారైంది. నేటి విద్యావ్యవస్థ గొప్పదా? వేదగణితకాలం గొప్పదా తేల్చుకోండి. ఇది ఇప్పటికీ కావాలా వద్దో కూడా తెలుసుకోండి.
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా..
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. నాగన్న
ఆ గట్టునేమో దేవుళ్ళ దోపిడుంది,
మంత్రాల మత్తు ఉంది, స్వర్గాల పిచ్చి ఉందీ,
ఈ గట్టునేమో విజ్ణాన విత్తు ఉంది.
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. ఆ దిబ్బనేమో ముల్లాల ఫత్వ ఉంది, పోపుల పైత్యముంది, బాబాల బురద ఉందీ, ఈ దిబ్బనేమో న్యాయపు కోర్టుంది. ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా.. ఆ గడపనేమో కాషాయ సుత్తి ఉంది, పచ్చోడి కత్తి ఉంది, తెల్లోడి సొత్తు ఉందీ, ఈ గడపనేమో కష్టించె సత్తువుంది. ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా.. నాగన్న ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా.. ఆ ఏపునేమో కులాల కంపు ఉంది, కాఫిర్ల రక్తముంది, కృసేడ్ల కచ్చ ఉందీ, ఈ ఏపునేమో మానవతా వాదముంది. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా… నాగన్న
ఆ గట్టునేమో లేచేటి శవముంది చంపేటి దైవముంది, తాగేటి రాయి ఉందీ ఈ గట్టునేమో మనిషయ్యే మార్గముంది !!!
Islands tend to create a paradoxical trend in evolution, which biologists call as "The Island rule" or "Foster's rule".
Something weird happens to animals when they cut themselves off from the mainland. To put it simply, large species such as elephants and hippos tend to get smaller if they spread to an island environment, while small species such as rodents and insects have a tendency to get bigger. Komodo dragon,elephant birds,dwarf mammoths, dwarf hippopotamuses,The mammoths of Wrangel Island and even Homo florescence are some examples of island rule.
In Island environments,whats different is that there are fewer predators and fewer competitors.
In Islands, small critters would face both fewer predators and fewer competitors, giving them plenty of space to get bigger. But big animals like elephants don't really worry much about predators or competitors, Their chief concern would be lack of resources to sustain themselves. For them, a smaller habitat means they have to be smaller to survive. The central factor that drives the changing size is energy consumption: all changes arise from the animal's energy needs, and how much energy it can gain in any given amount of time.So whatever benefit the change of size grants island animals, it's clearly significant enough to kick natural selection into overdrive.
Humans are social animals, so companies have almost same dynamics as in nature and natural selection implies.Based on the nature of work and operation model of a company and the employee strengths and weaknesses each employee can be related to some animal traits. what I strongly believe is that a best team composes employees of all natures so that its balanced. You cannot build a good team with all lions.
Critical responsibilities of leadership is making sure you have the right people in the right positions. You can have one of the most talented people in the world on your team but if you don’t put them in a position to succeed then their chance at success goes way way down. Albert Einstein said that “Everybody is a genius. But if you judge a fish by it’s ability to climb a tree, it will spend it’s whole life believing that it is stupid.” So it is with people too! You may not see all of your people as geniuses but each of them indeed has their own set of strengths and as a leader it is incumbent upon you to make certain that those strengths are put to good use.Too many leaders are almost completely unaware of the totality of their people’s strengths and that results in people locked into jobs that are often far below their abilities. Underutilized people become unmotivated people in the blink of an eye. If you don’t know what you have in your people you’ll likely never get it out of them. You run the risk of demotivating the very people you need to be as engaged as possible.
Not providing your people the opportunity to fully utilize their skills is one of the fastest ways to lose them. If you’re lucky once you lose them they will move on to greener pastures, if you’re not lucky then you’ll lose them and they will stay in your organization.
Companies/teams can be called Islands if they cant identify the strengths and weaknesses of their employees and healthy competition is not maintained.
So what are you becoming a dwarf or a giant, or working to the brink of your potential?
**Compilation !! - taken from multiple sources i read recently.